IND vs ENG: ఆ ఆరుగురివి 151.. యశస్వి ఒక్కడే 179*.. తొలి రోజు భారత్ 336/6
ఇంగ్లాండ్తో రెండో టెస్టులో (IND vs ENG) భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకంతో కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం వేదికగా భారత్ - ఇంగ్లాండ్ (IND vs ENG) జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (179*; 256 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లు) భారీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. క్రీజ్లో యశస్వితోపాటు అశ్విన్ (5*) ఉన్నాడు. ఇంగ్లాండ్ అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్తోపాటు రెహాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (14) వికెట్తో బషీర్ అంతర్జాతీయ క్రికెట్లో ఖాతా తెరవడం విశేషం. సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్, స్పిన్నర్ టామ్ హార్ట్లీ చెరో వికెట్ తీశారు.
ఆ ఒక్కడే నిలబడి..
ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి (Yashasvi Jaiswal) క్రీజ్లో కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోలేదు. రోహిత్తో కలిసి తొలి వికెట్కు 40 పరుగులు జోడించాడు. శుభ్మన్ (34)తో రెండో వికెట్కు 49, శ్రేయస్ అయ్యర్ (27)తో మూడో వికెట్కు 90, అరంగేట్ర బ్యాటర్ రజత్ పటీదార్ (32)తో నాలుగో వికెట్కు 70, అక్షర్ పటేల్తో (27) ఐదో వికెట్కు 52 పరుగులు జోడించాడు యశస్వి.
స్పిన్నర్లు, పేసర్ ఎంత ఇబ్బందిపెట్టినా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో భారీ సిక్స్తో సెంచరీ సాధించడం విశేషం. 151 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న జైస్వాల్ ఆ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించాడు. తొలి రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా.. లోకల్ బాయ్ శ్రీకర్ భరత్ (17)ను రెహాన్ బోల్తా కొట్టించాడు. ఆఫ్సైడ్ వెళ్తున్న బంతిని కట్ చేసేందుకు యత్నించి బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద బషీర్కు చిక్కాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం