T20 WC 2024: వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం భారత్ ప్రకటించిన జట్టుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఎంపిక వెనుక ఒత్తిడి కీలక పాత్ర పోషించిందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఐపీఎల్లో విఫలమైనప్పటికీ అతడిని తీసుకోవడం సరైంది కాదనే సూచనలు వచ్చాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు పాండ్యను ఎంపిక చేయడం అసలు ఇష్టం లేదనే కథనాలు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేశాయి. ఈ క్రమంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా స్పందించారు.
‘‘సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టు సమతూకంగా ఉంది. సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ఫామ్పైనే దృష్టి పెట్టలేదు. విదేశాల్లో సదరు ఆటగాడికి ఉన్న అనుభవంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నా. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు వినిపించాయి. కఠిన పిచ్లు ఉండే విండీస్ - యూఎస్ఏలో పొట్టి కప్ జరగనుంది. అనుభవంతోపాటు యువ క్రికెటర్లను ఎంపిక చేశాం. ఇందులో బీసీసీఐ కార్యదర్శిగా నా పాత్ర కేవలం సమాచారం ఇవ్వడం వరకే ఉంటుంది. కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకే జట్టును ఎంపిక చేస్తాం’’ అని జైషా స్పష్టం చేశారు.
అప్పుడు అగార్కర్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించిన తర్వాత కొద్ది రోజులకు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హార్దిక్ ఎంపికపై వచ్చిన ప్రశ్నలకు అగార్కర్ స్పందిస్తూ.. ‘‘పేస్ ఆల్రౌండర్ విభాగంలో ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో పాండ్యను ఎంపిక చేయక తప్పలేదు. శివమ్ దూబె కూడా జట్టులో ఉన్నాడు. అతడికి విదేశాల్లో పెద్దగా అనుభవం లేదు’’ అని వెల్లడించాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి జట్టును నడిపిస్తున్న హార్దిక్ పాండ్య ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో గొప్ప ప్రదర్శనేమీ చేయలేకపోతున్నాడు. మరోవైపు పాండ్యను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అన్ని మ్యాచుల్లోనూ ఆడిస్తారనే గ్యారంటీ లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే