IPL 2024 playoffs: రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
ఐపీఎల్ 2024 (IPL)సీజన్లో గ్రూప్ దశలో ఇంకా ఎనిమిది మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. కానీ, కోల్కతా జట్టు ఒక్కటే ఇప్పటివరకు అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. ముంబయి, పంజాబ్ మినహా మిగతా అన్ని జట్లు నాకౌట్ రేసులో ఉన్నాయి. ఆదివారం రాజస్థాన్ను చెన్నై, దిల్లీని బెంగళూరు ఓడించడంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. అయితే, 13 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో ఉన్న దిల్లీ, 12 మ్యాచ్లు ఆడి 10 పాయింట్లతో ఉన్న గుజరాత్ సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్నాయి. ఆ జట్లు ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యం.
ఈ రెండు జట్లు కూడా
ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ జట్టు దాదాపు ప్లేఆఫ్స్ చేరినట్టే. మిగిలిన రెండు మ్యాచ్ల్లో (పంజాబ్, కోల్కతాతో) ఒక్క మ్యాచ్లో నెగ్గినా రాజస్థాన్ ప్లేఆఫ్స్కు చేరుతుంది. ఒకవేళ రెండింటిలో ఓడినా అవకాశం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో కాకుండా తక్కువ తేడాతో ఓడాలి. సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో (గుజరాత్, పంజాబ్తో) విజయం సాధిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంటుంది. మెరుగైన నెట్ రన్రేట్ ఉండటంతో ఒక్క మ్యాచ్లో విజయం సాధించినా హైదరాబాద్ నాకౌట్ చేరే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే రాజస్థాన్, హైదరాబాద్ కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది.
లఖ్నవూకు ఛాన్స్ ఉంది.. కానీ
పైన పేర్కొన్న విధంగా జరిగితే ఆఖరి బెర్తు కోసం చెన్నై, బెంగళూరు, లఖ్నవూ మధ్య పోటీ ఉంటుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న లఖ్నవూ మిగిలిన రెండు మ్యాచ్ల్లో దిల్లీ, ముంబయితో తలపడనుంది. ఈ జట్టుకు ప్లేఆఫ్స్ చేరడానికి మంచి అవకాశం ఉంది. కానీ, నెట్ రన్రేట్ ప్రతికూల అంశంగా మారింది. -0.769 నెట్ రన్రేట్ ఉన్న లఖ్నవూ మిగిలిన రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో నెగ్గితేనే నాకౌట్ దశకు చేరడానికి ఛాన్స్ ఉంటుంది.
బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరాలంటే..
ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరాలంటే హైదరాబాద్ ఒకటి లేదా రెండు మ్యాచ్ల్లో ఓడాలి. దాంతోపాటు లఖ్నవూ మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒక దాంట్లోనే విజయం సాధించాలి. వీటితోపాటు ముఖ్యంగా మే 18న చెన్నైతో జరిగే మ్యాచ్లో తప్పక విజయం సాధించాలి. సీఎస్కేపై 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో గెలవాలి లేదా చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే సీఎస్కే నెట్ రన్రేట్ను ఆర్సీబీ అధిగమిస్తుంది.
ఆర్సీబీ చేతిలో ఓడినా చెన్నైకి ఛాన్స్
ఆర్సీబీ చేతిలో ఓడినా చెన్నైకి ఛాన్స్ ఉంటుంది. బెంగళూరుపై భారీ తేడాతో కాకుండా స్వల్ప తేడాతో ఓడి నెట్ రన్రేట్ పడిపోకుండా చూసుకోవాలి. దీంతోపాటు సన్రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో ఓడిపోయి 14 పాయింట్లతో ఉండాలి. అంతేకాదు మే 14న లఖ్నవూను దిల్లీ ఓడించాలి. శుక్రవారం ముంబయి చేతిలో లఖ్నవూ ఓడాలి లేదా స్వల్ప తేడాతో నెగ్గాలి. అప్పుడే నాలుగైదు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. నెట్ రన్రేట్ మెరుగ్గా ఉన్న జట్టు ముందంజ వేస్తుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం