Archery world cup: జ్యోతి పసిడి మెరుపులు
అంతర్జాతీయ వేదికలపై ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ.. మరోసారి సత్తాచాటింది. ఆర్చరీ ప్రపంచకప్ రెండో అంచె పోటీల్లో కాంపౌండ్ మహిళల జట్టు స్వర్ణంతో పాటు మిక్స్డ్ టీమ్ రజతం సొంతం చేసుకుంది.
ఆర్చరీ ప్రపంచకప్
జట్టు విభాగంలో స్వర్ణం
మిక్స్డ్ టీమ్లో రజతం
యెచియాన్: అంతర్జాతీయ వేదికలపై ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ.. మరోసారి సత్తాచాటింది. ఆర్చరీ ప్రపంచకప్ రెండో అంచె పోటీల్లో కాంపౌండ్ మహిళల జట్టు స్వర్ణంతో పాటు మిక్స్డ్ టీమ్ రజతం సొంతం చేసుకుంది. శనివారం ఫైనల్లో జ్యోతి, పర్ణీత్ కౌర్, అదితి స్వామితో కూడిన భారత మహిళల జట్టు 232-226 తేడాతో తుర్కియే (హజల్, సుజర్, యువ)పై గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న భారత అమ్మాయిల జట్టుకు ఇది వరుసగా మూడో ప్రపంచ కప్ పసిడి కావడం విశేషం. 57-56తో తొలి రౌండ్ను మొదలెట్టిన రెండో సీడ్ భారత త్రయం ఆ తర్వాత ఏ దశలోనూ ఏకాగ్రత కోల్పోలేదు. రెండో రౌండ్లో 59-56తో మరింత మెరుగ్గా రాణించింది. మూడో రౌండ్లో 58-58తో స్కోరు సమమైనా అప్పటికే ఓవరాల్గా భారత్ నాలుగు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరు కొనసాగించి చివరి రౌండ్లో 58-56తో విజయాన్ని అందుకుంది. నిరుడు ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి వరుసగా ఆరు టోర్నీల్లోనూ జ్యోతి, పర్ణీత్, అదితి కలిసి టీమ్ స్వర్ణాలు గెలిచారు. మిక్స్డ్ టీమ్ తుదిపోరులో జ్యోతి-ప్రియాన్ష్ జోడీ 153-155తో ఒలీవియా-సలివాన్ (అమెరికా) చేతిలో పోరాడి ఓడింది. తొలి రౌండ్లో 39-37తో ఆధిక్యం సాధించిన భారత ద్వయం ఆ తర్వాత తడబడింది. వరుసగా 37-39, 39-40, 38-39తో పరాజయం పాలైంది. మరోవైపు కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక పోరులో ప్రథమేశ్ 148-148 (9-10)తో షూటాఫ్లో ప్రపంచ నంబర్వన్ మైక్ షులోసర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
గిల్ స్వదేశానికి అర్ధంతరంగా తిరిగి రావడానికి కారణమేంటనే దానికి నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందన్న వార్తలూ వచ్చాయి. -
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
పాకిస్థాన్ ఓటమికి కారణాలను ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వెల్లడించాడు. అభిమానులను తీవ్ర నిరాశపరిచినట్లు అంగీకరించాడు. -
ఛేజింగ్ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్ సీక్రెట్ వెల్లడించిన అక్రమ్
విరాట్ కోహ్లీ ఛేజింగ్ల్లో అనుసరించే వ్యూహాన్ని ఇటీవల పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ వెల్లడించాడు. -
అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం
తొలిసారి మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో సరైన సదుపాయాలు మాత్రం కానరావడం లేదు. ప్రాక్టీస్ చేసుకోవడానికి, జిమ్ చేసుకోవడానికి భారత ఆటగాళ్లు ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ను రద్దు చేసిన పరిస్థితి తలెత్తింది. -
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే
టీ20 ప్రపంచ కప్లో టాప్-8 టీమ్లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. -
నేపాల్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. సూపర్-8కి అర్హత
తన చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ సూపర్-8కి అర్హత సాధించింది. -
గంభీరే టీమ్ఇండియా కోచ్!
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు! భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అతని ఎంపిక ఖాయమైందని తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. -
గండాలు దాటి.. గట్టెక్కిన ఇంగ్లాండ్
వర్షం ఆగాలి.. మ్యాచ్ సాగాలి.. ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులూ కోరుకున్నది ఇదే. ఒకవేళ వాన కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దయితే ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టేదే. -
స్మృతి శతకం
భారత మహిళల క్రికెట్ జట్టుకు అదిరే విజయం! స్మృతి మంధాన శతకం..బంతితో శోభన, దీప్తి విజృంభణతో హర్మన్ప్రీత్ బృందం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. -
ఆసీస్ అజేయంగా..
7 ఓవర్లలో 89 పరుగులు! ఇదీ స్కాట్లాండ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయ సమీకరణం. చిన్నజట్టే అయినా స్కాట్లాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ.. బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పొట్టి కప్లో మరో సంచలనం తప్పదేమో అనిపించింది. -
ఇటలీ శుభారంభం
యూరో కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- బి మ్యాచ్లో ఆ జట్టు 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది. -
భజన్కు పారిస్ కోటా
భారత యువ ఆర్చర్ భజన్ కౌర్ పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని గెలిచింది. క్వాలిఫయర్స్ టోర్నీలో మహిళల రికర్వ్ సింగిల్స్లో స్వర్ణం సాధించిన ఆమె.. ఈ క్రమంలో దేశానికి కోటా స్థానాన్ని అందించింది. -
సంక్షిప్తవార్తలు(4)
టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గోహెయిన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. చెక్ రిపబ్లిక్లో జరిగిన గ్రాండ్ ప్రి ఉస్తి నాద్ లేబం టోర్నీలో ఆమె రజతం సొంతం చేసుకుంది. -
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్
టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. అతడికి బ్యాటింగ్ కోచ్ మద్దతుగా నిలిచాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నలకు ఘన స్వాగతం
-
జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
-
క్రోమ్లో కొత్త సదుపాయం.. ఆండ్రాయిడ్ యూజర్లు ఇక వెబ్ పేజీలు వినొచ్చు
-
కరెంటు షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!
-
డిలీట్ చేసిన మెసేజ్లు భార్య కంటికి.. యాపిల్పై రూ.53 కోట్లకు దావా
-
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత