Dhoni: సింహం ఎక్కడైనా సింహమే.. ముంబయిలోనూ ‘ధోనీ’ ఫీవర్
సింహం ఎక్కడైనా సింహమే. అది అడవిలో ఉన్నా.. అడవి విడిచి బయటకు వచ్చినా.. ఎలాంటి తేడా ఉండదు. చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా అంతే...
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: సింహం ఎక్కడైనా సింహమే. అది అడవిలో ఉన్నా.. అడవి విడిచి బయటకు వచ్చినా.. ఎలాంటి తేడా ఉండదు. చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా అంతే.. అతడు చెన్నైలో ఛేదించినా.. దుబాయ్లో దూకుడుగా ఆడినా.. ముంబయిలో మురిపించినా.. ఎక్కడైనా ఒక్కటే తీరు. ప్రశాంతంగా ఉంటూ తన ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే అతడికి తెలిసింది. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్లోనూ అదే చేశాడు. దీంతో అతడిని ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో తనలో ఇంకా మునుపటి సత్తా ఉందని చెప్పకనే చెప్పాడు. ఈ మ్యాచ్లోని పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
అభిమానం అంటే ఇదీ..
* ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆటగాడు చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. అతడు ఎక్కడ మ్యాచ్లు ఆడినా అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అది చెన్నై, దుబాయ్, ముంబయి.. ఎక్కడైనా సరే. మరీ ముఖ్యంగా తన సొంత ఊరు రాంచీ కన్నా.. చెన్నై అభిమానులే మహీ పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తారు. అది ముంబయితో నిన్న జరిగిన మ్యాచ్లోనూ కనిపించింది. డీవైపాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. స్థానిక జట్టు అభిమానుల కన్నా చెన్నై అభిమానులే సందడి చేశారు.
నువ్వే మా సారథి..
* మహీ క్రీజులోకి వచ్చినప్పుడు స్టాండింగ్ ఓవియేషన్తో ఘన స్వాగతం పలికిన అభిమానులు.. చివరి బంతికి అతడు ఫోర్ కొట్టి చెన్నైని విజయతీరాలకు చేర్చేంతవరకూ ‘ధోనీ’ పేరును స్టేడియంలో మార్మోగించారు. స్టేడియంలో ఏ మూలన చూసినా అతడి అభిమానులే. చెన్నై జెండాను ఊపుతూ ఆ జట్టుకు పూర్తి మద్దతు పలికారు. ఇక 20వ ఓవర్లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరమైన వేళ వాళ్ల సందడి అంతా ఇంతా కాదు. స్టేడియం మొత్తం ధోనీ ధోనీ అనే నామ స్మరణతో సందడి నెలకొంది. ఇప్పుడు జడేజా కెప్టెన్ అయినా, మహీనే మా సారథి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నమ్మకాన్ని నిలబెట్టుకొని..
* ముంబయి ఈ మ్యాచ్లో 155 పరుగులే చేసినా ఆ స్కోరును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను చివరివరకూ నడిపించారు. దీంతో ఆఖరి ఓవర్లో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చెన్నై గెలవడానికి బాగా కష్టపడింది. జయదేవ్ ఉనద్కత్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికే ప్రిటోరియస్ (23) వికెట్ పడగొట్టి చెన్నై అభిమానుల్లో కాస్త కంగారు పెట్టించాడు. అయితే, వాళ్లకు ధోనీ ఉన్నాడనే నమ్మకం ఉంది. దీంతో వాళ్ల నమ్మకాన్ని నిజం చేస్తూ ధోనీ ఎప్పటిలాగే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
ఒత్తిడినే చిత్తు చేస్తూ..
* ఆఖరి ఓవర్లో పరిస్థితులు కఠినంగా ఉన్నా ధోనీ చాలా కూల్గా కనిపించాడు. తన ముఖంలో ఏమాత్రం ఆందోళన, తడబాటు కనపడలేదు. అలా కనిపిస్తే అతడు ధోనీ ఎందుకవుతాడు! తొలి బంతికే వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన బ్రావో(1) సింగిల్ తీసిచ్చాడు. దీంతో బ్యాటింగ్ ఎండ్లోకి వచ్చిన ధోనీ.. మిగతా నాలుగు బంతుల్లో 16 పరుగులు సాధించాడు. మూడో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ సంధించిన తర్వాత.. నాలుగో బంతిని డీప్ ఫైన్లెగ్లో బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీసి.. ఆఖరి బంతిని లాంగ్ లెగ్లోకి దంచికొట్టాడు. అంతే చెన్నైకి అపురూప విజయాన్ని అందించాడు. చివరికి గావస్కర్ కూడా మహీ ఆటకు ఫిదా అయ్యాడు. అతడిలా ఆడితే ఎవరూ ఏం చేయలేరన్నాడు.
జడేజా తలవంచి గౌరవించి..
* చెన్నై జట్టుకు ఇప్పుడు రవీంద్ర జడేజా కెప్టెన్ అయినా ధోనీకి తగినంత గౌరవం ఇచ్చాడు. మ్యాచ్ గెలిచాక మైదానంలోకి వచ్చిన జడ్డూ తన మాజీ సారథి ముందు తన క్యాప్ తీసి తలవంచి నమస్కరించాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారింది. దీంతో జడ్డూ.. ధోనికి ఎంత విలువ ఇస్తాడో తెలిసొచ్చింది. మీరూ ఆ వీడియోలు చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి