Asia Cup 2023: పాక్లో ఆసియాకప్ ఆడబోం..: జైషా
వచ్చే ఏడాది ఆసియాకప్ పాకిస్థాన్లో కాకుండా తటస్థవేదికపై ఆడవచ్చని జైషా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్గా కూడా షా వ్యవహరిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్లో వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్-2023లో భారత్ జట్టు పాల్గొనబోదని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ముంబయిలో మంగళవారం జరిగిన బీసీసీఐ 91వ వార్షిక సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆసియాకప్ పాకిస్థాన్లో కాకుండా తటస్థవేదికపై ఆడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్గా కూడా షా వ్యవహరిస్తున్నారు. దీంతో పాక్లో ఈ టోర్నీ జరగడంపై కూడా సందేహాలు ముసురుకొన్నాయి. ఈ అంశంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. ముంబయిలో ఏజీఎం అనంతరం జైషా మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్ తటస్థ వేదికపై జరుగుతుంది. నేను ఏసీసీ అధ్యక్షుడిగా ఈ మాట చెబుతున్నా. మేము అక్కడికి వెళ్లము. వారు ఇక్కడికి రారు. గతంలో కూడా ఆసియాకప్లు తటస్థ వేదికలపై నిర్వహించాం’’ అని వ్యాఖ్యానించారు.
ఇక భారత్ చివరి సారిగా 2006లో పాక్లో పర్యటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో 2012-13 నుంచి భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడలేదు. ప్రపంచ స్థాయి టోర్నీలు, ఆసియాకప్ల్లో మాత్రమే పరస్పరం తలపడుతున్నాయి. భారత్-పాక్లు చివరి సారిగా యూఏఈలో 2022 టీ20 ఆసియాకప్లో తలపడ్డాయి. ఈ నెల 23న టీ20 ప్రపంచ కప్లో కూడా మరోసారి దాయాదుల పోరు జరగనుంది.
నేడు ముంబయిలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రోజర్ బిన్నీని బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. బిన్నీ ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జైషా కార్యదర్శిగా మరోసారి కొనసాగనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల