IPL 2024 : నాయకులైతే మారారు... మరి ఫలితం మారుస్తారా?
అసలైన క్రికెట్ మజాను అందించే ఐపీఎల్ 2024 (IPL 2024) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. 17వ సీజన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ (IPL 2024) మెగా సమరం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. టైటిలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని జట్లకు కొత్త సారథులు వచ్చారు. మరి వారు ఆయా జట్లను ఎలా నడిపిస్తారు? అభిమానుల అంచనాలు అందుకుంటారా?
సీఎస్కేకు కొత్త సారథి..
ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో జట్టును నడిపించిన ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ తన వారసుడిని ప్రకటించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా ధోనీ వెనకుండి జట్టును నడిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జట్టు విజయాల బాట పట్టే వరకూ అండగా నిలుస్తాడు. మైదానంలో మాత్రం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు రుతురాజ్కే ఉంటుంది. మరి అతడు ఎలా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడో చూడాలి. ఇప్పటి వరకు సీఎస్కే తరఫునే ఆడుతూ వచ్చిన రుతురాజ్ మొత్తం 52 మ్యాచ్లు ఆడి 1,797 పరుగులు చేశాడు.
ముంబయి.. అనూహ్యం..
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)ను అత్యధికంగా ఐదుసార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని.. ఈ సారి గుజరాత్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యకు పగ్గాలు అప్పగించారు. గుజరాత్ను విజయపథంలో నడిపి.. ఒకసారి విజేతగా, మరోసారి రన్నరప్గా నిలిపిన పాండ్య ఈ సారి ముంబయిని ఎలా నడిపిస్తాడో చూడాలి. గత కొన్ని సీజన్లుగా ముంబయి ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. గత సీజన్లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా.. 2022లో దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అలాంటి జట్టును తిరిగి గాడిలో పెట్టి ఛాంపియన్గా నిలబెట్టడం పాండ్యకు పెద్ద సవాలే. ఈ సీజన్లో పాండ్య కెప్టెన్సీలో రోహిత్ ఆడాలి. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో సమన్వయం ఎలా ఉంటుందో చూడాలి. విజేతగా నిలవడం అలవాటుగా మార్చుకున్న జట్టుకు నాయకత్వం వహించడం, అందులోనూ రోహిత్ వారసత్వం తీసుకోవడం పాండ్యకు తలకుమించిన భారమే అంటున్నారు విశ్లేషకులు. మరి పాండ్య ఏం చేస్తాడో చూడాలి.
గుజరాత్.. యువ సారథి..
అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్, ఆ తర్వాత రన్నరప్.. ఇలా గుజరాత్ టైటాన్స్ (Gujrat Titans) అందరి దృష్టిని ఆకర్షించింది. హార్దిక్ పాండ్య టీమ్ను వీడటంతో.. జట్టు పగ్గాలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్ స్వీకరించాడు. బ్యాటింగ్లో సత్తా చాటి జట్టుకు అనేక విజయాలు అందించిన గిల్.. ఈ సారి కెప్టెన్గా కొత్త పాత్రలో ఎలా రాణిస్తాడో చూడాలి. గత సీజన్లో 17 ఇన్నింగ్స్ల్లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సారి బ్యాటింగ్తో పాటు జట్టు సమన్వయ బాధ్యతలనూ చూసుకోవాలి. తక్కువ వయసు, కొద్దిపాటి అనుభవంతో ఆడి, ఆడించడం కత్తి మీద సామే అని చెప్పొచ్చు. సీనియర్లను, తనతోటి కుర్రాళ్లను సమన్వయం చేసుకుని జట్టు స్థాయిని కొనసాగించడం ఏమంత సులభం కాదనే చెప్పాలి.
కొత్త కెప్టెన్.. సన్రైజర్స్ రాత మారేనా..?
గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు కొత్త కెప్టెన్ వచ్చాడు. మినీ వేలంలో పాట్ కమిన్స్ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసి.. జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే ఇది రెండో అత్యధిక కొనుగోలు. వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన కమిన్స్.. సన్రైజర్స్ రాతా మార్చుతాడా అన్నది చూడాలి. గతంలో డేవిడ్ వార్నర్ నేతృత్వంలో 2016లో ఎస్ఆర్హెచ్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత సారథులు మారారే తప్ప.. జట్టుకు టైటిల్ అందించలేకపోయారు. ఈసారి కమిన్స్ నేతృత్వంలో ఛాంపియన్గా నిలవాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పొట్టి క్రికెట్లో కమిన్స్ ప్రదర్శన, నాయకత్వ పటిమ అంత ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం.
అయ్యర్పైనే కోల్కతా ఆశలు..
భారీ అభిమాన గణం ఉన్న జట్లలో కోల్కతా (Kolkata Knight Riders) ఒకటి. అయితే.. ఈ జట్టు గత కొంత కాలంగా తీవ్రంగా నిరాశపరుస్తోంది. కోచ్ చంద్రకాంత పండిట్ ఆధ్వర్యంలో గత సీజన్లో అనుభవం లేని నితీశ్ రాణా నేతృత్వంలో ఆ జట్టు పెద్దగా ఆకట్టుకుంది లేదు. గతేడాది గాయం కారణంగా దూరమైన... శ్రేయస్ అయ్యర్ సారథిగా వచ్చాడు. బ్యాటింగ్లో దూకుడు చూపించే అయ్యర్.. జట్టును అదే విధంగా నడిపిస్తాడని యాజమాన్యం ఆశలు పెట్టుకుంది. మరోవైపు కేకేఆర్ను రెండుసార్లు విజేతగా నిలబెట్టిన గౌతమ్ గంభీర్.. ఈ సారి జట్టుకు మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మరి చంద్రకాంత్ పండిట్ - శ్రేయస్ అయ్యర్ - గంభీర్ కాంబినేషన్లో కోల్కతా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
పంత్ వచ్చాడు.. దిల్లీ భవిత్యం?
ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో దిల్లీ (Delhi Capitals) ఒకటి. రోడ్డు ప్రమాదం కారణంగా గత సీజన్కు దూరమైన పంత్.. ఈ సీజన్లో తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చాడు. అయితే.. అతడి ఫిట్నెస్పై ఇంకా స్పష్టత లేదు. బ్యాటర్గానే కొనసాగుతాడని.. కీపింగ్ చేయడని తెలుస్తోంది. అన్ని మ్యాచ్లు ఆడేది కూడా ఫిట్నెస్పైనే ఆధారపడి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జట్టును పంత్ తనదైన వ్యూహాలతో ఎలా నడిపిస్తాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవేళ పంత్ అందుబాటులోకి రాకపోతే దిల్లీని డేవిడ్ వార్నర్ నడిపిస్తాడని ఇప్పటికే చెప్పేశారు. అప్పుడు ఈ జట్టు పాత కెప్టెన్ ఆధ్వర్యంలోనే బరిలోకి దిగుతుంది.
ఇక మిగతా ఐదు జట్లు పాత సారథుల నేతృత్వంలోనే ముందుకు సాగనున్నాయి. చెన్నైకి మహేంద్ర సింగ్ ధోనీ, రాజస్థాన్కు సంజూ శాంసన్, ఆర్సీబీకి ఫాఫ్ డు ప్లెసిస్, లఖ్నవూకు కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్కు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్