Prithvi shaw: పృథ్వీ!.. ప్రతిభ ఉంటే సరిపోతుందా..?
Special story on prithvi shaw: ఇటీవల ఇంగ్లాండ్ వన్డే కప్లో నార్తాంప్టన్షైర్కు ఆడుతూ సోమర్సెట్పై పృథ్వీ షా డబుల్ సెంచరీ చేశాడు. టీమ్ ఇండియాలో పునరాగమనానికి ఇది మాత్రమే సరిపోతుందా?తన కెరీర్ ఇలా అవ్వడానికి స్వీయ తప్పిదాలు లేవా?
కేవలం 18 ఏళ్ల వయసులోనే భారత జట్టు తరఫున టెస్టు కెరీర్ ఆరంభించిన కుర్రాడు పృథ్వీ షా (Prithvi shaw). తొలి మ్యాచ్లోనే సెంచరీ కొట్టి అబ్బురపరిచాడు కూడా. అంత గొప్పగా కెరీర్ను ఆరంభించిన కుర్రాడు.. ఇప్పుడు టీమ్ఇండియా ఛాయల్లోనే లేడు. ప్రతిభకు లోటు లేని ఈ కుర్రాడు.. క్రమశిక్షణ కొరవడి, ఫిట్నెస్ లేక చేజేతులా కెరీర్ను దెబ్బ తీసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ వన్డే కప్లో మెరుపు డబుల్ సెంచరీ బాదిన పృథ్వీని చూసి.. ఎక్కడ ఉండాల్సిన ఆటగాడు ఎక్కడ ఉన్నాడు అంటూ జాలిపడుతున్నారు.
153 బంతులు.. 244 పరుగులు.. 28 ఫోర్లు.. 11 సిక్సర్లు.. ఇటీవల ఇంగ్లాండ్ వన్డే కప్లో నార్తాంప్టన్షైర్కు ఆడుతూ సోమర్సెట్పై పృథ్వీ షా వీర విధ్వంసం తాలూకు గణాంకాలివి. ఇంగ్లాండ్ పిచ్లపై ఈ స్థాయిలో చెలరేగాడంటే పృథ్వీ ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇన్నింగ్స్ తర్వాత పృథ్వీ అసలు టీమ్ఇండియాలో ఎందుకు లేడనే చర్చ మొదలైంది. కెరీర్లో జాగ్రత్తగా అడుగులు వేసి ఉంటే.. అక్టోబరులో భారత్ వేదికగా మొదలయ్యే వన్డే ప్రపంచకప్లో ఆడాల్సిన వాడే పృథ్వీ. కానీ టెస్టు అరంగేట్రంలోనే శతకంతో గొప్పగా అంతర్జాతీయ కెరీర్ను ఆరంభించిన అతను.. కొన్ని కారణాలతో భారత జట్టుకు దూరమైపోయాడు. టెస్టు కెరీర్ను గొప్పగా ఆరంభించాక ఓ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి అతను జట్టుకు దూరమయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. తర్వాత నడుం దగ్గర అయిన మరో గాయం మరి కొంత కాలం ఆటకు దూరమయ్యేలా చేసింది. ఈలోపు ఫామ్ కూడా దెబ్బ తింది. దేశవాళీల్లోనే కాక ఐపీఎల్లోనూ నిలకడగా రాణించలేకపోయాడు. దీంతో భారత సెలక్టర్లు అతణ్ని లైట్ తీసుకున్నారు. ఇప్పటిదాకా పృథ్వీ 2 టెస్టులు, 6 వన్డేలు, ఒక టీ20లో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహించాడు.
మళ్లీ అదే సందిగ్ధత... ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియా ఫిట్నెస్ కష్టాలు
వెంటాడిన వివాదాలు
పృథ్వీ షా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో ఏళ్లు అయిపోలేదు. ఈలోపే అతను చాలాసార్లు ప్రతికూల వార్తలతోనే మీడియాలో నానాడు. అతడి కెరీర్లో అతి పెద్ద మరక అంటే.. డోప్ పరీక్షలో దొరికిపోవడం. 2019లో 19 ఏళ్ల వయసులోనే అతడు డోపీగా తేలాడు. ఆ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో.. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో బీసీసీఐ అతణ్ని 8 నెలల పాటు నిషేధించింది. అనారోగ్య సమయంలో వాడిన దగ్గుమందే తాను డోపీగా తేలడానికి కారణమని పృథ్వీ వెల్లడించాడు. అయితే ఒక క్రికెటర్గా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త పడటం పృథ్వీ బాధ్యత. అతడు నిర్లక్ష్యంగా ఉన్నాడనడానికి ఇది రుజువు. ఇక గత ఏడాది రోడ్డు మీద ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్తో గొడవ పడటం ద్వారా కూడా పృథ్వీ వార్తల్లో నిలిచాడు. ఆ గొడవలో అతడి తప్పేమీ లేదని తర్వాత పోలీసులు తేల్చినప్పటికీ.. ఈ వివాదం కారణంగా కొన్ని రోజుల పాటు అతడి పేరు మీడియాలో, సోషల్ మీడియాలో నానింది. పృథ్వీకి ఆటేతర విషయాల మీదే ఆసక్తి అంటూ అతడిపై నెటిజన్లు చురకలు వేశారు.
ఫిట్నెస్పై శ్రద్ధ లేదా?
భారత్కు ఆడిన కొన్ని మ్యాచ్ల్లో, అలాగే ఐపీఎల్లో పృథ్వీ ఆట చూసిన వారికి అతడి సామర్థ్యం ఎలాంటిదో తెలుసు. మంచి స్ట్రోక్ ప్లే, టెక్నిక్ ఉన్న బ్యాటర్ అతను. ఎలాంటి బౌలింగ్ను అయినా తుత్తునియలు చేయగలడు. అలవోకగా భారీ షాట్లు ఆడగలడు. కానీ ప్రతిభ ఒక్కటే ఉంటే అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం కొనసాగలేరు. ఆట మీద పూర్తి శ్రద్ధ ఉండాలి. క్రమశిక్షణతో మెలగాలి. ఫిట్నెస్ కాపాడుకోవాలి. ఈ లక్షణాలే పృథ్వీలో లేవన్నది విశ్లేషకుల మాట.
పృథ్వీ వయసు ప్రస్తుతం కేవలం 23 ఏళ్లు. కానీ అతడి తాజా ఫొటో చూస్తే.. కెరీర్ చరమాంకంలో ఉన్నవాడిలా కనిపించడం గమనార్హం. నెత్తిన జుత్తు మొత్తం ఊడిపోవడం వల్ల పెద్ద వయస్కుడిలా కనిపిస్తున్నాడు. ఇందుకు అతణ్ని నిందించడానికేమీ లేదు. కానీ తోటి యువ ఆటగాళ్లు కండలు తిరిగిన దేహంతో ఎంతో ఫిట్గా కనిపిస్తుంటే.. పృథ్వీ మాత్రం బాగా బరువు పెరిగి శరీరం మీద ఏమాత్రం అదుపు లేని వాడిలా దర్శనమిస్తున్నాడు. అతణ్ని చూస్తే క్రికెట్ ఆడే ఫిట్నెస్ ఉందని అనిపించదు. పృథ్వీ షాతో పాటు కెరీర్ మొదలుపెట్టిన శుభ్మన్ ప్రస్తుతం టీమ్ఇండియా కొత్త సూపర్ స్టార్గా అవతరించాడన్నా.. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ లాంటి సహచరులు అతణ్ని దాటి చాలా ముందుకు వెళ్లిపోయారన్నా.. వారి క్రమశిక్షణే కారణం. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ లాంటి కుర్రాళ్లను చూసి కూడా పృథ్వీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రతిభకు లోటు లేని పృథ్వీ.. ఇప్పటికైనా ఒంటి మీద దృష్టి పెట్టి ఫిట్గా తయారవడం, క్రమశిక్షణ అలవర్చుకుని పూర్తిగా ఆట మీద దృష్టిసారించడం అవసరం. అలా చేస్తే త్వరలోనే టీమ్ఇండియాలో ఉంటాడనడంలో సందేహం లేదు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్