IPL 2023- Playoffs: ఈ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్కు ఎలా చేరాయంటే?
ఐపీఎల్-16లో రేపటి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ (Playoffs) చేరిన నాలుగు జట్లు ఏ జట్టుపై విజయం సాధించాయి, ఏ టీమ్పై ఓడిపోయాయో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 సీజన్లో లీగ్ దశ ముగిసింది. ఈ సారి ఎన్నాడూ లేనంతగా హోరాహోరీ మ్యాచ్లు జరిగాయి. చాలా మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లో చివరి బంతి వరకు ఫలితం తేలలేదు. అంతేకాదు లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వరకు చివరి ప్లేఆఫ్స్ బెర్తు తేలలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) విజయం సాధించడంతో ఆఖరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్కు చేరుకున్న జట్లు ఏ టీమ్పై గెలిచాయి, ఏ టీమ్తో ఓటమిపాలయ్యాయి అనే దానిపై ఓ లుక్కేద్దాం.
గుజరాత్ టైటాన్స్ (GT)
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి పాయింట్ల పట్టికలో 10 విజయాలు, 4 ఓటములతో అగ్రస్థానంలో నిలిచి అన్ని జట్ల కంటే ముందుగా ప్లేఆఫ్స్ బెర్తుని ఖాయం చేసుకుంది.
విజయాలు: చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ (రెండుసార్లు), ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఓటములు: కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
గతేడాది పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో చెలరేగుతోంది. 14 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు, 5 పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో కలిపి 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
విజయాలు: లఖ్నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ (రెండు సార్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ (రెండు సార్లు). లఖ్నవూతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్.
ఓటములు: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (రెండుసార్లు), పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్.
లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG)
లఖ్నవూ సూపర్ జెయింట్స్ కూడా వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు, 5 ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో కలిపి 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సీఎస్కేకు కూడా 17 పాయింట్లే ఉన్నప్పటికీ మెరుగైన రన్రేట్ ఉండటంతో ఆ జట్టు రెండో స్థానంలో నిలిచింది.
విజయాలు: దిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (రెండు సార్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్. చెన్నైతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్.
ఓటములు: చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (రెండుసార్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ముంబయి ఇండియన్స్ (MI)
ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు (5) విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో చివరి ప్లేఆఫ్స్ బెర్తుని దక్కించుకుంది. ఆఖరి మ్యాచ్లో సన్రైజర్స్పై నెగ్గడంతోపాటు గుజరాత్పై ఆర్సీబీ ఓడిపోవడంతో ముంబయి ముందంజ వేసింది. ఆ జట్టు ఖాతాలో 8 విజయాలు, 6 ఓటములున్నాయి.
విజయాలు: దిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (రెండుసార్లు), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్.
ఓటములు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ (రెండు సార్లు), పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?