Ranchi Test: రాంచీ టెస్టు.. బుమ్రాకు విశ్రాంతినిస్తారా?.. కేఎల్ వస్తే వెళ్లేది అతనేనా?
ఐదు టెస్టుల సిరీస్లో (IND vs ENG) ఇంగ్లాండ్పై భారత్ 2-1 ఆధిక్యంలోఉంది. నాలుగో టెస్టు రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులేంటి? కూర్పు ఎలా ఉండొచ్చు?
ఇంటర్నెట్ డెస్క్: తొలి టెస్టులో ఓడినా... రెండు, మూడు టెస్టుల్లో గెలిచి 2 - 1 ఆధిక్యంతో సిరీస్ను గెలుచుకునే పనిలో పడింది టీమ్ ఇండియా. ఈ క్రమంలో రాంచీలో ఈ నెల 23 నుంచి నాలుగో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జట్టు కూర్పుఎలా ఉండనుంది. ఎవరెవరు విశ్రాంతి తీసుకుంటారు, తుది జట్టులోకి కొత్తగా ఎవరొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం వర్క్ లోడ్, ఇంజూరీ మేనేజ్మెంట్.
బుమ్రా ఉంటాడా?
భారత జట్టు టెస్టు సిరీస్లో ఆధిక్యంలో ఉంది అంటే దానికి కారణం జస్ప్రీత్ బుమ్రా. విశాఖ టెస్టులో ఘనవిజయం అతని బౌలింగ్ వల్లనే అని చెప్పాలి. ఇక మూడో టెస్టులోనూ ఎక్కువ ఓవర్లే వేశాడు. ఈ సిరీస్లో మూడు టెస్టుల్లో దాదాపు 81 ఓవర్లు వేశాడు. మొత్తం 17 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతడే. దీంతో నాలుగో టెస్టుకు విశ్రాంతినిస్తారని సమాచారం. ఆఖరిదైన ఐదో టెస్టు పిచ్ (ధర్మశాల) పేసర్లకు అనుకూలంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో రాంచీ పోరులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వొచ్చని భోగట్టా. ఆ స్థానంలో జట్టులోకి ముకేశ్ కుమార్ వస్తాడు. ప్రస్తుతం రంజీల్లో బెంగాల్ జట్టుకు ఆడుతున్న అతను రాంచీ టెస్టు నాటికి జట్టులో చేరతాడట. ఒకవేళ రాంచీలోనే టీమ్ఇండియా సిరీస్ నెగ్గితే.. ఐదో మ్యాచ్లోనూ బుమ్రా ఆడకపోవచ్చు.
వేటు అతనిపైనేనా?
ఫిట్నెస్ కారణంగా మూడో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్కు బీసీసీఐ వైద్యబృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నాలుగో మ్యాచ్కు వచ్చేస్తాడు. అప్పుడు గత రెండు టెస్టుల్లోనూ విఫలమైన రజత్ పటీదార్ను తప్పించడం ఖాయం. రెండు టెస్టుల్లో కలిపి 46 పరుగులే చేశాడు. ఇంగ్లాండ్తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 10 బంతులు ఆడినా పరుగుల ఖాతా కూడా తెరవలేదు. యశస్వి డబుల్ సెంచరీ, గిల్, సర్ఫరాజ్ హాఫ్ సెంచరీలు చేసిన ఇదే పిచ్పై ఆడేందుకు పటీదార్ ఇబ్బంది పడటం గమనార్హం. దీంతో కేఎల్ రాకతో నాలుగో స్థానాన్ని పటీదార్ ఖాళీ చేయాల్సిందే.
జైస్వాల్ ఆడతాడా?
సిరీస్లో రెండు డబుల్ సెంచరీలతో దూకుడు మీదున్న కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా రాంచీ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాక వెన్ను నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి డబుల్ సెంచరీ చేశాడు. కానీ నాలుగో ఇన్నింగ్స్ ఫీల్డింగ్ సమయంలో అసౌకర్యంగా కనిపించాడు. దీంతో అతనికి విశ్రాంతినిచ్చి ధర్మశాల టెస్టుకల్లా ఫిట్గా ఉంచేలా మేనేజ్మెంట్ ప్రయత్నాల చేస్తోందని వార్తలొస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఓపెనర్గా దేవదత్ పడిక్కల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పటీదార్కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఓపెనర్గా పంపి ప్రయోగం చేయొచ్చు. లేదంటే గిల్ను పైకి ప్రమోట్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్