Sunil Chhetri: చివరి మ్యాచ్ డ్రా.. అంతర్జాతీయ కెరీర్కు ఛెత్రి వీడ్కోలు
టీమ్ఇండియా స్టార్ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. తన అంతర్జాతీయ కెరీర్లో కువైట్తో చివరి మ్యాచ్ ఆడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్బాల్ అంతర్జాతీయ వేదికపై టీమ్ఇండియా స్టార్ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి (Sunil Chhetri) శకం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు ‘2026 ఫిఫా వరల్డ్ కప్’ క్వాలిఫయర్లో భాగంగా గురువారం తన చివరి మ్యాచ్ కువైట్తో ఆడి.. అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. రెండు జట్లూ గోల్ కొట్టకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫలితంగా క్వాలిఫయర్స్లో మూడో రౌండ్కు చేరుకునే అవకాశాలు భారత్కు సంక్లిష్టంగా మారాయి.
అభిమానుల జోష్..
తమ అభిమాన ఆటగాడికి వీడ్కోలు పలికేందుకు భారీఎత్తున చేరుకున్న ఆయన ఫ్యాన్స్తో కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నిండిపోయింది. ఛెత్రికి చెందిన 11 నంబర్ జెర్సీ ధరించి, ‘సునీల్.. సునీల్’ అంటూ వారంతా మైదానాన్ని హోరెత్తించారు. భార్య సోనమ్, తొమ్మిది నెలల కుమారుడు స్టాండ్స్లో నిలబడి అతడిని ఉత్సాహపరిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ‘ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF)’ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే, బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరుప్ భట్టాచార్య అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు’: సునీల్ ఛెత్రి
భారత్ తరఫున 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టిన ఛెత్రి ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్ల్లో 94 గోల్స్ కొట్టాడు. ప్రపంచ స్థాయిలో తనకంటే రొనాల్డో (128), అలీ డాయ్ (108), మెస్సి (106)లు మాత్రమే ముందున్నారు. అంతర్జాతీయంగా ఇప్పుడున్న యాక్టివ్ ప్లేయర్లలో ఎక్కువ గోల్స్ చేసిన మూడో ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. భారత్ తరఫున అతడే టాప్ స్కోరర్. 2005 జూన్ 12న పాకిస్థాన్ జట్టుతో ఆడిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1-1తో డ్రా కాగా.. చివరి మ్యాచ్ కూడా అదే రీతిలో ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు