Ashutosh Sharma: అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు...
చాలీచాలని గదుల్లో ఇబ్బందిపడ్డాడు.. రోజువారి ఆహారం కోసం ఎన్నో చోట్ల పని చేశాడు. క్రికెటర్గా ఎదిగే అవకాశం లేకపోవడంతో అంపైర్గా అయినా మైదానంలో ఉంటే చాలు అనుకున్నాడు! అలాంటి కుర్రాడు ఐపీఎల్ (IPL) లాంటి మెగా టోర్నీకి ఎంపిక కావడమే ఓ చిత్రమైతే.. అద్భుతమైన ఆటతో పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక బ్యాటర్గా ఎదగడం మరో చిత్రం! అతడే అశుతోష్ శర్మ (Ashutosh Sharma)!
కష్టాలకు ఎదురు నిలిచి
హైదరాబాద్పై 15 బంతుల్లోనే 33.. గుజరాత్పై 17 బంతుల్లో అజేయంగా 31..రాజస్థాన్పై 16 బంతుల్లోనే 31 పరుగులు... లేటెస్ట్గా ముంబయిపై 28 బంతుల్లో 61.... ఈ గణాంకాలు చాలు అశుతోష్ సత్తా ఏంటో చెప్పడానికి. మధ్యప్రదేశ్లోని రాత్లామ్ గ్రామానికి చెందిన అతడు క్రికెటర్గా ఎదగడం నిజంగా పెద్ద విశేషమే. ఎందుకంటే అతడి కుటుంబానికి ఆర్థిక స్థోమత లేదు. అయినా కూడా అశుతోష్ మాత్రం ఆటపై ప్రేమని చంపుకోలేదు. భారత మాజీ క్రికెటర్ అమే కురేసియా పరిచయం కావడం అతడి కెరీర్ను మలుపు తిప్పింది. అతడి అండతో నెమ్మదిగా వివిధ టోర్నీల్లో సత్తా చాటాడు. తిండి కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు.
ఎనిమిదేళ్ల వయసులో అశుతోష్ రాత్లామ్ నుంచి ఇండోర్కు శిక్షణ నిమిత్తం వచ్చాడు. మధ్యప్రదేశ్ తరఫున లిస్ట్-ఏ మ్యాచ్ల్లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఎదిగిన అతడు హార్డ్ హిట్టర్గా పేరు సంపాదించాడు. 2019లో సయ్యద్ ముస్తాక్అలీ టోర్నీ తుది పోరులో 84 పరుగులు చేసి సత్తా చాటాడీ కుర్రాడు. కొవిడ్-19 రావడంతో అతడి కెరీర్కు బ్రేక్ పడింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. ఎంతగా రాణించినా రిజర్వ్ బెంచ్పైనే కూర్చోబెట్టేవాళ్లు. దీనికి తోడు ఇల్లు గడవడం కష్టమైంది. ఆటతో అనుబంధాన్ని తెంచుకోలేక డబ్బులు కూడా వస్తాయి అన్న ఆశతో అంపైరింగ్ చేశాడు. ఇక తాను క్రికెటర్గా ఎదగడమే కష్టమని భావించాడు.
‘‘అమే సార్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే క్రికెటర్గా ఎదిగాను. ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. చాలీచాలని గదుల్లో పడుకున్నా. డబ్బులు సరిపోక ఎన్నో పనులు చేశాను. ఇప్పుడు ఐపీఎల్లో ఆడడం.. రాణిస్తుండడం చాలా సంతోషంగా ఉంది’’
- అశుతోష్ శర్మ
యువీ రికార్డును కొట్టి
2023 ముస్తాక్ అలీ టోర్నీ అశుతోష్ జీవితాన్ని మలుపు తిప్పింది. టీ20ల్లో యువరాజ్ సింగ్ సాధించిన రికార్డును బద్దలు కొట్టడంతో అతడు క్రికెటింగ్ సర్కిల్స్లో అందరికి పరిచయమైపోయాడు. అరుణాచల్ ప్రదేశ్పై 11 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి ఔరా అనిపించాడీ హిట్టర్. టీ20లకు తాను పక్కాగా పనికొస్తానని మరోసారి రుజువు చేశాడు. యార్కర్ లెంగ్త్లో పడిన బంతులను సైతం స్టాండ్స్లోకి కొట్టడం.. హై బ్యాక్ లిఫ్ట్తో బంతిని బాదేయడం ఈ కుర్రాడి స్టయిల్. దీంతో 2024 ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు ఈ ఆల్రౌండర్ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ అతడు వమ్ము చేయలేదు.
కీలక సమయాల్లో ఆ జట్టును ఆదుకున్నాడు అశుతోష్. ఓ మ్యాచ్లో విజయాన్ని కూడా అందించాడు. గుజరాత్ టైటాన్స్పై 17 బంతుల్లోనే 31 పరుగులు చేసి పంజాబ్ను గెలిపించాడు. ముంబయితో గురువారం జరిగిన మ్యాచులో జట్టును విజయం అంచులకు తీసుకెళ్లాడు. కొన్ని షాట్లు చూస్తుంటే మరో సూర్యకుమార్ యాదవ్ను చూసినట్లే ఉందని మాజీ క్రికెటర్లు అంటుండటం విశేషం. అగ్రశ్రేణి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంధించిన యార్కర్ను సిక్సర్గా మలచడంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. అయితే పంజాబ్ ఓడుతున్నా అశుతోష్ మాత్రం అవకాశాలను వృథా చేయట్లేదు. మున్ముందు అతడెలా రాణిస్తాడో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం