SL vs BAN: బంగ్లా-శ్రీలంక ఆడితే ఫైరే .. గత కొన్ని సిరీస్లుగా ఇదే తంతు
బంగ్లా-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ మ్యాచ్కు మధ్య ఏదో సిరీస్లా వివాదాలు కొనసాగుతున్నాయి. అప్పటి మాటకు ఇప్పుడు ప్రతీకారం.. అప్పటి చర్యకు ఇప్పుడు ప్రతిచర్య అన్నట్లుగా సాగుతున్నాయి.
నిదహాస్ ట్రోఫీ.. ఆసియా కప్.. ఇప్పుడు ప్రపంచకప్.. టోర్నీ మారుతోంది కానీ శ్రీలంక-బంగ్లాదేశ్ (SL vs BAN) మధ్య మైదానంలో వైరం మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. ఆటగాళ్ల మధ్య అస్సలూ పొసగట్లేదు. తాజాగా ప్రపంచకప్లో మాథ్యూస్ను టైం ఔట్ వివాదంతో ఈ జట్ల మధ్య వేడి ఇంకో స్థాయికి వెళ్లింది. మ్యాచ్ ముగిసిన తర్వాత లంక-బంగ్లా ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ. భారత్-పాకిస్థాన్, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య పోరు మాదిరిగానే లంక-బంగ్లా మ్యాచ్ల్లో ఉద్వేగాలు రేగుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్కు మధ్య ఏదో సిరీస్లా వివాదాలు కొనసాగుతున్నాయి. అప్పటి మాటకు ఇప్పుడు ప్రతీకారం.. అప్పటి చర్యకు ఇప్పుడు ప్రతిచర్య అన్నట్లుగా సాగుతున్నాయి.
నా ‘టైమ్’ ఇంకా ఉంది.. వీడియో ఆధారాలున్నాయ్: ఏంజెలో మాథ్యూస్
మొదటి నుంచి అంతే..
బంగ్లా-శ్రీలంక ఒకప్పుడు స్నేహంగానే ఆడినా ఇప్పుడు మైదానం ఈ రెండు జట్లకు పొసగట్లేదు. ముఖ్యంగా గత అయిదేళ్లలో వైరం బాగా పెరిగిపోయింది. 2018 నిదహాస్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్లో లంకపై గెలిచిన తర్వాత బంగ్లా ఆటగాళ్లు నాగిని నృత్యం చేయడంతో ఈ జట్ల మధ్య వేడి రాజుకుంది. ఆ తర్వాత మ్యాచ్లో బంగ్లాను చిత్తు చేసిన తర్వాత లంక ఆటగాళ్లు కూడా ఇలాగే నృత్యం చేసి రెచ్చగొట్టారు. బంగ్లా బౌలర్ నురుల్ హాసన్.. అప్పటి లంక కెప్టెన్ తిసార పెరీరాతో వివాదానికి దిగాడు. ఇక అక్కడ నుంచి ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా నాగిని నృత్యాలు మాములుగామారాయి. ఈ రెండు జట్ల మధ్య వివాదం జరిగిన ప్రతిసారీ స్టార్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ మైదానంలో చాలా అతిగా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు. అంతే భారీగా జరిమానాలకు గురయ్యాడు. లంక ఆటగాళ్లు ఎంత సౌమ్యంగా ఉన్నా కూడా ఏదో విధంగా స్లెడ్జింగ్ చేయడం బంగ్లా ఆటగాళ్లకు అలవాటుగా మారింది. దీంతో లంక కూడా దూకుడుగా మారింది. మాటకు మాట చెబుతోంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా వివాదాల్లోకి వెళుతోంది. నాగిని డ్యాన్స్ చేయడం, ఒకరిని ఒకరు దూసుకెళ్లడం ఇందులో భాగమే.
ఆసియాకప్లోనూ అంతే
ఈ ఏడాది ఆసియాకప్లోనూ ఈ రెండు జట్లు ఇలాగే వైరంతో ప్రవర్తించాయి. తాజాగా మాథ్యూస్ని టైమ్ ఔట్ ఇవ్వడం పెద్ద వివాదానికి తావిచ్చింది. క్రీడా స్ఫూర్తిని మరిచి బంగ్లా కెప్టెన్ షకిబ్ ఎప్పటిలాగే అనుచితంగా ప్రవర్తించాడని లంక అభిమానులు మండిపడుతున్నాడు. తన 15 ఏళ్ల కెరీర్లో ఇంత దిగజారుడు క్రికెట్ జట్టును చూడలేదని మాథ్యూస్ కూడా వాపోయాడు. ఈ విషయంలో క్రికెట్ వర్గాలు రెండుగా చీలిపోయాయి. షకిబ్ చేసింది సరైందే అని కొంతమంది వాదిస్తుంటే కచ్చితంగా తప్పు అని ఇంకొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఈ సంఘటన రెండు దేశాల మధ్య మళ్లీ అగ్గి రాజేసింది. బంగ్లాపై ఓటమితో ఒకవైపు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించామన్న బాధ మరోవైపు.. మాథ్యూస్ విషయంలో అన్యాయం జరిగిందని మరోవైపు లంక ఆటగాళ్లు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీనికి తోడు భారత్ చేతిలో ఘోర పరాభవం తర్వాత తమ దేశ బోర్డు రద్దు కావడం కూడా లంకకు మరింత బాధ కలిగిస్తోంది. మరి మున్ముందు ఈ రెండు జట్ల మధ్య జరగబోయే సిరీస్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు