Ishan Kishan: ఈ ఇన్నింగ్స్తో ఇషాన్ వరల్డ్కప్ రేసులో ముందుకొచ్చాడు: రవిశాస్త్రి
వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించే అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఆసియా కప్లో పాక్పై అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులను ఆకట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో (Asia Cup 2023) పాకిస్థాన్పై 81 బంతుల్లోనే 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇషాన్ (Ishan Kishan) ఆటతీరుపై టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ స్పందించారు. వన్డే ప్రపంచ ముంగిట ఇషాన్ కిషన్కు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాడని పేర్కొన్నారు. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ ఎక్కడైనా ఆటగలడని మరోసారి నిరూపించాడు. పేస్ను ఎదుర్కోవడం, స్పిన్ను ఆడిన తీరు అద్భుతం. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దాడి కలిగిన పాక్ను అడ్డుకోవడం తేలికేం కాదు. కొన్ని షాట్లు ఆడిన తీరు అమోఘం’’ అని వసీమ్ అక్రమ్ తెలిపాడు.
నంబర్ 4లో బ్యాటింగ్కు వారిద్దరే రావాలి.. యువకులు కాదు: గంభీర్
వరల్డ్ కప్ కోసం ప్రకటించనున్న జట్టులో కనీసం ముగ్గురు ఎడమచేతివాటం బ్యాటర్లు ఉండాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్తో ఇషాన్ కిషన్ రేసులో అందరికంటే ముందుకు వచ్చాడని వ్యాఖ్యానించాడు. ‘‘బ్యాటర్గా పటిష్ఠమైన బౌలింగ్ను ఎదుర్కొని పరుగులు చేస్తే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. హారిస్ రవూఫ్, షహీన్, నసీమ్ వంటి పేసర్లు కలిగిన పాక్పై కీలక ఇన్నింగ్స్ ఆడటం అద్భుతం. తప్పకుండా ఇలాంటి ఇన్నింగ్స్ అతడిలో ఆత్మస్థైర్యం నింపుతుంది. వన్డే ప్రపంచకప్ స్క్వాడ్ రేసులో ఇషాన్ అందరికంటే ముందున్నాడు. ఎడమచేతివాటం కావడం కూడా కలిసిరావచ్చు. మరోవైపు కేఎల్ రాహుల్ వంటి ఉత్తమ బ్యాటర్ కూడా టీమ్ఇండియాకి అందుబాటులో ఉన్నాడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
షహీన్ను అర్థం చేసుకోవడం రోహిత్కు కష్టమే: షోయబ్
పాక్ పేసర్ షహీన్ బౌలింగ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్లీన్బౌల్డ్గా పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో షహీన్ బౌలింగ్ను రోహిత్ అర్థం చేసుకోవడంలో మరోసార విఫలం కావడంపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ‘‘ఇప్పటికీ షహీన్ బౌలింగ్ను అర్థం చేసుకోవడంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. అతడు ఆడిన తీరు బాగోలేదు. ఇంకాస్త ఉత్తమంగా ఆడాల్సిన అవసరం ఉంది. మరీ ఎక్కువగా ఆందోళన పడుతున్నందు వల్లే ఇలా జరిగి ఉండొచ్చు. అలాగే వర్షం వల్ల ఆటంకాలు ఎదురు కావడం కూడా బ్యాటర్ల మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. గ్రౌండ్లోకి రావడం, మళ్లీ వెనక్కి వెళ్లడం వల్ల ఫోకస్ దెబ్బతింటుంది. గిల్ ఇలానే తన వికెట్ను కోల్పోయినట్లుగా అనిపించింది’’ అని షోయబ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి