IND vs PAK : నంబర్ 4లో బ్యాటింగ్కు వారిద్దరే రావాలి.. యువకులు కాదు : సీనియర్లపై మండిపడ్డ గంభీర్
దాయాది పాకిస్థాన్(IND vs PAK)తో మ్యాచ్లో సీనియర్లు ఘోరంగా విఫలమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్ : ఆసియా కప్(Asia Cup 2023)లో తన తొలి మ్యాచ్.. అదీనూ చిరకాల ప్రత్యర్థిపై. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్(IND vs PAK)లో సత్తా చాటాల్సిన టీమ్ఇండియా(Team India) టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. పాకిస్థాన్ పేస్ దాడిని తట్టుకోలేక 66 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో భారత టాప్ ఆర్డర్ పేలవ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) టీమ్ఇండియా సీనియర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్పైనా విమర్శలు గుప్పించాడు.
సీనియర్లు కఠినమైన స్థానాల్లో బ్యాటింగ్కు దిగాలని గంభీర్ సూచించాడు. ‘ఇషాన్ కిషన్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో చూడండి. విండీస్తో వన్డేల్లో ఓపెనర్గా బరిలోకి దిగి అర్దశతకాలు నమోదు చేశాడు. సీనియర్ ఆటగాళ్లు కఠినమైన స్థానాల్లో బ్యాటింగ్కు రావాలి. యువ బ్యాటర్లు కాదు. నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేయాలంటే.. అది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీయే అయి ఉండాలి. సీనియర్లు ఆ బాధ్యతలు తీసుకోవాలి. యువ ఆటగాళ్లు రాణించాలంటే వారు ఆడే స్థానాలనే కేటాయించాలి’ అని గంభీర్ ఈ మ్యాచ్కు కామెంట్రీ చేస్తూ పేర్కొన్నాడు.
ఇక ఇటీవల టాప్ ఆర్డర్లో రాణిస్తున్న ఇషాన్ కిషన్.. నిన్న పాక్తో జరిగిన మ్యాచ్లో 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అదరగొట్టిన (82; 81 బంతుల్లో 9×4, 2×6) విషయం తెలిసిందే. టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (87; 90 బంతుల్లో 7×4, 1×6)తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని జోడించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు. వీరిద్దరూ పోరాడి ఉండకపోయి ఉంటే.. టీమ్ఇండియా పరిస్థితి ఇంకా దయనీయంగా ఉండేది. ఈ మ్యాచ్లో సీనియర్లు విఫలమవడంతోనే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. భారత్ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఆటంకం కలిగించిన వరుణుడు.. పాక్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండా చేశాడు. దీంతో మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింట్ ఇచ్చారు. అయితే.. ఆట మధ్యలో ఇరు జట్ల ఆటగాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. టీమ్ఇండియా ఆటగాళ్లు ఇలా కనిపించడంపై గంభీర్ స్పందించాడు. టీమ్ఇండియా ఆటగాళ్లు 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. మైదానం లోపల స్నేహపూర్వక చర్యలు ప్రదర్శించకూడదని.. అలాంటివి ఎప్పుడూ మైదానం బయటే ఉండాలని సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!