Street Child World Cup 2023: ఆ బాలలకు ప్రపంచకప్ ఆనందం
భారత్లో వన్డే క్రికెట్ ప్రపంచకప్ (ODI World Cup 2023) ఆరంభానికి ముందే ఈ స్ట్రీట్ చిల్డ్రన్ కప్ మొదలైంది. అందులో ఆడే వారు కొంతమంది అనాథలు.. ఇంకొందరు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న వాళ్లు.. మురికివాడల్లో జీవిస్తున్నవాళ్లు!
వారిలో కొంతమంది అనాథలు.. ఇంకొందరు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న వాళ్లు.. మురికివాడల్లో జీవిస్తున్నవాళ్లు! అలాంటి వారి మోములో ఆనందం నింపడం కోసం ఓ ప్రపంచకప్ వచ్చింది. భారత్లో వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఈ స్ట్రీట్ చిల్డ్రన్ కప్ మొదలైంది. మిక్స్డ్ జండర్ ఈవెంట్గా జరుగుతున్న ఈ టోర్నీ చెన్నై వేదికగా షురూ అయింది. వీధి బాలల్లో క్రికెట్ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ ప్రపంచకప్ను నిర్వహిస్తున్నారు. భారత్తో పాటు ఇంగ్లాండ్, బురుండీ, హంగేరీ, మారిషస్, బంగ్లాదేశ్, నేపాల్, రువాండా, మెక్సికో, శ్రీలంక, దక్షిణాఫ్రికా నుంచి క్రికెటర్లు ఈ కప్లో పాల్గొనబోతున్నారు. వీధి బాలల కోసం ప్రపంచకప్ జరగడం ఇది రెండోసారి.
ఒక్కొక్కరిది ఒక్కో గాథ
తినడానికే తిండి లేక.. ఉండటానికి ఇళ్లు లేక.. నా అనే దిక్కులేక ఎన్నో బాధలు అనుభవించే వీధి బాలలు క్రికెట్ ఆడడం ఏంటి? అందులోనూ ప్రపంచకప్లో పోటీపడడం ఏంటి? అనే అనుమానాలు వస్తాయి. అయితే క్రికెట్ ఆట మీద వారికి ఉన్న ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. సౌకర్యాలు లేకపోయినా వివిధ ఎన్జీవోల ద్వారా, దాతల ద్వారా ఆటలో నైపుణ్యం సంపాదించిన ఈ చిన్నారులు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ విషయానికొస్తే సానియా, శ్రవణ్, జన్నత్, ఫర్జానా, సంధ్య లాంటి వాళ్లు ఈ కప్లో పోటీపడుతున్నారు.
నిజానికి వారికి ఇలాంటి ఈవెంట్లో ఆడడమే పెద్ద కల. ఎందుకంటే పస్తులు ఉండే స్థితి నుంచి ఇలా బ్యాటు, బంతి పట్టి మైదానంలోకి వచ్చి ఆడడం మామూలు విషయం కాదు. కులీ పని చేసే నాన్న, పని మనిషిగా పని చేసే అమ్మ.. ఇది జన్నత్ నేపథ్యం. ఆర్థిక ఇబ్బందులతో చదువు కూడా మానేసింది. కానీ ఎన్జీవో సాయంతో మళ్లీ చదువుకుంటోంది. అంతేకాదు క్రికెట్ను నేర్చుకుని ఇప్పుడు ప్రపంచకప్ ఆడుతోంది. మరోవైపు బిహార్కు చెందిన శ్రవణ్ను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చదువు చెప్పిస్తోంది. అతడికి క్రికెట్ను పరిచయం చేసి సానబట్టింది. దిల్లీలోని ఒక మురికివాడకు చెందిన కరణ్ది కూడా ఇదే పరిస్థితి. కనీస సౌకర్యాలు లేని స్థితి నుంచి ఈ కుర్రాడు ఆటలో ఎదిగాడు. రైల్వే ట్రాక్ల పక్కన క్రికెట్ ఆడి మెరుగయ్యాడు.
ఎలా ఆడుతున్నారంటే..
ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల నుంచి 20 జట్లు ఈ ప్రత్యేక ప్రపంచకప్లో పోటీపడుతున్నాయి. 168 మంది చిన్నారులు ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. బాలికలు, బాలుర కలిసి ఆడడం ఈ కప్ ప్రత్యేకత. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రతి టీమ్లో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు ఆడతారు. బకెట్ లిస్ట్, చెట్నా, హోప్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, సలామ్ బాలక్ ట్రస్ట్ లాంటి సంస్థలు వీధి బాలల కోసం అండగా నిలుస్తున్నాయి. వారికి అవసరమైన దుస్తులు, షూస్తో పాటు ఆహారం, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నాయి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్