IPL 2024: ఐపీఎల్ తొలి వేలంలో ధోనీ ధర ఎంతో తెలుసా? 2008 ఆక్షనీర్ పోస్ట్ వైరల్
ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, స్టార్క్ రికార్డు ధరలను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. మరి తొలి సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు ఎవరో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఓ సంచలనంగా మారింది. తొలి సీజన్ నుంచే భారీగా ప్రజాదరణ దక్కించుకుంది. అటువైపు ఆటగాళ్లకూ కాసుల వర్షం కురిసింది. తొలి ఐపీఎల్ సీజన్కు.. ఇప్పటి ఎడిషన్కు వీక్షణల ప్రకారం, ఆటగాళ్ల భత్యాలపరంగా చాలా తేడా ఉంది. మొదటి సీజన్ 2008లో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 17వ సీజన్ మార్చి 22 నుంచి మొదలుకానుంది. తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న క్రికెటర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందులో టీమ్ఇండియా ‘కెప్టెన్ కూల్’, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు. ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్గా నిలిపాడు. మరి అలాంటి మాహీ తొలి వేలంలో ఎంత దక్కించుకున్నాడనేది ఆసక్తికరమే కదా.. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ ఆటగాళ్లు భారీ ధరను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తొలి వేలాన్ని నిర్వహించిన ఆక్షనీర్ రిచర్డ్ మ్యాడ్లీ కొంతమంది టాప్ ప్లేయర్లతో కూడిన జాబితాను పోస్టు చేసి.. వీరికి ఎంత మొత్తం దక్కిందో వెల్లడించాలని కోరాడు. ఇప్పుడా పోస్టు వైరల్గా మారిపోయింది. ఆసీస్ దివంగత దిగ్గజం షేన్ వార్న్, ఎంఎస్ ధోనీ, ఆడమ్ గిల్క్రిష్ట్, షోయబ్ అక్తర్, మహేల జయవర్థనె, ముత్తయ్య మురళీధరన్ కనీస ధరతో కూడిన లిస్ట్ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.
- షేన్ వార్న్ 4,50,000 డాలర్లతో (రూ.1.90 కోట్లు) బరిలోకి దిగాడు. అంతే మొత్తం వద్ద రాజస్థాన్ రాయల్స్ వార్న్ను తీసుకుంది. తొలి సీజన్లోనే ఆర్ఆర్ను ఛాంపియన్గా నిలిపాడు.
- ఎంఎస్ ధోనీ 4 లక్షల (రూ. 1.70 కోట్లు) డాలర్లతో వేలంలోకి వెళ్లాడు. ఏకంగా 15 లక్షల డాలర్లు (రూ. 6.45 కోట్లు) దక్కించుకున్నాడు. అప్పుడు డాలర్ విలువ దాదాపు రూ. 43 మాత్రమే. ఆ లెక్కన ఆ సీజన్లో ఎక్కువ మొత్తం దక్కించుకున్న క్రికెటర్గా ధోనీ నిలిచాడు. సచిన్కూ 11.21 లక్షల డాలర్లతో (రూ4.80 కోట్లు) తర్వాత స్థానమే.
- ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ 3 లక్షల డాలర్లకు వేలంలోకి రాగా.. డెక్కన్ ఛార్జర్స్ 7 లక్షల డాలర్లకు తీసుకుంది. అంటే మన రూపాయల్లో రూ. 3 కోట్లు.
- పాక్ మాజీ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్ను కోల్కతా నైట్రైడర్స్ 4,25,000 డాలర్లకు (1.80 కోట్లు) కొనుగోలు చేసింది. అతడి బేస్ వ్యాల్యూ 2,50,000 డాలర్లు మాత్రమే.
- మహేల జయవర్థనె 2,50,000 డాలర్లతో వేలంలోకి వచ్చాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4,75,000 డాలర్లకు (రూ. 2.05 కోట్లు) తీసుకుంది.
- ముత్తయ్య మురళీధరన్ను సీఎస్కే 6 లక్షల డాలర్లు (రూ.2.60 కోట్లు) వెచ్చించి దక్కించుకుంది. అతడి కనీస ధర 2.50 లక్షల డాలర్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం