WPL 2024: అమ్మాయిలు.. తగ్గేదేలే.. డబ్ల్యూపీఎల్లో అదుర్స్
తొలి సీజన్ కంటే రెండో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ కూడా అభిమానులకు క్రికెట్ మజాను అందిస్తోంది.
మునివేళ్లపై నిలబెట్టే ఉత్కంఠ.. నరాలు తెగే నాటకీయత. మ్యాచ్ ఎటు తిరుగుతుందో.. విజేతగా ఏ జట్టు నిలుస్తుందో అనే టెన్షన్. బంతి బంతికీ గుండె చప్పుడు పెరుగుతూ.. తగ్గుతూ సాగే మలుపులు. ఇదే.. కదా ఐపీఎల్ అందించే కిక్కు. కానీ ఈసారి ఐపీఎల్ కంటే ముందే ఇలాంటి టీ20 ఎంటర్టైన్మెంట్ అభిమానులను అలరిస్తోంది. హోరాహోరీ పోరాటాలతో అసలు మజా వస్తోంది. అందుకు కారణం అమ్మాయిలు. అవును.. రసవత్తర పోరాటాలతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది.
ఆ మెరుపులతో..
గత మూడు మ్యాచ్లతో డబ్ల్యూపీఎల్ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. మహిళా క్రికెటర్ల అసాధారణ ప్రదర్శనతో చివరివరకూ అత్యంత ఉత్కంఠగా సాగి ఆఖరి బంతికి ఫలితాలు తేలడం అభిమానులను అలరిస్తోంది. ఆదివారం దిల్లీ క్యాపిటల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన పోరు అయితే మునివేళ్లపై నిలబెట్టింది. 182 పరుగుల ఛేదనలో రిచా ఘోష్ (51; 29 బంతుల్లో 4×4, 3×6) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఆర్సీబీ గెలిచేలా కనిపించింది. కానీ చివరి బంతికి రిచా రనౌట్ కావడంతో దిల్లీ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఇప్పుడా మ్యాచ్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శనివారం ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య పోరు మరో లెవల్. ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ (95 నాటౌట్; 48 బంతుల్లో 10×4, 5×6) సంచలన ఇన్నింగ్స్తో చెలరేగింది. అసలు ఆశలు లేని స్థితిలో అమోఘమైన బ్యాటింగ్తో సత్తా చాటింది. బ్యాటింగ్తో ముంబయికి మరో బంతి మిగిలిఉండగా అద్భుత విజయాన్ని అందించింది. అంతకంటే ముందు మ్యాచ్లో యూపీ వారియర్స్ 138 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న తీరు అదుర్స్ అనే చెప్పాలి. 93/2తో గెలుపు దిశగా సాగిన దిల్లీని యూపీ బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. దీప్తి శర్మ (4/19) హ్యాట్రిక్తో అదరగొట్టింది.
లీగ్కు ఆకర్షణగా
ఈసారి తొలి మ్యాచ్తోనే డబ్ల్యూపీఎల్కు మంచి హైప్ వచ్చింది. ఆరంభ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సజన చివరి బంతికి సిక్సర్ కొట్టడంతో దిల్లీ క్యాపిటల్స్పై ఆ జట్టు గెలిచింది. ఆ తర్వాత నుంచి రసవత్తర పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. హర్మన్ప్రీత్ కౌర్ (ముంబయి), మెగ్ లానింగ్ (దిల్లీ), స్మృతి మంధాన (ఆర్సీబీ), జెమీమా రోడ్రిగ్స్ (దిల్లీ) మెరుపులతో లీగ్కు ప్రత్యేక ఆకర్షణ తెస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో లానింగ్ (290), స్మృతి (248), హర్మన్ప్రీత్ (235) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక సిక్సర్ల విషయానికి వస్తే యువ సంచలనం షెఫాలీ వర్మ దూకుడుతో సాగుతోంది. ఇప్పటికే ఆమె 12 సిక్సర్లు బాదింది. బౌలింగ్లో స్పిన్నర్ రాధా యాదవ్ (10 వికెట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్కు చేరాయి. మరో స్థానం కోసం ఆర్సీబీ, యూపీ వారియర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరి ఈ రెండు జట్ల నుంచి ముందంజ వేసేది ఎవరో చూడాలి. లీగ్ మ్యాచ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్టు.. తుదిపోరులో చోటు కోసం ఎలిమినేటర్లో తలపడతాయి. ఈ ప్లేఆఫ్స్ మ్యాచ్లు అభిమానులకు మరింత టీ20 విందు అందించడం ఖాయమనే చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్