Dhoni: సింహం ఎక్కడైనా సింహమే.. ముంబయిలోనూ ‘ధోనీ’ ఫీవర్
సింహం ఎక్కడైనా సింహమే. అది అడవిలో ఉన్నా.. అడవి విడిచి బయటకు వచ్చినా.. ఎలాంటి తేడా ఉండదు. చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా అంతే...
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: సింహం ఎక్కడైనా సింహమే. అది అడవిలో ఉన్నా.. అడవి విడిచి బయటకు వచ్చినా.. ఎలాంటి తేడా ఉండదు. చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా అంతే.. అతడు చెన్నైలో ఛేదించినా.. దుబాయ్లో దూకుడుగా ఆడినా.. ముంబయిలో మురిపించినా.. ఎక్కడైనా ఒక్కటే తీరు. ప్రశాంతంగా ఉంటూ తన ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే అతడికి తెలిసింది. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్లోనూ అదే చేశాడు. దీంతో అతడిని ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో తనలో ఇంకా మునుపటి సత్తా ఉందని చెప్పకనే చెప్పాడు. ఈ మ్యాచ్లోని పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
అభిమానం అంటే ఇదీ..
* ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆటగాడు చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. అతడు ఎక్కడ మ్యాచ్లు ఆడినా అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అది చెన్నై, దుబాయ్, ముంబయి.. ఎక్కడైనా సరే. మరీ ముఖ్యంగా తన సొంత ఊరు రాంచీ కన్నా.. చెన్నై అభిమానులే మహీ పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తారు. అది ముంబయితో నిన్న జరిగిన మ్యాచ్లోనూ కనిపించింది. డీవైపాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. స్థానిక జట్టు అభిమానుల కన్నా చెన్నై అభిమానులే సందడి చేశారు.
నువ్వే మా సారథి..
* మహీ క్రీజులోకి వచ్చినప్పుడు స్టాండింగ్ ఓవియేషన్తో ఘన స్వాగతం పలికిన అభిమానులు.. చివరి బంతికి అతడు ఫోర్ కొట్టి చెన్నైని విజయతీరాలకు చేర్చేంతవరకూ ‘ధోనీ’ పేరును స్టేడియంలో మార్మోగించారు. స్టేడియంలో ఏ మూలన చూసినా అతడి అభిమానులే. చెన్నై జెండాను ఊపుతూ ఆ జట్టుకు పూర్తి మద్దతు పలికారు. ఇక 20వ ఓవర్లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరమైన వేళ వాళ్ల సందడి అంతా ఇంతా కాదు. స్టేడియం మొత్తం ధోనీ ధోనీ అనే నామ స్మరణతో సందడి నెలకొంది. ఇప్పుడు జడేజా కెప్టెన్ అయినా, మహీనే మా సారథి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నమ్మకాన్ని నిలబెట్టుకొని..
* ముంబయి ఈ మ్యాచ్లో 155 పరుగులే చేసినా ఆ స్కోరును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను చివరివరకూ నడిపించారు. దీంతో ఆఖరి ఓవర్లో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చెన్నై గెలవడానికి బాగా కష్టపడింది. జయదేవ్ ఉనద్కత్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికే ప్రిటోరియస్ (23) వికెట్ పడగొట్టి చెన్నై అభిమానుల్లో కాస్త కంగారు పెట్టించాడు. అయితే, వాళ్లకు ధోనీ ఉన్నాడనే నమ్మకం ఉంది. దీంతో వాళ్ల నమ్మకాన్ని నిజం చేస్తూ ధోనీ ఎప్పటిలాగే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
ఒత్తిడినే చిత్తు చేస్తూ..
* ఆఖరి ఓవర్లో పరిస్థితులు కఠినంగా ఉన్నా ధోనీ చాలా కూల్గా కనిపించాడు. తన ముఖంలో ఏమాత్రం ఆందోళన, తడబాటు కనపడలేదు. అలా కనిపిస్తే అతడు ధోనీ ఎందుకవుతాడు! తొలి బంతికే వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన బ్రావో(1) సింగిల్ తీసిచ్చాడు. దీంతో బ్యాటింగ్ ఎండ్లోకి వచ్చిన ధోనీ.. మిగతా నాలుగు బంతుల్లో 16 పరుగులు సాధించాడు. మూడో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ సంధించిన తర్వాత.. నాలుగో బంతిని డీప్ ఫైన్లెగ్లో బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీసి.. ఆఖరి బంతిని లాంగ్ లెగ్లోకి దంచికొట్టాడు. అంతే చెన్నైకి అపురూప విజయాన్ని అందించాడు. చివరికి గావస్కర్ కూడా మహీ ఆటకు ఫిదా అయ్యాడు. అతడిలా ఆడితే ఎవరూ ఏం చేయలేరన్నాడు.
జడేజా తలవంచి గౌరవించి..
* చెన్నై జట్టుకు ఇప్పుడు రవీంద్ర జడేజా కెప్టెన్ అయినా ధోనీకి తగినంత గౌరవం ఇచ్చాడు. మ్యాచ్ గెలిచాక మైదానంలోకి వచ్చిన జడ్డూ తన మాజీ సారథి ముందు తన క్యాప్ తీసి తలవంచి నమస్కరించాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారింది. దీంతో జడ్డూ.. ధోనికి ఎంత విలువ ఇస్తాడో తెలిసొచ్చింది. మీరూ ఆ వీడియోలు చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా