Jasprit Bumrah: పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు.
టీ20 క్రికెట్ అంటే బ్యాట్స్మెన్ అనుకూల ఫార్మాట్. అందులోనూ ఐపీఎల్ (IPL) అంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక్కడ ఎలాంటి బౌలర్కైనా ఎకానమీని అదుపులో ఉంచడం కష్టమే. కానీ ఒక్క జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మాత్రం ఇందుకు మినహాయింపు. అతడి బౌలింగ్లో వికెట్లు కాపాడుకోవడమే గగనం. షాట్లు ఆడటం అంటే సవాలే.
గురువారం ఐపీఎల్లో ముంబయి (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య వాంఖడేలో మ్యాచ్. మొదట బెంగళూరు 196 పరుగులు చేసింది. అంత స్కోరును ముంబయి కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు జట్టులో డుప్లెసిస్, పటీదార్, దినేశ్ కార్తీక్.. ముంబయి టీంలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి ఇరు జట్లలో మిగతా బౌలర్లందరి గణాంకాలు దెబ్బతిన్నాయి. కనీసం రెండు ఓవర్లు వేసిన బౌలర్లలో ఒక్క శ్రేయస్ గోపాల్ (ముంబయి) మాత్రమే 8 ఎకానమీతో సరిపెట్టుకున్నాడు.
ముంబయి జట్టులో ఆకాశ్ మధ్వాల్ 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు (ఎకానమీ 14.25) సమర్పించుకుంటే.. కొయెట్జీ 4 ఓవర్లలో 42 పరుగులిచ్చుకున్నాడు. ఇక బెంగళూరు జట్టులో ఏ బౌలరూ 10కి తక్కువ ఎకానమీ నమోదు చేయలేదు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆకాశ్ దీప్ ఏకంగా 3.3 ఓవర్లలోనే 55 పరుగులు (ఎకానమీ 15.71) సమర్పించుకున్నాడు. సిరాజ్ (12.33), టాప్లీ (11.33)లకు కూడా బ్యాట్స్మెన్ బాదుడు తప్పలేదు. కానీ ఈ మ్యాచ్లో బుమ్రా గణాంకాలు చూస్తే షాకవ్వకుండా ఉండలేం. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఎకనామీ కేవలం 5.25. ఇలా పరుగుల వరద పారిన మ్యాచ్లో ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం బుమ్రాకే చెల్లింది. మిగతా బౌలర్ల బంతులకు అలవోకగా షాట్లు ఆడిన డుప్లెసిస్, పటీదార్, కార్తీక్.. బుమ్రా బౌలింగ్లో మాత్రం జాగ్రత్తగా ఆడారు. అలా కాదంటే వికెట్టే నిలవదు మరి.
కోహ్లీ సహా అయిదుగురిని పెవిలియన్ చేర్చాడు బుమ్రా. మిగతా బౌలర్లందరూ తేలిపోతే.. బుమ్రా ఒక్కడు ఇలా పొదుపుగా బౌలింగ్ చేయడం ఈ మ్యాచ్కే పరిమితం కాదు. ప్రతీ మ్యాచ్లో జరిగేది ఇదే. సన్రైజర్స్ జట్టు ముంబయిపై 277 పరుగులతో ఐపీఎల్ రికార్డు స్కోరు నమోదు చేసిన మ్యాచ్లో కూడా మిగతా బౌలర్లందరూ 12-17 మధ్య ఎకానమీ నమోదు చేస్తే.. బుమ్రా ఓవర్కు 9 పరుగుల చొప్పునే ఇచ్చాడు. అతడి స్థాయికి ఆ ఎకానమీ ఎక్కువే. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో కలిపితే బుమ్రా ఎకానమీ 5.95 మాత్రమే. అతను 11.9 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లున్నారు కానీ.. వాళ్లెవరూ ఎకానమీలో అతడికి దగ్గర్లో లేరు. ఎలాంటి విధ్వంసకర బ్యాటర్లయినా ముంబయితో మ్యాచ్ అంటే బుమ్రాను గౌరవించాల్సిందే. అతడి బంతులను ఆచితూచి ఆడాల్సిందే. ఐపీఎల్ మొత్తంలో కూడా అతడి ఎకానమీ 7.33 మాత్రమే కావడం విశేషం. లీగ్లో అతను ముంబయి తరఫున 125 మ్యాచ్లు ఆడి 22.56 సగటుతో 155 వికెట్లు పడగొట్టాడు.
కప్పు ముంగిట జోష్
ఐపీఎల్లో అయినా.. అంతర్జాతీయ క్రికెట్లో అయినా బుమ్రా పూర్తి ఫిట్గా ఉంటే ఇలాగే అద్భుతాలు చేస్తాడు. అయితే ఫాస్ట్ బౌలర్లందరిలాగే అతడికీ తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. గత రెండేళ్లలో అతను మైదానంలో కంటే బయటే ఎక్కువ సమయం ఉన్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముంగిట ఫిట్నెస్ సాధించడానికి ముందు ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. బుమ్రా అందుబాటులో లేకపోవడం 2022 టీ20 ప్రపంచకప్లో భారత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి టీ20 ప్రపంచకప్ ముంగిట బుమ్రా పూర్తి ఫిట్నెస్తో కనిపిస్తుండటం, మంచి లయతో బౌలింగ్ చేస్తుండటం టీమ్ఇండియాకు ఉత్సాహాన్నిచ్చే విషయమే.
ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్ చూస్తున్న అభిమానులకు.. ప్రపంచకప్పులో అతను అద్భుతాలు చేస్తాడనే ఆశలు కలుగుతున్నాయి. బుమ్రా ఫిట్గా ఉన్నాడంటే చాలు ఎప్పుడైనా ఉత్తమ ప్రదర్శనే చేస్తాడు. అయితే అతణ్ని ఎప్పుడూ గాయాల భయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఐపీఎల్లో గాయం బారిన పడకుండా జాగ్రత్త వహించడం ప్రధానం. బీసీసీఐ కూడా ఈ విషయంలో అతణ్ని పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఇదే ఫిట్నెస్, ఫామ్ను బుమ్రా టీ20 ప్రపంచకప్లోనూ కొనసాగిస్తే భారత్కు ఇక తిరుగుండదు.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్