T20 World Cup 2024: వేటకు వేళాయె..
టీ20 ప్రపంచకప్లో రోహిత్ సేన తొలి దశ దాటడం కష్టమేమీ కాకపోవచ్చు. గ్రూప్ దశలో లక్ష్యమల్లా పాకిస్థాన్ను మట్టికరిపించి అగ్రస్థానంతో సూపర్-8కు అర్హత సాధించడమే. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసే ఆ పోరుకు ఇంకో నాలుగు రోజుల సమయం ఉండగా.. ఈలోపు ఆటగాళ్లందరూ అమెరికా వాతావరణానికి అలవాటు పడడానికి, లయ అందుకోవడానికి ఓ మంచి అవకాశం.
ప్రపంచకప్లో రోహిత్సేన ఆట నేటి నుంచే
తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో ఢీ
టీ20 ప్రపంచకప్లో రోహిత్ సేన తొలి దశ దాటడం కష్టమేమీ కాకపోవచ్చు. గ్రూప్ దశలో లక్ష్యమల్లా పాకిస్థాన్ను మట్టికరిపించి అగ్రస్థానంతో సూపర్-8కు అర్హత సాధించడమే. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసే ఆ పోరుకు ఇంకో నాలుగు రోజుల సమయం ఉండగా.. ఈలోపు ఆటగాళ్లందరూ అమెరికా వాతావరణానికి అలవాటు పడడానికి, లయ అందుకోవడానికి ఓ మంచి అవకాశం. చిన్న జట్టు ఐర్లాండ్తో భారత్ తొలి పోరు బుధవారమే. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోకుండా.. పాక్తో పోరుకు ముందు మంచి ఫామ్ను అందుకోవడానికి ఈ మ్యాచ్ను టీమ్ఇండియా ఉపయోగించుకోవాలి.
న్యూయార్క్
టీ20 ప్రపంచకప్లో భారత్ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. రోహిత్సేన బుధవారం ఐర్లాండ్ను ఢీకొనబోతోంది. బలాబలాల్లో భారత్కు, ఐర్లాండ్కు పోలిక లేదు. కానీ ఐర్లాండ్ను చిన్న జట్లలో పెద్దదిగా చెప్పొచ్చు. అసోసియేట్ దేశాలపై ఆధిపత్యం చలాయించే ఆ జట్టు.. అప్పుడప్పుడూ పెద్ద జట్లకూ షాకులిస్తుంటుంది. గత ఏడాది టీ20 సిరీస్లో బుమ్రా నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టుకు ఐర్లాండ్ గట్టి పోటీనిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల్లో ఆడే స్టిర్లింగ్, లిటిల్, క్యాంఫర్, అడైర్ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు మెరుగ్గానే కనిపిస్తోంది. కాబట్టి చిన్న జట్టన్న ఉదాసీనత రానివ్వకుండా.. టీమ్ఇండియా తన స్థాయికి తగ్గట్లు ఆడి విజయం సాధించాల్సిన అవసరముంది.
ఎవరు.. ఎక్కడ?: తొలి మ్యాచ్లో భారత్ విజయం లాంఛనమే కావచ్చు. ఇందులో ఘనంగా గెలవడమే కాక.. కూర్పు సరిచూసుకోవడానికి, ఆటగాళ్లు లయ అందుకోవడానికి ఉపయోగించుకోవాలనుకుంటోంది టీమ్ఇండియా. ఎక్కువ మంది ఆల్రౌండర్లు జట్టులో ఉండేలా చూస్తామని రోహిత్ చెప్పిన నేపథ్యంలో శివమ్ దూబె తుది జట్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం కావొచ్చు. రోహిత్తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశముంది. సూర్యకుమార్ మూడో స్థానంలో, రిషబ్ పంత్ ఆ తర్వాత బ్యాటింగ్కు దిగొచ్చు. హార్దిక్ వీరి తర్వాత వస్తాడు. ఐపీఎల్లో, బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్లో అక్షర్ పటేల్ చక్కగా బౌలింగ్ చేశాడు. అతను బ్యాట్తోనూ ఫామ్లో ఉన్నాడు. జడేజా ఊపు తగ్గిన నేపథ్యంలో అతడి బదులు అక్షర్నే ఆడించే అవకాశాలను కొట్టిపారేయలేం. స్పెషలిస్టు స్పిన్నర్లలో కుల్దీప్ ఒకడికే అవకాశం దక్కొచ్చు. బుమ్రాతో కలిసి అర్ష్దీప్, సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. పిచ్ స్పిన్కు ఎక్కువ అనుకూలం అనుకుంటే.. సిరాజ్ స్థానంలో చాహల్ ఆడే అవకాశముంది.
ఆల్రౌండర్ల నిలయం: 2011 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్ను ఓడించి సంచలనం రేపిన దగ్గర్నుంచి ఐర్లాండ్ను అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరూ తేలిగ్గా తీసుకోవట్లేదు. ముఖ్యంగా జట్ల మధ్య అంతరం తక్కువగా ఉండే టీ20ల్లో ఎక్కువగా ఆల్రౌండర్లతో నిండిన ఐర్లాండ్తో జాగ్రత్తగా ఉండాల్సిందే. క్యాంఫర్, అడైర్, డెలానీ, డాక్రెల్, టెక్టార్, స్టిర్లింగ్.. ఇలా ఆరుగురు ఆల్రౌండర్లను తుది జట్టులో ఆడిస్తుంది ఐర్లాండ్. వీరిలో స్టిర్లింగ్ ఈ మధ్య బ్యాటింగ్కే పరిమితమవుతున్నాడు. ఓపెనింగ్లో అతను దూకుడుగా ఆడి జట్టుకు మెరుపు ఆరంభాలనిస్తుంటాడు. కెప్టెన్ బాల్బిర్నీ కూడా ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు. టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్.. ఇలా కింది వరుస వరకు బ్యాటుతో సత్తా చాటగలరు. బౌలింగ్లో లిటిల్, యంగ్, అడైర్ కీలకం.
పిచ్ బౌలర్లదే!
న్యూయార్క్ క్రికెట్ స్టేడియం ప్రపంచకప్లో ఇప్పటికే ఓ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. అందులో శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలగా.. అంత చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి దక్షిణాఫ్రికా చాలా కష్టపడింది. 4 వికెట్లు కోల్పోయి 16వ ఓవర్లలో కానీ విజయాన్నందుకోలేకపోయింది. దీన్ని బట్టే ఇక్కడ బౌలర్లదే హవా అని అర్థమవుతోంది. ఇక్కడే బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా బాగానే బ్యాటింగ్ చేసింది. 5 వికెట్లకు 182 పరుగులు సాధించింది. కానీ బంగ్లా మాత్రం 122/9కి పరిమితమైంది. ఆ అనుభవం భారత బ్యాటర్లు, బౌలర్లకు ఉపయోగపడేదే. అయితే దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్ పిచ్పై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో పిచ్ ఈసారి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఐర్లాండ్తో ఎనిమిది టీ20 మ్యాచ్లు ఆడిన భారత్.. అందులో ఏడు గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు.
‘‘కోచ్గా కొనసాగాలని ద్రవిడ్ను ఒప్పించడానికి ప్రయత్నించా. కానీ అతడికీ చాలా పనులు ఉంటాయి కదా. నేను మాత్రం అతడితో కలిసి పని చేయడాన్ని ఆస్వాదించా. మిగతా ఆటగాళ్లు కూడా నాలాగే భావిస్తూ ఉంటారు. నేను ఐర్లాండ్లో అరంగేట్రం చేసినప్పుడు అతడే కెప్టెన్. మాకు అతడు ఆదర్శం’’
రోహిత్ శర్మ
తుది జట్లు (అంచనా).. భారత్: రోహిత్ (కెప్టెన్), కోహ్లి, సూర్యకుమార్, పంత్, దూబె, హార్దిక్, జడేజా/అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్దీప్, సిరాజ్.
ఐర్లాండ్: బాల్బిర్నీ (కెప్టెన్), స్టిర్లింగ్, టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్, మెకార్తీ, యంగ్, వైట్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి