Irfan Pathan: ఉమ్రాన్ విషయంలో నా అంచనాలు తప్పాయి: ఇర్ఫాన్ పఠాన్
దక్షిణాఫ్రికా పిచ్లపై ఆడేందుకు భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్డెస్క్: పేస్ బౌలింగ్కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్లపై ఆడేందుకు భారత సెలక్టర్లు ఎంపిక చేసిన జట్లపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కశ్మీర్ ఏస్ సీమర్ ఉమ్రాన్ మాలిక్కు ఓ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని ఈ ఆల్రౌండర్ అభిప్రాయం. ఇదే విషయాన్ని ట్విటర్లో నిర్మొహమాటంగా పోస్టు చేశాడు. ‘‘గత 11 నెలల క్రితం టీమ్ ఇండియాలో ఉన్న ఆటగాడికి ఈ సారి జట్టులో స్థానం దక్కుతుందని పూర్తిగా నమ్మాను’’ అని పేర్కొన్నాడు. దీనికి హ్యాష్ట్యాగ్ ఉమ్రాన్ మాలిక్ అని జోడించాడు.
గతంలో కూడా పఠాన్ చాలా సందర్భాల్లో ఉమ్రాన్కు మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన ఈ యువ పేసర్కు అక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. అప్పట్లో దీనిపై పఠాన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్లోనే అత్యంత వేగవంతమైన బౌలర్ను రిజర్వు బెంచ్లో ఎందుకు కూర్చోబెట్టారో నాకర్థం కావడంలేదు. ఉమ్రాన్ను ఆ ఫ్రాంఛైజీ సరిగ్గా వినియోగించుకోలేదు’’ అని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
మరోవైపు వేగంగా బంతులు వేయడం పక్కనపెడితే.. ధారాళంగా పరుగులిస్తాడనే అపవాదు ఉమ్రాన్పై ఉంది. అతడు తరచూ లైన్ అండ్ లెంగ్త్ను కోల్పోవడంతో ఈ పరిస్థితి వస్తోందనే పేరుంది. వన్డేల్లో అతడి ఎకానమీ 6.54 కాగా.. టీ20ల్లో ఏకంటా 10.48గా నిలిచింది. ఓ సందర్భంలో వ్యాఖ్యాత, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘తన (ఉమ్రాన్) బౌలింగ్ను తానే అర్థం చేసుకొనేట్లు చేయాలి. ఆటను, బ్యాటర్ను అర్థం చేసుకోవడం అవసరం. అతడు ఇప్పుడు ఆలోచిస్తున్న విధానం తప్పని స్వయంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉమ్రాన్కు నేను ఒక్కటే చెబుతున్నా.. ఎప్పుడు వేగాన్నే నమ్ముకొన్ని దుమ్మురేపేద్దామనుకొంటాడు. కానీ, అతడు గంటకు 150 కి.మీ వేగంతో బంతి వేస్తే.. బ్యాటర్ దానిని గంటకు 250 కి.మీ వేగంతో బాదేస్తాడు. ఎలా మొదలు పెట్టాలో అతడు తెలుసుకోవాలి. అతడు ఎందుకు విఫలమవుతున్నాడో వారు (కోచ్లు) వీడియో ఫుటేజీల్లో చూపించి ఉంటారు. అతడు మరింత భిన్నంగా ప్రయత్నించాలని చెప్పండి’’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!