Chess: చదరంగంలో ‘ఎత్తు’కు... సత్తా చాటుతోన్న భారత కుర్రాళ్లు!
ప్రపంచ చెస్లో (World Chess) భారత్కంటూ ప్రత్యేక స్థానం రావడంలో విశ్వనాథన్ ఆనంద్ పాత్ర కీలకం. ఆయన తర్వాత చాలా మంది గ్రాండ్ మాస్టర్లుగా మారారు. కొత్తగా వస్తున్న యువకులు ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
అజర్బైజాన్ రాజధాని బాకు.. అత్యంత పోటీ ఉండే, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు తలపడే చెస్ ప్రపంచకప్ జరుగుతోందక్కడ! ఈ నాకౌట్ టోర్నీలో ఏ రౌండ్లో ఓడినా ఇంటికే! ఇప్పుడు ఓపెన్ విభాగంలో ప్రిక్వార్టర్స్ వరకూ పోటీలు వచ్చాయి. ఇక్కడి వరకు చేరుకున్న 10 మంది ఆటగాళ్లలో నలుగురు (అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్) భారత గ్రాండ్ మాస్టర్లున్నారు. మహిళల క్వార్టర్లో అడుగుపెట్టిన వాళ్లలో మన అమ్మాయి (ద్రోణవల్లి హారిక) ఒకరున్నారు. మరో దేశం నుంచి ఇంతమంది గ్రాండ్ మాస్టర్లు టోర్నీలో ఈ దశ వరకూ చేరుకోలేదు. దీన్ని బట్టి ఈ ప్రపంచ కప్లో భారత ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా భారత్ బలీయమైన చదరంగ దేశంగా ఎదుగుతుందనడానికి ఇదే నిదర్శనం. ప్రపంచ స్థాయి పోటీలైనా.. అంతర్జాతీయ టోర్నీలైనా అందులో భారత ప్లేయర్ల ముద్ర ఉండాల్సిందే. అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించడం.. అద్భుత విజయాలతో సాగడం.. అలవాటుగా మార్చుకున్న మన కుర్రాళ్లు చెస్ ప్రపంచాన్ని ఏలే దిశగా సాగుతున్నారు.
ఒక్కడితో మొదలై
భారత్లో చెస్ అంటే.. ఠక్కున వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. చదరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రాండ్మాస్టర్ హోదా పొందిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. 1988లోనే ఈ ఘనత సాధించిన ఆనంద్.. దేశంలో చదరంగానికి ఊపిరి పోశారనే చెప్పాలి. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఏకైక భారత ఆటగాడు.. ప్రపంచ చదరంగంలో మన సత్తాను చాటిన ఘనుడు ఆయన. కానీ ఇప్పుడు ఆనంద్ ఒక్కరే కాదు ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, శశికరణ్, ఎస్పీ సేతురామన్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అంతర్జాతీయ వేదికపై ఉత్తమ ప్రదర్శనతో మెప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్లు హరికృష్ణ, హంపి, హారిక, లలిత్ బాబు ప్రపంచ చెస్ యవనికపై మెరుస్తూనే ఉన్నారు. హంపి ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచారు. ఇప్పుడిక యువతరం ప్లేయర్లు దూకుడైన ఆటతీరుతో చెస్లో భారత ప్రస్థానాన్ని మరో దశకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నారు.
Prithvi shaw: పృథ్వీ!.. ప్రతిభ ఉంటే సరిపోతుందా..?
యువ జోరు..
భారత్లో ఆనంద్తో మొదలైన చెస్ విప్లవం మధ్యలో నెమ్మదించింది. కానీ గత అయిదేళ్లుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. అందుకు కారణంగా యువ ప్లేయర్లే. చిన్నతనంలోనే 64 గళ్ల చదరంగం బోర్డుపై ప్రేమ పెంచుకుని.. ఎత్తుల్లో పట్టు సాధించి అలవోకగా గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించడంతో పాటు ప్రపంచ వేదికలపై సంచలన విజయాలు సాధిస్తున్నారు. 1988 నుంచి 2017 ముగిసే నాటికి మన దేశంలో గ్రాండ్మాస్టర్ల సంఖ్య 50. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 83. మధ్యలో కరోనా ప్రభావంతో టోర్నీలు ఎక్కువగా జరగనప్పటికీ ఈ ఆరేళ్లలో 33 మంది కొత్త గ్రాండ్ మాస్టర్లు రావడం విశేషం. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి అయిదుగురు (అర్జున్ ఇరిగేశి, హర్ష భరత్కోటి, రాజా రిత్విక్, రాహుల్ శ్రీవాత్సవ్, ప్రణీత్ వుప్పల) గ్రాండ్ మాస్టర్లుగా అవతరించారు. మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన యువ ఆటగాళ్లు కూడా ఒత్తిడిని సమర్ధంగా తట్టుకుంటూ ప్రపంచ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పుడీ ప్రపంచకప్లో ప్రిక్వార్టర్స్ చేరిన నలుగురిలో విదిత్ను మినహాయిస్తే అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్ టీనేజర్లే. పిన్న వయస్సులోనే వీళ్లు మేటి ఆటగాళ్లను ఓడిస్తూ దూసుకెళ్తున్నారు. చెస్ను శాసిస్తున్న మాగ్నస్ కార్ల్సన్ను వీళ్లు ఓడించడం విశేషం. త్వరలోనే ఈ యువ ప్లేయర్ల నుంచి ప్రపంచ ఛాంపియన్లను చూసే అవకాశముంది. ర్యాంకింగ్స్లో ఆనంద్ను దాటేసి భారత నంబర్వన్ ఆటగాడిగా నిలిచిన గుకేశ్.. ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-10లోనూ చోటు దక్కించుకున్నారు.
ఆ ఆతిథ్యంతో..
భారత్ మొట్టమొదటి సారి అతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్తో దేశంలో చదరంగానికి మరింత ఆదరణ పెరిగింది. భారత చెస్ రాజధానిగా మారిన చెన్నై.. 2023లో ఈ ఒలింపియాడ్ను పండగలా నిర్వహించింది. ఈ పోటీల్లో ఓపెన్, మహిళల విభాగాల్లో భారత్ కాంస్యాలు గెలిచింది. 2020లో వర్చువల్ గా జరిగిన ఒలింపియాడ్లో రష్యాతో కలిసి పసిడి పంచుకున్న భారత్ చరిత్ర సృష్టించింది. 2021లోనూ మనకు కాంస్యం దక్కింది. చెస్లో భారత ప్లేయర్ల స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఎంతో మంది చిన్నారులు ఇటు వైపు మళ్లుతున్నారు. ఇదే జోరుతో సాగితే ప్రపంచ చెస్లో భారత్ అగ్రగామిగా ఎదిగే రోజు మరెంతో దూరంలో లేదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్