Rohan Bopanna: అలుపెరగని యోధుడు బోపన్న... 43 ఏళ్లు.. అయినా తగ్గేదేలే!
43 ఏళ్లు.. ఏ ఆటలోనైనా ఏ క్రీడాకారుడైనా రిటైర్మైంట్ తీసుకుని హాయిగా సేదతీరే సమయం. ఇక శారీరక సామర్థ్యానికి పరీక్ష పెట్టే టెన్నిస్లో అయితే 35 ఏళ్లు దాటిన ఆటగాళ్లు కనబడడమే గగనం. చాలా మంది చిన్న వయస్సులోనే ఆటకు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ గాయాలు బాధించినా.. మోకాలిలో గుజ్జు అరిగిపోయి ఇబ్బంది పడ్డా.. వరుసగా ఓటములు ఎదురైనా.. అతను ఆగిపోలేదు. అలా ఆగిపోయి ఉంటే అతను రోహన్ బోపన్న (Rohan Bopanna) ఎందుకవుతాడు.
43 ఏళ్లు.. ఏ ఆటలోనైనా ఏ క్రీడాకారుడైనా రిటైర్మైంట్ తీసుకుని హాయిగా సేదతీరే సమయం. ఇక శారీరక సామర్థ్యానికి పరీక్ష పెట్టే టెన్నిస్లో అయితే 35 ఏళ్లు దాటిన ఆటగాళ్లు కనబడడమే గగనం. చాలా మంది చిన్న వయస్సులోనే ఆటకు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ గాయాలు బాధించినా.. మోకాలిలో గుజ్జు అరిగిపోయి ఇబ్బంది పడ్డా.. వరుసగా ఓటములు ఎదురైనా.. అతను ఆగిపోలేదు. అలా ఆగిపోయి ఉంటే అతను రోహన్ బోపన్న (Rohan Bopanna) ఎందుకవుతాడు. దేనికీ తలవంచని నైజం, వెనక్కి తగ్గని ఆత్మస్థైర్యం, పట్టు వదలని పోరాటమే 43 ఏళ్ల బోపన్న లక్షణాలు. తాజాగా యుఎస్ ఓపెన్ (US Open) పురుషుల డబుల్స్లో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి రన్నరప్గా నిలిచిన బోపన్న.. అలుపెరగని ఓ పోరాట యోధుడు.
సవాళ్లను దాటి..
అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా.. సవాళ్లు పలకరించినా.. టెన్నిస్పై ప్రేమతో, విజయాల ఆకలితో ముందుకు సాగడమే బోపన్నకు తెలుసు. లేకపోతే 43 ఏళ్ల వయసులో.. అత్యంత పోటీ ఉండే గ్రాండ్స్లామ్ల్లో ఒకటైన యుఎస్ ఓపెన్లో.. యువ ఆటగాళ్లను దాటి రన్నరప్గా నిలవడమంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి అసాధ్యాలను అందుకోవడం బోపన్నకు అలవాటే. 20 ఏళ్లలో సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మ్యాచ్లు.. మధ్యలో గాయాలు.. విజయాలు.. ఓటములు.. ఇలా అన్ని చూసిన బోపన్న ఓ పరిపూర్ణ ఆటగాడు. ఓ దశలో వరుసగా ఓటములే ఎదురవుతుంటే.. సముద్ర తీరంలో కుర్చుని.. ఇంకా టెన్నిస్ ఆడటం ఎందుకు? గెలవడం లేదు కదా? ఇంటి దగ్గర కుటుంబం ఉంది చూసుకోవాలి. ఆటకు వీడ్కోలు పలికేద్దామా? అనే ఆలోచనలో బోపన్న మునిగిపోయాడు. కానీ అది కొద్దిసేపు. మళ్లీ ఆట లేకపోతే ఉండగలనా? అని భావించి రాకెట్ పట్టాడు. గాయాలను దాటాడు. సాధనలో శ్రమించాడు. మ్యాచ్లు గెలవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఓపెన్ శకంలో ఓ గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడిన అతి పెద్ద వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అందుకే బోపన్న ఓ పోరాట యోధుడు.
గుజ్జు అరిగిపోయినా..
రెండు మోకాళ్లలోని గుజ్జు (కార్టిలేజ్) పూర్తిగా అరిగిపోయింది. నడుస్తుంటేనే తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆడటం గురించి ఎవరైనా ఆలోచిస్తారా? కానీ 2019లో రోజుకు రెండు లేదా మూడు పెయిన్ కిల్లర్స్ మాత్రలు వేసుకుంటూ బోపన్న ఆట కొనసాగించాడు. ఆట పట్ల అతని అంకితభావానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు బోపన్నకు యోగా ఉపయోగపడింది. కరోనా సమయంలో 2020లో బోపన్న.. అయ్యంగార్ యోగా చేయడం మొదలెట్టాడు. వారంలో నాలుగు సార్లు 90 నిమిషాల చొప్పున యోగా చేసేవాడు. దీంతో క్రమంగా మోకాలి నొప్పి మాయమైంది. ఎలాంటి మాత్రలు వాడాల్సిన అవసరం లేకపోయింది. అక్కడి నుంచి అతని కెరీర్ మళ్లీ కొత్తగా మొదలైంది. మరింత ఉత్సాహంతో బోపన్న కోర్టులో సాగిపోయాడు. ఈ ఏడాది జనవరి నుంచి బెల్జియం ఫిజియో రెబెక్కా వాన్తో కలిసి పని చేయడం మొదలెట్టిన బోపన్న ఫిట్నెస్ మెరుగుపర్చుకున్నాడు. ఇప్పుడు యుఎస్ ఓపెన్లో ఎబ్డెన్తో కలిసి అదరగొట్టాడు. బోపన్న విజయాల కంటే కూడా అతని ఆటతీరు మరింత ఆకట్టుకుంది. కెరీర్ ఆరంభంలో ఎలాగైతే దూకుడు ప్రదర్శించాడో ఇప్పుడు కూడా అలాగే ఆడాడు. అంతే కాకుండా తమకు పాయింట్ వచ్చిందని తెలిసినా.. బంతి చేతికి తాకిందని వదిలేసుకున్న అతని క్రీడాస్ఫూర్తి అలరించింది. కెరీర్లో ఇప్పటివరకూ బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్ గెలవలేదు. రెండు సార్లు (2010, 2023) యుఎస్ ఓపెన్లోనే రన్నరప్గా నిలిచాడు. 2017 ఫ్రెంచ్ ఓపెన్లో గాబ్రియల్ డబ్రోస్కీ (కెనడా)తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు. టూర్ స్థాయి డబుల్స్ టైటిళ్లు 24 నెగ్గాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిళ్లు అయిదు గెలిచాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!