Cricket News: ఎన్నికలు ఉన్నా భారత్లోనే ఐపీఎల్? ఆ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా డీకే
సార్వత్రిక ఎన్నికలు ఉన్నా ఈ సారి ఐపీఎల్ (IPL 2024)ను భారత్లోనే నిర్వహించనున్నారని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ (IPL)కు మామూలు క్రేజ్ లేదు. ముఖ్యంగా భారత్లో ఈ లీగ్ జరుగుతుందంటే పండగ వాతావరణమే. తమ అభిమాన ఆటగాళ్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు పోటెత్తుతారు. విదేశీ స్టార్ ఆటగాళ్లు కూడా భాగమయ్యే ఈ లీగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 2024 సీజన్ (IPL 2024) మినీ వేలం పూర్తయింది. అయితే, ఈసారి ఐపీఎల్ను ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. 2009లో దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో మొదటి 20 మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించారు. 2019లో మొదట కొన్ని మ్యాచ్ల షెడ్యూల్ ప్రకటించిన ఐపీఎల్ పాలక మండలి.. ఎన్నికల నగారా మోగిన తర్వాత మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ని విడుదల చేసింది.
ఈసారి ఇండియాలోనే?
సార్వత్రిక ఎన్నికలున్నా ఈసారి భారత్లోనే ఐపీఎల్ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ (BCCI) వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘టోర్నమెంట్ను దేశం వెలుపలికి మార్చే ఆలోచన లేదు. సార్వత్రిక ఎన్నికలు కూడా అదే సమయంలో జరుగుతాయి. అప్పుడు ఏదైనా రాష్ట్రం సహేతుకమైన కారణంతో మ్యాచ్ నిర్వహణకు ఇష్టం చూపకపోతే ఆ మ్యాచ్ను మరొక వేదికకు తరలించవచ్చు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ జూన్ 2 నుంచి మొదలవనుంది. అంతకంటే 10 రోజుల ముందుగానే ఐపీఎల్ సీజన్ను ముగించాలని యోచిస్తున్నారు. ఎన్నికల నగారా మోగగానే ఐపీఎల్ షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది.
ఆ రెండు నగరాల్లో డబ్ల్యూపీఎల్ సీజన్-2 మ్యాచ్లు ?
గతేడాది నిర్వహించిన మహిళల ప్రిమియర్ లీగ్ (WPL)కు విశేషమైన ఆదరణ లభించడంతో రెండో సీజన్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ టోర్నీని నిర్వహించే అవకాశముంది. తొలి సీజన్లో అన్ని మ్యాచ్లను ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియాల్లో నిర్వహించారు. రెండో సీజన్ మ్యాచ్లను దిల్లీ, బెంగళూరు నగరాలు ఆతిథ్యమిస్తాయని సమాచారం. పాలక మండలి త్వరలోనే ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తుందని తెలుస్తోంది.
ఇంగ్లాండ్ లయన్స్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా డీకే
భారత్, ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ లయన్స్, ఇండియా ‘ఎ’ జట్ల మధ్య ఓ వార్మప్ మ్యాచ్, నాలుగు రోజుల అనధికార టెస్టులు మూడు జరగనున్నాయి. ఈ మ్యాచ్ల కోసం ఇంగ్లాండ్ లయన్స్కు భారత వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) బ్యాటింగ్ కన్సల్టెంట్గా వ్యవహరించనున్నాడు. లయన్స్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్న ఇయాన్ బెల్ ప్రస్తుతం బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్తో పనిచేస్తున్నాడు. దీంతో డీకేని అతడి స్థానంలో నియమించుకున్నారు. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జనవరి 12 నుంచి వార్మప్ మ్యాచ్, 17 నుంచి అనధికార టెస్టులు ప్రారంభంకానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!