Jasprit Bumrah: ఇలాంటి పిచ్లపై ఆడాలంటే... ఇంకా చురుగ్గా ఉండాల్సిందే: జస్ప్రీత్ బుమ్రా
కొత్తగా తయారు చేసిన పిచ్ను త్వరగా అర్థం చేసుకుంటేనే మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుందని భారత పేసర్ బుమ్రా వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ మైదానం పిచ్పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ భారత పేస్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్ పరిస్థితులను ఎంత త్వరగా అర్థం చేసుకుంటే... అంత మంచిదని పేర్కొన్నాడు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా మూడు ఓవర్లలో కేవలం 6 పరుగులను మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను తీశాడు. అతడినే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
‘‘భారత్ నుంచి అమెరికా వచ్చి క్రికెట్ ఆడటం భలేగుంది. పిచ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా ఉండేది. ఇప్పుడు బంతి రెండువైపులా స్వింగ్ అవుతోంది. బౌలర్లకు సహకారం లభిస్తున్న వేళ నేనెలాంటి కంప్లైట్ చేయను. టీ20 ఫార్మాట్లో ఎంత త్వరగా పరిస్థితులను అలవాటు చేసుకోగలిగితే అంత మంచిది. అందుకే, గేమ్లో ఇంకాస్త చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లాన్కు అనుగుణంగా బంతులేయడం అత్యంత కీలకం. ఇలాంటి పిచ్లపై ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి’’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు.
పిచ్పై బీసీసీఐ ఆందోళన!
అనూహ్యంగా బౌన్స్ అవుతూ.. బ్యాటర్లను ఇబ్బందికి గురి చేసిన పిచ్ తీరుపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు స్వల్ప గాయం కావడం వల్ల హాఫ్ సెంచరీ తర్వాత మైదానాన్ని వీడాడు. అయితే, అదేమీ తీవ్రమైన గాయం కాదని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించింది. కానీ, ఇలాంటి ప్రమాదకరమైన పిచ్పై టీ20 మ్యాచ్ ఆడటం చాలా కష్టమని ఐసీసీ వద్ద బీసీసీఐ ప్రస్తావించినట్లు సమాచారం. ఇప్పటి వరకైతే అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ‘‘డ్రాప్ ఇన్ పిచ్ చాలా కొత్తగా ఉంది. కొంత పచ్చిక ఉన్నప్పటికీ.. అక్కడక్కడా క్రాక్స్ ఉన్నాయి. సీమ్కు అనుకూలంగానే ఉంది. ఇలా కొత్తగా ఏదైనా ట్రాక్ను సిద్ధం చేసినప్పుడు ముందుగా టెస్టింగ్ కోసం ఇతర మ్యాచ్లను నిర్వహించాలి. బేటా వెర్షన్లో యాప్ను తీసుకొచ్చినట్లు ఉండాలి. కానీ, టీ20 క్రికెట్ కోసం ఈ పిచ్ తయారు చేసినట్లు అనిపించడం లేదు. దాంతోపాటు మిగతా నాలుగు ట్రాక్లూ ఇలాంటివే’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే స్టేడియంలో జూన్ 9న పాకిస్థాన్తో భారత్ తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి