‘భారత్లో ధోనీ క్రేజ్ని చూసి ఆశ్చర్యపోయా.. మా స్టేడియంలోనూ 98 శాతం ఆ జెర్సీలే’
భారత్లో ధోనీ (MS Dhoni)కి ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయానని లఖ్నవూ సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఈసారి చెన్నై సూపర్కింగ్స్ ఎక్కడ మ్యాచ్లు ఆడినా ఆ స్టేడియాలు సింహభాగం సీఎస్కే అభిమానులతో నిండిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni). అతడి ఆట చూడటానికే ఎంతోమంది స్టేడియాలకు వస్తారనడంలో సందేహం లేదు. ధోనీ కూడా ఈసారి బ్యాటింగ్లో మునపటిలా మెరుపులు మెరిపించాడు. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. అయితే, కీలక దశలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయి త్రుటిలో ప్లేఆఫ్స్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఇక.. భారత్లో ధోనీకి ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయానని లఖ్నవూ సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ (Justin Langer) అన్నాడు. ఐపీఎల్ కోసం గత రెండు, మూడు నెలలు భారత్లోనే ఉన్న లాంగర్ దేశవ్యాప్తంగా ధోనీకి అభిమానులు బ్రహ్మరథం పట్టిన తీరు చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ క్రీడా ఛానల్ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు.
‘‘ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ఇంతవరకు విన్నాను. ఈ సీజన్లో మేం (లఖ్నవూ) చెన్నై సూపర్కింగ్స్తో రెండుసార్లు ఆడాం. సీఎస్కే లఖ్నవూకు వచ్చినప్పుడు మా స్టేడియానికి (ఎకానా స్టేడియం) దాదాపు 50,000 మంది అభిమానులు వచ్చారు. నిజాయతీగా చెప్పాలంటే అందులో 48,000 మంది ధోనీ జెర్సీ నంబర్ 7 ధరించినవారే ఉన్నారు. దీన్ని నేను నమ్మలేకపోయాను. ఆపై మేము చెన్నైకి వెళ్లాము. అక్కడ 98 శాతం కాదు మొత్తం 100 శాతం ధోనీ అభిమానులే. భారత్లో ధోనీకి ఉన్న క్రేజ్ అసాధారణమైనది. ఇది నమ్మశక్యంగా లేదు’’ అని లఖ్నవూ కోచ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు