IND vs ENG: ధర్మశాలలో దంచేశారు.. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు.. తొలి రోజు టీమ్‌ఇండియాదే

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు టీమ్‌ఇండియా (Team India) ఆధిపత్యం ప్రదర్శించింది. 

Updated : 07 Mar 2024 17:40 IST

ధర్మశాల: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు టీమ్‌ఇండియా (Team India) పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇటు బౌలింగ్‌లో, అటు బ్యాటింగ్‌లో అదరగొట్టి శీతల ప్రాంతమైన ధర్మశాలలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్ట్టించింది. భారత స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (79; 108 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగిలిన బ్యాటర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలిరోజు ఆట ముగిసేసరికి 135/1 స్కోరుతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఇంకా 83 పరుగుల వెనకంజలో ఉంది. యశస్వి జైస్వాల్ (57; 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. రోహిత్ శర్మ (52*; 83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (26; 39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నారు. భారత ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన తీరు టీ20 మ్యాచ్‌ని తలపించింది. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ ఔటైన తర్వాత వచ్చిన గిల్‌ కూడా నిలకడగా ఆడాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని