Bengaluru Vs Kolkata: ఈ సీజన్లో తొలి జట్టుగా కోల్కతా.. ‘500’ క్లబ్లోకి సునీల్ నరైన్
ఈ సీజన్లో బెంగళూరుకు రెండో ఓటమి ఎదురైంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా చేతిలో పరాజయంపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో 17వ సీజన్లో కోల్కతా దూకుడు కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అలవోకగా విజయం సాధించింది. దీంతో ఈ ఎడిషన్లో సొంతమైదానం కాకుండా బయటి వేదికల్లో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన తొలి జట్టుగా కోల్కతా నిలవడం విశేషం. అలాగే ఇప్పటి వరకు 10 మ్యాచ్లు జరగగా.. బెంగళూరు మాత్రమే సొంతమైదానంలో ఓడిపోయింది. కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించిన సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా 500 టీ20లు ఆడిన నాలుగో క్రికెటర్గా అవతరించాడు. కీరన్ పొలార్డ్ (660), డ్వేన్ బ్రావో (573), షోయబ్ మాలిక్ (542) మాత్రమే అతడి కంటే ముందున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం నరైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘టీ20ల్లో అద్భుతమైన మైలురాయి అందుకోవడం ఆనందంగా ఉంది. తప్పకుండా మరో 500 మ్యాచ్లు (నవ్వుతూ) ఆడతాననే నమ్మకం ఉంది. నాపై నాకున్న విశ్వాసం అలాంటిది. చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడటం రిలీఫ్గా అనిపించింది. జట్టులోని సహచరులతోపాటు సహాయక సిబ్బంది ప్రోత్సాహం మరువలేనిది. ఇప్పటికీ కఠినంగా శ్రమిస్తుంటా. పవర్ప్లే చివరి ఓవర్ అత్యంత క్లిష్టమైన ఓవర్. శుభారాంభాన్ని కొనసాగించడం సులువైన విషయం కాదు. మ్యాచ్ గెలిచినప్పుడు అందులో మన భాగస్వామ్యం ఉంటే ఆ అనుభూతి బాగుంటుంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉంటుంది’’ అని నరైన్ అన్నాడు. ఓపెనర్గా వచ్చిన నరైన్ 47 పరుగులు చేశాడు. అంతకుముందు బౌలింగ్లో ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇక్కడ రెండు సెషన్లు ప్రాక్టీస్ చేశాం: శ్రేయస్
‘‘బెంగళూరుతో మ్యాచ్కు ముందు ఈ మైదానంలో రెండు సెషన్లపాటు ప్రాక్టీస్ చేశాం. తొలి మ్యాచ్తో పోలిస్తే ఇప్పుడు జట్టుగా రాణించగలిగాం. కొన్ని బంతులు అనుకున్నట్లుగా హిట్టింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రస్సెల్ బౌలింగ్ వేసేటప్పుడే ఈ పిచ్ ఫాస్ట్కు సహకరించదని అర్థమైంది. దీంతో స్లో బంతులతో అతడు ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అప్పటికప్పుడు పిచ్ పరిస్థితిపై విశ్లేషించడం అద్భుతం. ఓపెనర్గా సునీల్ నరైన్ డేంజరస్ బ్యాటర్. అతడి నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించిందే’’ అని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు.
వైశాక్ చాలా బాగా బౌలింగ్ వేశాడు: వెంకటేశ్ అయ్యర్
‘‘కీలకమైన మ్యాచ్లో ఫామ్ అందుకోవడం బాగుంది. వెన్ను నొప్పి కాస్త ఇబ్బంది పెట్టింది. అయితే, స్కాన్ చేసిన తర్వాతనే పరిస్థితిపై ఓ అంచనాకు వస్తా. సునీల్ నరైన్ అద్భుత ప్రారంభం ఇచ్చాడు. మ్యాచ్ విజయం సాధించడానికి అతడే ప్రధాన కారణం. ఒత్తిడి లేకుండా చేయడంతో మా పని సులువైంది. ఏ ప్లాట్ఫామ్ అయినా 100 శాతం ఆడేందుకు ప్రయత్నిస్తా. బెంగళూరు బౌలర్ వైశాక్ చాలా బాగా బంతులను సంధించాడు. స్లో బంతులతో ఇబ్బంది పెట్టాడు. మా బౌలర్లూ ఇలానే బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశారు’’ అని కోల్కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. బెంగళూరుపై వెంకటేశ్ 50 పరుగులు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు