Jasprit Bumrah: పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు.
టీ20 క్రికెట్ అంటే బ్యాట్స్మెన్ అనుకూల ఫార్మాట్. అందులోనూ ఐపీఎల్ (IPL) అంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక్కడ ఎలాంటి బౌలర్కైనా ఎకానమీని అదుపులో ఉంచడం కష్టమే. కానీ ఒక్క జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మాత్రం ఇందుకు మినహాయింపు. అతడి బౌలింగ్లో వికెట్లు కాపాడుకోవడమే గగనం. షాట్లు ఆడటం అంటే సవాలే.
గురువారం ఐపీఎల్లో ముంబయి (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య వాంఖడేలో మ్యాచ్. మొదట బెంగళూరు 196 పరుగులు చేసింది. అంత స్కోరును ముంబయి కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు జట్టులో డుప్లెసిస్, పటీదార్, దినేశ్ కార్తీక్.. ముంబయి టీంలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి ఇరు జట్లలో మిగతా బౌలర్లందరి గణాంకాలు దెబ్బతిన్నాయి. కనీసం రెండు ఓవర్లు వేసిన బౌలర్లలో ఒక్క శ్రేయస్ గోపాల్ (ముంబయి) మాత్రమే 8 ఎకానమీతో సరిపెట్టుకున్నాడు.
ముంబయి జట్టులో ఆకాశ్ మధ్వాల్ 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు (ఎకానమీ 14.25) సమర్పించుకుంటే.. కొయెట్జీ 4 ఓవర్లలో 42 పరుగులిచ్చుకున్నాడు. ఇక బెంగళూరు జట్టులో ఏ బౌలరూ 10కి తక్కువ ఎకానమీ నమోదు చేయలేదు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆకాశ్ దీప్ ఏకంగా 3.3 ఓవర్లలోనే 55 పరుగులు (ఎకానమీ 15.71) సమర్పించుకున్నాడు. సిరాజ్ (12.33), టాప్లీ (11.33)లకు కూడా బ్యాట్స్మెన్ బాదుడు తప్పలేదు. కానీ ఈ మ్యాచ్లో బుమ్రా గణాంకాలు చూస్తే షాకవ్వకుండా ఉండలేం. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఎకనామీ కేవలం 5.25. ఇలా పరుగుల వరద పారిన మ్యాచ్లో ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం బుమ్రాకే చెల్లింది. మిగతా బౌలర్ల బంతులకు అలవోకగా షాట్లు ఆడిన డుప్లెసిస్, పటీదార్, కార్తీక్.. బుమ్రా బౌలింగ్లో మాత్రం జాగ్రత్తగా ఆడారు. అలా కాదంటే వికెట్టే నిలవదు మరి.
కోహ్లీ సహా అయిదుగురిని పెవిలియన్ చేర్చాడు బుమ్రా. మిగతా బౌలర్లందరూ తేలిపోతే.. బుమ్రా ఒక్కడు ఇలా పొదుపుగా బౌలింగ్ చేయడం ఈ మ్యాచ్కే పరిమితం కాదు. ప్రతీ మ్యాచ్లో జరిగేది ఇదే. సన్రైజర్స్ జట్టు ముంబయిపై 277 పరుగులతో ఐపీఎల్ రికార్డు స్కోరు నమోదు చేసిన మ్యాచ్లో కూడా మిగతా బౌలర్లందరూ 12-17 మధ్య ఎకానమీ నమోదు చేస్తే.. బుమ్రా ఓవర్కు 9 పరుగుల చొప్పునే ఇచ్చాడు. అతడి స్థాయికి ఆ ఎకానమీ ఎక్కువే. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో కలిపితే బుమ్రా ఎకానమీ 5.95 మాత్రమే. అతను 11.9 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లున్నారు కానీ.. వాళ్లెవరూ ఎకానమీలో అతడికి దగ్గర్లో లేరు. ఎలాంటి విధ్వంసకర బ్యాటర్లయినా ముంబయితో మ్యాచ్ అంటే బుమ్రాను గౌరవించాల్సిందే. అతడి బంతులను ఆచితూచి ఆడాల్సిందే. ఐపీఎల్ మొత్తంలో కూడా అతడి ఎకానమీ 7.33 మాత్రమే కావడం విశేషం. లీగ్లో అతను ముంబయి తరఫున 125 మ్యాచ్లు ఆడి 22.56 సగటుతో 155 వికెట్లు పడగొట్టాడు.
కప్పు ముంగిట జోష్
ఐపీఎల్లో అయినా.. అంతర్జాతీయ క్రికెట్లో అయినా బుమ్రా పూర్తి ఫిట్గా ఉంటే ఇలాగే అద్భుతాలు చేస్తాడు. అయితే ఫాస్ట్ బౌలర్లందరిలాగే అతడికీ తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. గత రెండేళ్లలో అతను మైదానంలో కంటే బయటే ఎక్కువ సమయం ఉన్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముంగిట ఫిట్నెస్ సాధించడానికి ముందు ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. బుమ్రా అందుబాటులో లేకపోవడం 2022 టీ20 ప్రపంచకప్లో భారత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి టీ20 ప్రపంచకప్ ముంగిట బుమ్రా పూర్తి ఫిట్నెస్తో కనిపిస్తుండటం, మంచి లయతో బౌలింగ్ చేస్తుండటం టీమ్ఇండియాకు ఉత్సాహాన్నిచ్చే విషయమే.
ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్ చూస్తున్న అభిమానులకు.. ప్రపంచకప్పులో అతను అద్భుతాలు చేస్తాడనే ఆశలు కలుగుతున్నాయి. బుమ్రా ఫిట్గా ఉన్నాడంటే చాలు ఎప్పుడైనా ఉత్తమ ప్రదర్శనే చేస్తాడు. అయితే అతణ్ని ఎప్పుడూ గాయాల భయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఐపీఎల్లో గాయం బారిన పడకుండా జాగ్రత్త వహించడం ప్రధానం. బీసీసీఐ కూడా ఈ విషయంలో అతణ్ని పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఇదే ఫిట్నెస్, ఫామ్ను బుమ్రా టీ20 ప్రపంచకప్లోనూ కొనసాగిస్తే భారత్కు ఇక తిరుగుండదు.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం