Jasprit Bumrah: పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్పై నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చిన ముంబయి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లను పడగొట్టాడు. అతడు వేసిన తొలి ఓవర్లోనే సామ్ కరన్, రిలీ రొసోవ్ను ఔట్ చేశాడు. ఈ సీజన్లో అతడు తొలిసారి పవర్ ప్లేలో రెండు ఓవర్లు వేయడం గమనార్హం. బుమ్రాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ పవర్ ప్లేలో తన పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘మేం ముందుగా అనుకున్నదానికంటే చాలా ఉత్కంఠగా మ్యాచ్ ముగిసింది. పంజాబ్ యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి. బౌలర్లకు చాలా కఠినమైన ఫార్మాట్. టైమ్ నిబంధనలతోపాటు ఇంపాక్ట్ రూల్ కూడా బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించడానికి కారణం. లోతైన బ్యాటింగ్ ఉండటం వల్ల బౌలర్లు వైవిధ్యంగా ప్రయత్నించాల్సి ఉంది. మ్యాచ్ ఆరంభంలో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. పవర్ ప్లేలో కనీసం రెండు ఓవర్లు వేస్తేనే ఫలితం రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. డెత్ ఓవర్లపై మా బౌలర్లకు ఎక్కువగా సూచనలు చేయను. ఆ సమయంలో వారే ఛాన్స్ తీసుకొనేందుకు వదిలేయాలి’’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు.
అశుతోష్ సూపర్: గెరాల్డ్ కోయిట్జీ
‘‘బోర్డుపై మంచి స్కోరే ఉంచాం. బౌలింగ్లో శుభారంభమే లభించింది. త్వరగా మ్యాచ్ను ముగిస్తామని భావించా. క్రికెట్ ఎలాంటి ఫన్నీ గేమ్ అనేది మరోసారి రుజువైంది. పంజాబ్ మిడిల్ఆర్డర్ చాలా బాగా ఆడింది. అశుతోష్ను ఔట్ చేయడంతోనే మేం మ్యాచ్పై తిరిగి పట్టు బిగించాం. చివరి ఓవర్లలో సరైన వ్యూహంతో బంతులేశాం. ఫలితం రాబట్టగలిగాం. నవతరం క్రికెటర్గా ఎలాంటి పాత్రనైనా పోషించడానికి సిద్ధంగా ఉండాలి. గతంలో నేను ఎక్కువగా పవర్ప్లేలో బౌలింగ్ చేయలేదు. ఈ సారి మాత్రం దానిని పూర్తిగా ఆస్వాదించా. మిడిల్, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా ఇష్టం. కీలక సమయంలో వికెట్లు తీయడం బాగుంటుంది’’ అని ముంబయి బౌలర్ కోయిట్జీ తెలిపాడు.
కొద్దిలో మ్యాచ్ను చేజార్చుకున్నాం: కరన్
‘‘ప్రస్తుత సీజన్లో మేం మరోసారి స్వల్పతేడాతో మ్యాచ్ను కోల్పోయాం. యువ ఆటగాళ్లు అశుతోష్, శశాంక్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్లను చూశాం. ఇలా చివర్లో మ్యాచ్ను చేజార్చుకోవడమే చాలా బాధగా ఉంటుంది. ఆరంభంలో వికెట్లను కోల్పోవడమే మా ఓటమికి ప్రధాన కారణం. అశుతోష్, శశాంక్ మాలో ఆత్మవిశ్వాసం నింపారు. పేస్ బౌలింగ్లోనూ భారీ షాట్లు కొట్టడం అభినందనీయం. మాకు మంచి రోజులు వస్తాయనే నమ్మకం ఉంది. తదుపరి మ్యాచుల్లో విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులోకి వస్తాం’’ అని పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు