Devdutt Padikkal: ధర్మశాలలో పడిక్కల్ అరంగేట్రం చేసేనా?
ధర్మశాల వేదికగా టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్కు భారత్, ఇంగ్లాండ్లు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్లో మరో ఆటగాడు టెస్టుల్లోకి అడుగుపెడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
స్వదేశంలో ఇంగ్లాండ్తో అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్ (IND vs ENG 2024)ను భారత్ ఇప్పటికే 3-1తో సొంతం చేసుకుంది. ఇక మిగిలింది ఆఖరి టెస్టు మాత్రమే. గురువారం ఈ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇప్పటికే సిరీస్ టీమ్ఇండియా సొంతమైన నేపథ్యంలో ఇది నామమాత్ర మ్యాచ్గా మారిపోయింది. అయినా ఈ మ్యాచ్కు ముందు ఓ విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత ఆటగాళ్ల అరంగేట్రాలకు వేదికగా మారిన ఈ సిరీస్లో మరో ఆటగాడు టెస్టుల్లో అడుగుపెడతాడా? అన్నది హాట్ టాపిక్గా మారింది. ఆ ఆటగాడే.. దేవ్దత్ పడిక్కల్ (Devdutt Padikkal). మరి ఈ టెస్టుతో అతను సుదీర్ఘ ఫార్మాట్లో రంగప్రవేశం చేస్తాడా? అన్నది చూడాలి.
పటీదార్ వైఫల్యంతో..
ప్రస్తుతం టీమ్ఇండియా తుదిజట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. అవకాశం కోసం కుర్రాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఛాన్స్ను ఉపయోగించుకోకుంటే వేటు తప్పదు. ఇప్పుడు రజత్ పటీదార్ (Rajat Patidar) పరిస్థితి కూడా ఇలాగే మారింది. కోహ్లీ స్థానంలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ఎంపికైన అతను.. రెండో మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వరుసగా మూడు టెస్టులాడాడు. కానీ బ్యాటింగ్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 30 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు ఆరు ఇన్నింగ్స్ల్లో వరుసగా 32, 9, 5, 0, 17, 0 పరుగులే చేశాడు. దీంతో చివరి టెస్టులో అతని స్థానంలో దేవ్దత్కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టుకు ముందు పడిక్కల్కు జట్టు నుంచి పిలుపొచ్చింది. అప్పటినుంచి జట్టుతోనే సాగుతున్న అతణ్ని అయిదో టెస్టులో ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మెరుగైన ప్రదర్శనతో..
ఫస్ట్క్లాస్ క్రికెట్లో సగటు, తాజా ఫామ్, వయసు ఇలా ఏరకంగా చూసినా పడిక్కల్ మెరుగ్గా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ అతను 31 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 44.54 సగటుతో 2,227 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలున్నాయి. 23 ఏళ్ల ఈ కర్ణాటక బ్యాటర్ ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ రంజీ ట్రోఫీ సీజన్లో ఆరు ఇన్నింగ్స్ల్లో 92.66 సగటుతో 556 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు చేశాడు. ఇప్పటికే భారత్ తరపున రెండు అంతర్జాతీయ టీ20లు ఆడిన దేవ్దత్ను టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్తో చివరి టెస్టులో రజత్ స్థానంలో దేవ్దత్ను ఆడించాలని టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ సూచించాడు. మరికొంతమంది మాజీ ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రజత్కు జట్టు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఈ నేపథ్యంలో రజత్నే కొనసాగించాలని జట్టు అనుకుంటే.. టెస్టు అరంగేట్రం కోసం దేవ్దత్ ఎదురుచూడక తప్పదు. ఒకవేళ 30 ఏళ్ల రజత్కు బదులు 23 ఏళ్ల దేవ్దత్ను ప్రోత్సహించాలని జట్టు మేనేజ్మెంట్ అనుకుంటే.. అప్పుడు పడిక్కల్కు తుది జట్టులో ప్లేస్ దక్కుతుంది. దీంతో రజత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జూరెల్, ఆకాశ్ దీప్ తర్వాత ఈ సిరీస్తో టెస్టుల్లో అడుగుపెట్టిన అయిదో భారత ఆటగాడిగా దేవ్దత్ నిలుస్తాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి