Sunil Chhetri: అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు.. ‘ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు’: సునీల్ ఛెత్రి
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి (Sunil Chhetri) అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఛెత్రి చివరిసారిగా జూన్ 6న కువైట్తో మ్యాచ్ ఆడనున్నాడు. తన నిర్ణయంపై ఓ వీడియో పోస్టు చేసిన కెప్టెన్ ఛెత్రి కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. రిటైర్మెంట్ గురించి తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నాడు.
‘‘గత 19 ఏళ్ల నా కెరీర్లో గొప్ప జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. బాధ్యతలు, ఒత్తిడి, అమితమైన ఆనందం.. ఇలా ఎన్నింటినో అనుభవించా. వ్యక్తిగతంగా నేను ఇన్నేళ్లపాటు భారత జట్టుకు ఆడతానని అనుకోలేదు. మంచిచెడులు ఉన్నాయి. గత ఒకటిన్నర నెల నుంచి కొత్తగా అనిపిస్తోంది. నేను చివరి మ్యాచ్ ఆడేందుకు సమయం ఆసన్నమైందని అనుకుంటున్నా. జాతీయ జట్టు కోసం ప్రతి క్షణం కష్టపడ్డా. కువైట్తో మ్యాచ్ మాకు చాలా అవసరం. తదుపరి రౌండ్కు అర్హత సాధించాలంటే మూడు పాయింట్లు కీలకం. జట్టు పరంగా ఎంత ముఖ్యమో.. వ్యక్తిగతంగా నాకూ గుర్తుండిపోయే మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా. నేను ఈ నిర్ణయం గురించి ఇంట్లో చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. మా అమ్మ, నాన్న, నా భార్య రియాక్షన్ను మాటల్లో చెప్పలేను. మా నాన్న కాస్త అర్థం చేసుకున్నాడు. కానీ, అమ్మతోపాటు నా భార్య ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించారు. నాకది చాలా కొత్తగా అనిపించింది. నేను ఆట ఆడేటప్పుడు వారు చాలా ఒత్తిడికి గురయ్యేవారు. ఇదే విషయం చెప్పా. ఇక దేశం తరఫున ఆడటంలేదనే విషయంతో వారు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారో వారు చెప్పలేకపోయినా నాకర్థమైంది. నాలోని చిన్నపిల్లాడు మాత్రం ఫుట్బాల్ను ఆడటం ఆపవద్దని చెబుతున్నాడు. ఎప్పుడు జాతీయ జట్టు కోసం ఆడేందుకు అవకాశం వచ్చినా వదిలిపెట్టవద్దంటాడు. జీవితంలో నేనెంతో అదృష్టవంతుడిని. కలను నిజం చేసుకోవడంలో విజయవంతమయ్యా’’ అని ఛెత్రి వెల్లడించాడు.
భారత్ తరఫున 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టిన ఛెత్రి ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్ల్లో 94 గోల్స్ కొట్టాడు. అంతర్జాతీయంగా ఇప్పుడున్న యాక్టివ్ ప్లేయర్లలో ఎక్కువ గోల్స్ చేసిన మూడో ఆటగాడు. అతడి కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో (128), లియోనిల్ మెస్సి (106) ఉన్నారు. భారత్ తరఫున ఛెత్రినే టాప్ స్కోరర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి మ్యాచ్ నాటికి.. మేం చేయాల్సిందదే: రోహిత్
వరల్డ్ కప్లో తమ సన్నద్ధతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శనివారం వార్మప్ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడాడు. -
ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్కే వరం: వసీమ్ అక్రమ్
భారత జట్టు తరఫున టీ20 ప్రపంచ కప్లో ఆడాలనేది క్రికెటర్ల కల. కానీ, కొందరికే అవకాశం దక్కుతోంది. ఈసారి కూడా 15 మందితో కూడిన జట్టులో అభిమానులు ఆశించినట్లు కొందరికి ఛాన్స్ రాలేదు. -
‘మా దేశంలో నెపోటిజం స్థాయి ఇదీ’.. పాక్ క్రికెటర్ ఎంపికపై ఫ్యాన్స్ ఫైర్
వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టుపై పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఘోరంగా విఫలమవుతున్న ఆజం ఖాన్ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తాయి. -
ఈసారి వరల్డ్ కప్లో భారత్ రిస్క్ చేస్తోంది: ఆసీస్ మాజీ కెప్టెన్
పొట్టి కప్ కోసం భారత జట్టు సన్నాహాలను ప్రారంభించింది. జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్లో తలపడనుంది. ఇప్పటికే జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్ను ముమ్మరం చేశారు. -
టీ20 ప్రపంచకప్కి భారత్ రెడీ.. ఫైనల్ 11 ఎవరైతే బాగుంటుంది? మీ జట్టేంటి?
Team India XI Poll For T20 World Cup 2024 I వెస్టిండీస్ - యూఎస్ఏ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో టీమ్ ఇండియా ఫైనల్ 11లో ఎవరు ఉండాలి? -
టీ20 ప్రపంచకప్.. ‘డిఫెండింగ్’ ఛాంపియన్స్ పరిస్థితేంటి?
ఐపీఎల్ తర్వాత క్రికెట్ అభిమానులను అలరించడానికి మెగా టోర్నీ సిద్ధమైంది. జూన్ 2 నుంచి యూఎస్ఏ - విండీస్ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. -
కప్పుతో ముగిస్తారా?
ఆ ఇద్దరు భారత క్రికెట్ జట్టు మూలస్తంభాలు. దాదాపు దశాబ్దన్నరగా టీమ్ఇండియా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో దిగ్గజాలుగా ఎదిగారు. ఆ ఇద్దరి ఆటతీరు వేరు. వ్యక్తిత్వమూ వేరు. కానీ జట్టు విషయానికి వచ్చే సరికి విజయాల కోసం పోరాడటంలో వెనక్కి తగ్గరు. -
ఛాంపియన్ల అడ్డా
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్.. ఫార్మాట్తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటతీరుతో దూసుకెళ్లే ఛాంపియన్ జట్లు ఇవి. టీ20ల్లో దూకుడు మంత్రంతో.. బాదుడే ఆయుధంగా సాగుతాయి. రెండు జట్లలోనూ అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. -
మూడో రౌండ్లో జకోవిచ్
టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్కు దూసుకెళ్లాడు. నాలుగో సీడ్ జ్వెరెవ్, అయిదో సీడ్ మెద్వెదెవ్ కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్లో రెండో సీడ్ సబలెంక, నాలుగో సీడ్ రిబకినా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. -
మురికివాడల నుంచి ప్రపంచకప్కు
కనీస అవసరాలు తీర్చుకోవడానికి, నిత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి రోజూ పోరాడాల్సిందే. చుట్టూ మురికివాడలే. శుద్ధమైన తాగునీరు దొరకదు. నాణ్యమైన వైద్యం అందదు. కుటుంబాన్ని పోషించడానికి సరైన ఉద్యోగమూ ఉండదు. -
గాయత్రి జోడీ సంచలనం
భారత డబుల్స్ స్టార్లు గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించారు. ప్రపంచ రెండో ర్యాంకు జంటకు షాకిచ్చి ఈ జోడీ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. -
ప్రజ్ఞానంద అదరహో
భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద క్లాసికల్ ఫార్మాట్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో 37 ఎత్తుల్లో గెలిచిన ప్రజ్ఞానంద.. 5.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. -
అదో భిన్నమైన అనుభూతి
భారత జెర్సీతో తిరిగి మైదానంలో అడుగుపెట్టడం భిన్నమైన అనుభూతినిస్తోందని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. 2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 15 నెలలు ఆటకు దూరంగా ఉన్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళా పోలీసుల చేతిలో ప్రజ్వల్ అరెస్టు.. ఎందుకంటే!
-
తొలి మ్యాచ్ నాటికి.. మేం చేయాల్సిందదే: రోహిత్
-
రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’... మాస్ గెటప్లో విష్వక్సేన్ మెప్పించారా...?
-
చావనైనా చస్తాం కానీ.. భూములివ్వబోమని చెప్పాం: విశాఖ భూకబ్జా బాధితులు
-
ఇకపై గూగుల్ మెసేజ్లనూ ఎడిట్ చేయొచ్చు
-
ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్కే వరం: వసీమ్ అక్రమ్