Ranchi Test: రాంచీ టెస్టు.. బుమ్రాకు విశ్రాంతినిస్తారా?.. కేఎల్ వస్తే వెళ్లేది అతనేనా?
ఐదు టెస్టుల సిరీస్లో (IND vs ENG) ఇంగ్లాండ్పై భారత్ 2-1 ఆధిక్యంలోఉంది. నాలుగో టెస్టు రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులేంటి? కూర్పు ఎలా ఉండొచ్చు?
ఇంటర్నెట్ డెస్క్: తొలి టెస్టులో ఓడినా... రెండు, మూడు టెస్టుల్లో గెలిచి 2 - 1 ఆధిక్యంతో సిరీస్ను గెలుచుకునే పనిలో పడింది టీమ్ ఇండియా. ఈ క్రమంలో రాంచీలో ఈ నెల 23 నుంచి నాలుగో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జట్టు కూర్పుఎలా ఉండనుంది. ఎవరెవరు విశ్రాంతి తీసుకుంటారు, తుది జట్టులోకి కొత్తగా ఎవరొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం వర్క్ లోడ్, ఇంజూరీ మేనేజ్మెంట్.
బుమ్రా ఉంటాడా?
భారత జట్టు టెస్టు సిరీస్లో ఆధిక్యంలో ఉంది అంటే దానికి కారణం జస్ప్రీత్ బుమ్రా. విశాఖ టెస్టులో ఘనవిజయం అతని బౌలింగ్ వల్లనే అని చెప్పాలి. ఇక మూడో టెస్టులోనూ ఎక్కువ ఓవర్లే వేశాడు. ఈ సిరీస్లో మూడు టెస్టుల్లో దాదాపు 81 ఓవర్లు వేశాడు. మొత్తం 17 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతడే. దీంతో నాలుగో టెస్టుకు విశ్రాంతినిస్తారని సమాచారం. ఆఖరిదైన ఐదో టెస్టు పిచ్ (ధర్మశాల) పేసర్లకు అనుకూలంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో రాంచీ పోరులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వొచ్చని భోగట్టా. ఆ స్థానంలో జట్టులోకి ముకేశ్ కుమార్ వస్తాడు. ప్రస్తుతం రంజీల్లో బెంగాల్ జట్టుకు ఆడుతున్న అతను రాంచీ టెస్టు నాటికి జట్టులో చేరతాడట. ఒకవేళ రాంచీలోనే టీమ్ఇండియా సిరీస్ నెగ్గితే.. ఐదో మ్యాచ్లోనూ బుమ్రా ఆడకపోవచ్చు.
వేటు అతనిపైనేనా?
ఫిట్నెస్ కారణంగా మూడో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్కు బీసీసీఐ వైద్యబృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నాలుగో మ్యాచ్కు వచ్చేస్తాడు. అప్పుడు గత రెండు టెస్టుల్లోనూ విఫలమైన రజత్ పటీదార్ను తప్పించడం ఖాయం. రెండు టెస్టుల్లో కలిపి 46 పరుగులే చేశాడు. ఇంగ్లాండ్తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 10 బంతులు ఆడినా పరుగుల ఖాతా కూడా తెరవలేదు. యశస్వి డబుల్ సెంచరీ, గిల్, సర్ఫరాజ్ హాఫ్ సెంచరీలు చేసిన ఇదే పిచ్పై ఆడేందుకు పటీదార్ ఇబ్బంది పడటం గమనార్హం. దీంతో కేఎల్ రాకతో నాలుగో స్థానాన్ని పటీదార్ ఖాళీ చేయాల్సిందే.
జైస్వాల్ ఆడతాడా?
సిరీస్లో రెండు డబుల్ సెంచరీలతో దూకుడు మీదున్న కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా రాంచీ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాక వెన్ను నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి డబుల్ సెంచరీ చేశాడు. కానీ నాలుగో ఇన్నింగ్స్ ఫీల్డింగ్ సమయంలో అసౌకర్యంగా కనిపించాడు. దీంతో అతనికి విశ్రాంతినిచ్చి ధర్మశాల టెస్టుకల్లా ఫిట్గా ఉంచేలా మేనేజ్మెంట్ ప్రయత్నాల చేస్తోందని వార్తలొస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఓపెనర్గా దేవదత్ పడిక్కల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పటీదార్కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఓపెనర్గా పంపి ప్రయోగం చేయొచ్చు. లేదంటే గిల్ను పైకి ప్రమోట్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్