Parul Chaudhary: పతకాల కోసం కొండలెక్కి సాధన... పారుల్ పవర్ ఇదీ!
3000 మీటర్ల స్టీఫుల్ ఛేజ్లో తొలిసారి ఫైనల్కు వెళ్లిన భారత అథ్లెట్గా రికార్డు సృష్టించిన పారుల్... 2024 పారిస్ ఒలింపిక్స్కు కూడా అర్హత సాధించింది. ఆమె గురించి మరిన్ని విశేషాలు మీకోసం...
పారుల్ చౌదరి.. చూడటానికి బక్క పలచగా బలహీనంగా గాలికి పడిపోతుందా అన్నట్లు ఉంటుంది. కానీ ట్రాక్లోకి దిగిందంటే దుమ్ము రేపుతోంది. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్పే ఇందుకు ఉదాహరణ. 3000 మీటర్ల స్టీఫుల్ ఛేజ్లో తొలిసారి ఫైనల్కు వెళ్లిన భారత అథ్లెట్గా రికార్డు సృష్టించిన పారుల్ (Parul Chaudhary).. ఆపై జాతీయ రికార్డు (9 నిమిషాల 15.31 సెకన్లు) తిరగరాసింది. ఓవరాల్గా 11వ స్థానంలో నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్కు కూడా అర్హత సాధించింది. 3000, 5000 మీటర్లలో సత్తా చాటుతున్న పారుల్ కథ స్ఫూర్తిదాయకం.
ఉత్తర్ప్రదేశ్లోని మీరట్ జిల్లాలోని బహ్రాలా గ్రామానికి చెందిన పారుల్.. రైతు కుటుంబం నుంచి వచ్చింది. చిన్నప్పుడు పొలాల్లో పరుగులు తీసేది. అప్పుడు మొదలు పెట్టిన ఆ పరుగు ఇప్పటికీ కొనసాగిస్తోంది. ప్రొఫెషనల్ రన్నర్గా మారి పతకాల పంట పండిస్తోంది. తండ్రి ప్రోత్సాహంతో ఇంటర్లో అథ్లెటిక్స్ను సీరియస్గా తీసుకున్న ఆమెకు విజయాలు మాత్రం ఆలస్యంగా వచ్చాయి. చాలా మీట్స్లో సత్తా చాటినా కొద్దిలో పతకాలు పోగొట్టుకున్న పారుల్.. తొలిసారి తన సామర్థ్యానికి తగ్గ ఫలితాలను అందుకుంటోంది. 2016లో జాతీయ అథ్లెటిక్స్ శిబిరానికి ఎంపిక కావడం ఆమె కెరీర్లో మలుపు. అక్కడ ఆటకు మెరుగులు దిద్దుకున్న పారుల్.. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. 2019లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో మొదలుపెట్టిన పారుల్.. అవకాశం చిక్కిన ప్రతిసారీ తానేంటో నిరూపించుకుంటోంది. ఈ ఏడాది బ్యాంకాక్ ఆసియా ఛాంపియన్షిప్లోనే 3000, 5000 మీటర్ల పరుగులో స్వర్ణ, రజతాలు గెలవడమే ఇందుకు ఉదాహరణ.
ప్రపంచ అథ్లెటిక్స్లో 11 స్థానంలో నిలిచింది. యూరోపియన్ల నుంచి పోటీని తట్టుకోవడం అంత తేలిక కాదు. అయితే ప్రభుత్వ సహకారం లభించడంతో విదేశాల్లో శిక్షణ తీసుకునే అవకాశాన్ని దక్కించుకున్న పారుల్.. అందులో భాగంగా అమెరికాలోని కొలరాడో పర్వతంపై సాధన చేసింది. హై అల్టీట్యూడ్ ఉండే ఈ ప్రదేశంలో రెండు నెలలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎండ్యూరెన్స్లోనూ పారుల్ మెరుగుపడింది. విదేశీ కోచ్ స్కాట్ సిమన్స్, భారత కోచ్ జల్వీర్ సింగ్ శిక్షణలో పారుల్ రాటుదేలింది. ఈ ఏడాది ఆరంభంలో 5000 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు కొల్లగొట్టిన ఈ రన్నర్.. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్లో 3000 పరుగులోనూ జాతీయ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
ప్రపంచ అథ్లెటిక్స్లో సత్తా చాటిన పారుల్ తదుపరి లక్ష్యం ఆసియా క్రీడలు. ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటి వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని పారుల్ భావిస్తోంది. ‘‘భారత లాంగ్డిస్టెన్స్ రన్నర్ అవినాశ్ సాబ్లేతో కలిసి కొలరాడో పర్వతాలపై చేసిన శిక్షణ వల్ల ఎంతో నేర్చుకున్నా. ఫిట్నెస్ పరంగా ఈ ట్రైనింగ్ బాగా ఉపయోగపడంది. ప్రపంచంలోని టాప్ అథ్లెట్లతో పోటీపడి మంచి ఫలితాలు సాధించే అవకాశాన్ని కల్పించింది. త్వరలో జరిగే ఆసియా క్రీడలతో పాటు ఒలింపిక్స్లోనూ సత్తా చాటాలనే సంకల్పంతో ఉన్నా’’ అని పారుల్ చెప్పింది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్