100th Test: అశ్విన్ మ్యాజికా.. బెయిర్స్టో షోనా.. వందో టెస్టులో మెరిసేదెవరో!
IND vs ENG మధ్య జరిగే ఐదో టెస్టులో భారత బౌలర్ అశ్విన్.. ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్స్టోలు తమ కెరీర్లో వందో టెస్టు ఆడుతున్నారు. మరి, ఈ మ్యాచ్లో మెరిసిదేవరో..
ధర్మశాలలో భారత్-ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య జరిగే సిరీస్లో ఆఖరిదైన అయిదో టెస్టుకు ఓ ప్రత్యేకత ఉంది. టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో (Jonny Bairstow)లకు ఇది కెరీర్లో వందో టెస్టు. ఇప్పటికే సిరీస్ను 3-1తో కైవసం చేసుకున్న భారత్కు ఆఖరి మ్యాచ్లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేసి ఇంకో విజయాన్ని అందిస్తాడా.. లేక సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్కు బెయిర్స్టో బ్యాట్తో ఏమైనా అండగా నిలుస్తాడా అనేది ఆసక్తికరం.
అశ్విన్ అలా..
ఈ సిరీస్ను టీమ్ఇండియా కైవసం చేసుకోవడంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ది కీలకపాత్ర. 4 టెస్టుల్లో 17 వికెట్లు తీసిన అతడు.. బ్యాటింగ్లోనూ కొన్ని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలర్, బ్యాటర్గానే కాక ఒక ఆటగాడిగా ఈ సిరీస్లో తన కమిట్మెంట్ కూడా చాటుకున్నాడు. మూడో టెస్టు మధ్యలో వ్యక్తిగత కారణంతో జట్టును వీడినా.. వెంటనే తిరిగి వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. నిజానికి ఇంట్లో ఒకరికి బాగోలేనప్పుడు వెంటనే రావడం అనేది ఆటకు అశ్విన్ ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో చెప్పడానికి ఉదాహరణ. వందో టెస్టు రూపంలో అతడి ముంగిట పెద్ద మైలురాయి ఉంది. ఈ సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన అశ్విన్.. ఆఖరి టెస్టులోనూ తన మార్కు చూపించి జట్టుకు 4-1తో విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న అశ్విన్.. 100వ టెస్టు ఆడబోతున్న 14వ భారత ఆటగాడిగా నిలవబోతున్నాడు. అంతేకాదు తొలి తమిళనాడు క్రికెటర్ కూడా. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్.. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఒంటిచేత్తో భారత్కు ఎన్నో విజయాలు అందించాడు. 23.91 సగటుతో వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఈ స్టార్ స్పిన్నర్ అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్లో అదరగొడితే టీమ్ఇండియాకు తిరుగుండదు.
బెయిర్స్టో ఇంకోలా..
భారత్తో సిరీస్లో ఇంగ్లాండ్ స్టార్ జానీ బెయిర్స్టో మాత్రం ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సిరీస్లో నాలుగు టెస్టుల్లో ఒక్కటి కూడా తన మార్కు ఇన్నింగ్స్ లేదు. ఎనిమిది ఇన్నింగ్స్ల్లో బెయిర్స్టో అత్యధిక స్కోరు 38 మాత్రమే. అది కూడా నాలుగో టెస్టులో సాధించాడు. మూడో టెస్టులో (0; 4 పరుగులు) అయితే ఒక్క ఇన్నింగ్స్లోనూ రెండంకెల స్కోరు కూడా చేయలేదు. 2012లో తొలి టెస్టు ఆడిన బెయిర్స్టో.. ఇంగ్లాండ్కు నమ్మదగ్గ ఆటగాడి పేరు దక్కించుకున్నాడు.
ఇటీవల ఫామ్ కోల్పోయినా..100వ టెస్టులోనైనా సత్తా చాటుతాడని ఆ జట్టు భావిస్తోంది. కోచ్ బ్రెండన్ మెక్కలమ్ కూడా తాజాగా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కెరీర్లో అరుదైన మైలురాయి అందుకుంటున్న బెయిర్స్టో కచ్చితంగా ధర్మశాల టెస్టును చిరస్మరణీయం చేసుకుంటాడని భావిస్తున్నట్లు మెక్కలమ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ధర్మశాల టెస్టు బ్యాటర్గా పెద్ద పరీక్షే. ఇంగ్లాండ్ గౌరవంగా ఈ సిరీస్ను ముగించాలన్నా.. కెరీర్ నిలబడాలన్నా బ్యాటింగ్లో రాణించడం బెయిర్స్టోకు అత్యావశ్యకం.
మరో విశేషం ఏమిటంటే అశ్విన్, బెయిర్స్టో మాత్రమే కాదు న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ కూడా తాజాగా 100 టెస్టుల మైలురాయిని అందుకోబోతున్నారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఈ ఘనత సాధించనున్నారు. టెస్టు చరిత్రలో ఇలా ఒకేసారి నలుగురు క్రికెటర్లు 100 టెస్టుల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి.
-ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్