IPL 2024: ఐపీఎల్ 2024.. రూ. 3.60 కోట్ల యువ ఆటగాడికి రోడ్డు ప్రమాదం
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో గుజరాత్ ఆటగాడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ మినీ వేలంలో రూ.3.60 కోట్లు దక్కించుకుని అందరి దృష్టి ఆకర్షించిన గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాబిన్ మింజ్ (Robin Minz) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో వాహనం ఢీకొనడంతో అతడికి గాయాలయ్యాయని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ తెలిపారు. గాయం మరీ తీవ్రమైంది కాదని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో అతడి వాహనం ధ్వంసం కాగా.. మోకాలికి గాయాలయ్యాయి.
ఝార్ఖండ్లోని గుమ్లా జిల్లాకు చెందిన రాబిన్ మింజ్ ఐపీఎల్లో ఆడనున్న తొలి గిరిజన క్రికెటర్గా నిలిచాడు. ఎడమచేతి వాటం కలిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దేశవాళి టోర్నీల్లో దూకుడైన ఆటతో వెలుగులోకి వచ్చాడు. మాజీ కెప్టెన్ ధోనీకి కెరీర్ మొదట్లో శిక్షణ ఇచ్చిన చంచల్ భట్టాచార్య దగ్గరే మింజ్ కూడా శిక్షణ పొందుతున్నాడు.
2023 ఐపీఎల్ వేలంలో రాబిన్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఈ సీజన్లో మాత్రం ముంబయి, లఖ్నవూ, దిల్లీ, కోల్కతా జట్లు పోటీ పడగా గుజరాత్ జట్టు భారీ ధరకు దక్కించుకుంది. మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అతడిని ఎడమ చేతి వాటం పోలార్డ్ అని కొనియాడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి