Rishabh Pant: పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు.
దాదాపు ఏడాదిన్నరగా ఎదురుచూపులు. ఆ యువ ఆటగాడు ఎప్పుడు తిరిగి మైదానంలోకి అడుగుపెడతాడో అనే నిరీక్షణ. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన అతనికి రోడ్డు ప్రమాదం రూపంలో బ్రేక్ పడింది. ప్రాణాలైతే దక్కాయి కానీ ఆ ఘటనతో కెరీర్ ప్రమాదంలో పడింది. మళ్లీ ఆడటం అనుమానంగా మారింది. కానీ ఆ యోధుడు ఆగిపోలేదు. ఆగిపోతే యోధుడు ఎలా అవుతాడు? అందుకే కోలుకున్నాడు. తిరిగి పుంజుకున్నాడు. మైదానంలో అడుగుపెట్టాడు. మునుపటిలా మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనే.. రిషబ్ పంత్. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై మెరుపు అర్ధశతకంతో మునుపటి పంత్ను గుర్తుచేశాడు.
అద్భుతం
చెన్నైపై పంత్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి. కేవలం అతను పరుగులు చేసిన విధానమే కాదు ఆ స్థాయికి తిరిగి చేరుకోవడానికి అతను పడ్డ కష్టం ఎంతో విలువైంది. అసలు పంత్ తిరిగి క్రికెట్ ఆడతాడా? అనే సందేహాలు వినిపించాయి. ఒకవేళ ఆడినా మునుపటిలా రాణిస్తాడా? అనే ప్రశ్నలు కలిగాయి. వీటన్నింటికీ ఈ ఒక్క ఇన్నింగ్స్తో పంత్ సమాధానమిచ్చాడు. సంకల్పబలం ఉండాలే కానీ సవాళ్లను దాటడం సులువేనని చాటాడు. ఆటపై ప్రేమతో తనను తాను మళ్లీ ఆటగాడిగా నిలబెట్టుకున్నాడు. పూర్తిస్థాయిలో వికెట్ కీపింగ్ బాధ్యతలకు తోడు జట్టును నడిపించే భారం అతనిపై ఉంది. ఇక బ్యాటింగ్లోనూ అతనే కీలకం. ఈ పరిస్థితుల్లో ఒక్క ఇన్నింగ్స్తో ఇటు బ్యాటర్గా మెరిసి.. అటు కెప్టెన్గా ఈ సీజన్లో జట్టు తొలి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
పంత్పై భారం
సుదీర్ఘ విరామం తర్వాత పంత్ ఈ లీగ్తోనే పునరాగమనం చేస్తున్నాడనగానే అందరి ఫోకస్ అతనిపైనే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో అతనిపై భారం ఎక్కువగా ఉంది. దిల్లీ తొలి రెండు మ్యాచ్ల్లో మధ్య ఓవర్లలో మెరుగ్గా ఆడలేక ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ల్లో పంత్ వరుసగా 18, 28 పరుగులే చేశాడు. లయ అందుకోవడానికి అతనికి ఆ మ్యాచ్లు అవసరమయ్యాయి. ఇప్పుడు చెన్నైతో మ్యాచ్లో చెలరేగిపోయాడు. మధ్య ఓవర్లలో ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. సీఎస్కేతో మ్యాచ్లోనూ మిచెల్ మార్ష్, స్టబ్స్ విఫలమయ్యారు. అక్షర్ పటేల్ వేగంగా ఆడలేకపోయాడు. పంత్ ఇన్నింగ్స్ లేకపోయి ఉంటే దిల్లీ మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. ఈ నేపథ్యంలో తన పాత్రను పంత్ చక్కగా పోషించాడు.
పొట్టి కప్పు దారిలో...
ఐపీఎల్ ముగియగానే జూన్ 1న టీ20 ప్రపంచకప్ ఆరంభమవుతుంది. 2007 తర్వాత మరోసారి పొట్టి కప్పు గెలవలేకపోయిన భారత్ ఈ కప్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2013 తర్వాత ఐసీసీ టోర్నీలో జయకేతనం ఎగురవేయలేకపోయిన టీమ్ఇండియా ఈ పొట్టి కప్తో నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది. ఆ దిశగా జట్టుకు పంత్ ఎంతో అవసరం. పంత్ గైర్హాజరీలో జట్టు చాలామంది వికెట్ కీపర్లను ప్రయత్నించి చూసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ పరిగణనలో లేడనే చెప్పాలి. జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్, అవసరమైతే కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ రేసులో ఉన్నారు. కానీ వీళ్లపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. అదే పంత్ ఈ సీజన్లో దూకుడు కొనసాగించి తిరిగి టీమ్ఇండియాలోకి వస్తే జట్టుకు లాభం కలుగుతుంది. ఇప్పుడీ ఇన్నింగ్స్తో పంత్కు కొత్త ఆరంభం దక్కింది. ఇలాగే సాగితే టీ20 ప్రపంచకప్లోనూ కచ్చితంగా ఆడతాడు. ఆ టోర్నీలోనూ సత్తా చాటి ఐసీసీ టోర్నీలో భారత్ నిరీక్షణకు తెరదించాలన్నది అభిమానుల ఆకాంక్ష.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత