T20 World Cup 2024: వరల్డ్ కప్ జట్టు ప్రకటనకు ముందు.. తర్వాత మన బ్యాటర్ల ఆట తీరిదీ!
టీమ్ఇండియా జూన్ 5న టీ20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. మరి ఆటగాళ్ల ఫామ్ను ఓ సారి పరిశీలిద్దాం.
ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొనే అవకాశం. ఇక్కడ సత్తా చూపిస్తే వరల్డ్ కప్ జట్టులో స్థానం ఖాయం... ఇదీ ఐపీఎల్కు ముందు భారత క్రికెటర్ల ఆలోచనలు.
ఆ రోజు రానే వచ్చింది. వరల్డ్ కప్ కోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. అప్పటి వరకు దూకుడుగా ఆడిన కొందరు.. తమ పేరు ఉందని తెలిశాక రిలాక్స్ అయిపోయినట్లు ఆడారు. వారి గణాంకాలను గమనిస్తే ఇట్టే తెలిసిపోతోంది. అందరి పరిస్థితి ఇలా ఉందని కాదు. ఎక్కువ మంది ఇలానే ఆడారు. భారత స్క్వాడ్లోని ప్రధాన బ్యాటర్ల ఫామ్పై ఓ లుక్కేద్దాం..
- రోహిత్ శర్మ: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించక ముందు ఒక సెంచరీతోపాటు 30+ స్కోర్లను 4 సార్లు సాధించాడు. ఇక జట్టును వెల్లడించిన తర్వాత ఆడిన ఐదింట్లో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఓపెనర్గా వస్తూ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ను సమర్పించుకున్నాడు.
- విరాట్ కోహ్లీ: ఫామ్, ఫార్మాట్, పిచ్లతో సంబంధం లేదు. అతడి ఆట కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందనడంలో సందేహం లేదు. ఈసారి ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కోహ్లీనే. 700+ పరుగులు చేసి అదరగొట్టాడు. జట్టు ప్రకటన చేయకముందు అతడి ఆటను.. వెల్లడించిన తర్వాత కోహ్లీ గేమ్ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఆర్సీబీకి విజయాలు అత్యంత ముఖ్యం కావడం కూడా విరాట్ బ్యాటింగ్ దూకుడుపై ప్రభావం చూపింది. చివరి ఆరు మ్యాచుల్లో (70, 42, 92, 27, 47, 33) కీలక ఇన్నింగ్స్లతో వీరవిహారం చేశాడు.
- యశస్వి జైస్వాల్: ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ ప్లేఆఫ్స్నకు చేరుకుంది. గతేడాది మాదిరిగా యశస్వి జైస్వాల్ దూకుడైన ఆటతీరును ప్రదర్శించలేదు. ఓ మూడు మ్యాచుల్లోనే నాణ్యమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. వరల్డ్ కప్ కోసం జట్టు ప్రకటించిన తర్వాత 67, 4, 24, 4, 42 పరుగులు చేశాడు. రెండో క్వాలిఫయర్లో ఒకవైపు వికెట్లు పడుతున్నా వేగంగా (21 బంతుల్లోనే 42) పరుగులు సాధించాడు. కానీ, జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
- సూర్యకుమార్ యాదవ్: కొడితే హాఫ్ సెంచరీ.. లేకపోతే ఫట్.. ఇదీ ఐపీఎల్లో సూర్యకుమార్ ఆటతీరు. ధనాధన్ ఇన్నింగ్స్లతో ప్రత్యర్థులను హడలెత్తించాడనే చెప్పాలి. మరీ ముఖ్యంగా హైదరాబాద్పై శతకం సాధించి ఒంటి చేత్తో ముంబయిని గెలిపించాడు. వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వచ్చాక ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ (102, 56) కొట్టాడు. అంతకుముందు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ రెండు అర్ధశతకాలు (78, 52) ఉన్నాయి.
- రిషభ్ పంత్: దాదాపు 15 నెలల గ్యాప్ తర్వాత మైదానంలోకి అడుగు పెట్టాడు. తొలి అర్ధభాగంలో మంచి ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడైతే తమ జట్టు నాకౌట్ ఆశలను కోల్పోయిందో కాస్త వెనుకబడ్డాడు. అలాగని పరుగులు చేయలేదని కాదు. ఆ జట్టులో ఇతరులతో పోలిస్తే ఫర్వాలేదనిపించాడు. వేగంగా మాత్రం ఆడలేకపోయాడు. ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించిన తర్వాత పంత్ నాలుగు మ్యాచులు ఆడాడు. అందులో అత్యధిక స్కోరు 33. అంతకుముందు ఎనిమిది మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండుసార్లు 40+ స్కోరు చేశాడు.
- సంజూ శాంసన్: ఐపీఎల్లో రాజస్థాన్ ఆడిన తొలి మ్యాచ్లోనే 86 పరుగులు చేసి తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. ఆ తర్వాత వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రపంచ కప్ జట్టు రేసులో ముందు నిలిచాడు. అనుకున్నట్లుగానే స్థానం దక్కించుకున్నాడు. రాజస్థాన్ను కెప్టెన్గా ప్లేఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్కసారి మాత్రమే (86) అర్ధశతకం బాదాడు. మరొకసారి డకౌట్గా పెవిలియన్కు చేరాడు.
- హార్దిక్ పాండ్య: ప్రదర్శన గొప్పగా లేకపోయినా ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న క్రికెటర్. ఐపీఎల్ సీజన్లో పాండ్య 14 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసినప్పటి నుంచి అతడు రెండు వికెట్లు మాత్రమే తీశాడు. వైస్ కెప్టెన్సీ అప్పగించిన క్రమంలో హార్దిక్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దానికి వార్మప్ మ్యాచ్లో సరైన సమాధానం ఇచ్చాడు. బ్యాటింగ్లో దూకుడుగా ఆడి 23 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. బౌలింగ్లోనూ ఒక వికెట్ తీశాడు.
- శివమ్ దూబె: ఐపీఎల్ ఆరంభంలో శివమ్ దూబె ఆటను చూస్తే హార్డ్ హిట్టర్ దొరికాడని అంతా సంతోషించారు. వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించక ముందు దూబె 9 మ్యాచుల్లో 360 పరుగులు చేశాడు. ఎప్పుడైతే స్క్వాడ్లోకి వచ్చాడో.. అప్పటి నుంచి అతడి ఆటతీరు దారుణంగా ఉంది. చివరి ఐదు మ్యాచుల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడంటే నమ్ముతారా? ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి. తొలిసారి బౌలింగ్ చేసిన అతడు ఒక్క వికెట్ పడగొట్టాడు. తాజాగా వార్మప్ మ్యాచ్లో 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేశాడు. భారీ షాట్లు కొట్టడంలో తడబాటుకు గురైనట్లు కనిపిస్తోంది.
- శుభ్మన్ గిల్ (ట్రావెల్ రిజర్వ్): టీమ్ఇండియా ప్రకటించిన 15 మంది స్క్వాడ్లో శుభ్మన్ గిల్కు అవకాశం దక్కలేదు. ట్రావెల్ రిజర్వ్గా వచ్చాడు. జట్టును ప్రకటించిన తర్వాత ఐపీఎల్లో మూడు మ్యాచ్లు ఆడాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. అంతకుముందు 89, 72 పరుగులు చేశాడు. 30+ స్కోర్లూ మూడు సార్లు చేశాడు. రెండు మ్యాచులు రద్దు కాగా.. తానాడిన చివరి ఐపీఎల్ మ్యాచ్లో శతకం (104) బాదడం గమనార్హం.
- రింకు సింగ్ (ట్రావెల్ రిజర్వ్): గతేడాది ఐపీఎల్లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లలో రింకు ఒకడు. మరీ ముఖ్యంగా యశ్ దయాల్ బౌలింగ్లో ఐదు సిక్స్లతో పేరు మారుమోగిపోయింది. భారత జట్టులోకి అడుగు పెట్టాడు. వరల్డ్ కప్ ప్రధాన టీమ్లోకి వస్తారని అంతా భావించారు. ట్రావెల్ రిజర్వ్గా మాత్రమే అవకాశం దక్కింది. ఈ ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచులు ఆడిన అతడు 113 బంతుల్లో 168 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం, కేకేఆర్ ప్రధాన బ్యాటర్లు మంచి ఫామ్లో ఉండటంతో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్