IPL 2023: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు.. ఓడితే.. కష్టమే!
సన్రైజర్స్ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్ను ముంబయితో (MI vs SRH) ఆడనుంది. ఈ మ్యాచ్ ఫలితంతో హైదరాబాద్కు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదు. కానీ, ముంబయి ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే గుజరాత్ కూడా బెంగళూరుపై (RCB vs GT) గెలిచినా/ఓడినా తన అగ్రస్థానం చెక్కుచెదరదు. ఆర్సీబీ ఓడితే మాత్రం కష్టాలు తప్పవు.
ఇంటర్నెట్ డెస్క్: గత యాభై రోజులుగా అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ లీగ్ దశ చివరి రోజుకు చేరింది. నేడు మూడు జట్ల ప్లేఆఫ్స్ భవితవ్యం తేలనుంది. ఖాళీగా ఉన్న ఏకైక బెర్తు కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో బెంగళూరు, ముంబయి జట్లు ముందంజలో ఉండగా.. వీటి ఫలితాలపైనే రాజస్థాన్ అవకాశం ఆధారపడింది.
తొలుత ముంబయి (14 పాయింట్లు) - హైదరాబాద్ (8 పాయింట్లు) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో ముంబయి గెలిస్తే.. బెంగళూరు ఎంత తేడాతో గుజరాత్పై విజయం సాధించాలనేది తేలుతుంది. ఒకవేళ ముంబయి ఓడిపోతే.. బెంగళూరు స్వల్ప తేడాతో గెలిచినా చాలు నాలుగో బెర్తు సొంతమవుతుంది. ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే.. రాజస్థాన్ రాయల్స్కూ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అప్పుడు మూడు జట్లూ పద్నాలుగేసి పాయింట్లతో ఉంటాయి. నెట్రన్రేట్ మెరుగ్గా ఉన్న టీమ్ ప్లేఆఫ్స్కు చేరుతుంది. లఖ్నవూ సూపర్జెయింట్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడాల్సి ఉంటుంది.
వర్షం పడే అవకాశాలు
ముంబయి, రాజస్థాన్ జట్లతో పోలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ, గుజరాత్తో బెంగళూరు వేదికగా ఆర్సీబీ తలపడనుంది. అయితే, బెంగళూరులో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం చినుకులు పడేందుకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ మ్యాచ్ జరగకుండా రద్దు అయితే గుజరాత్, బెంగళూరుకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు బెంగళూరు ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ముంబయి ఒకవేళ హైదరాబాద్పై విజయం సాధిస్తే మాత్రం బెంగళూరు ఆశలకు అడ్డుకట్ట పడుతుంది. ముంబయి 16 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్తుంది. అలాకాకుండా విజయం సాధిస్తే మెరుగైన రన్రేట్ కారణంగా ఆర్సీబీ ముందంజ వేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్