Archery World Cup: పసిడి పోరుకు జ్యోతి ద్వయం
కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాల కోసం పోటీలో నిలిచింది.
ఆర్చరీ ప్రపంచకప్
యెచియాన్: కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాల కోసం పోటీలో నిలిచింది. ఆర్చరీ ప్రపంచకప్ రెండో అంచె పోటీల్లో ఇప్పటికే మహిళల టీమ్లో తుదిపోరు చేరిన ఆమె.. తాజాగా మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ ఫైనల్ చేరింది. శుక్రవారం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సెమీస్లో జ్యోతి- ప్రియాన్ష్ జంట 158-157 తేడాతో సెంగ్యెన్- జేవాన్ (దక్షిణా కొరియా)పై పోరాడి గెలిచింది. శనివారం స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్వన్ ఒలీవియా- సాయర్ (అమెరికా)తో రెండో ర్యాంకర్ భారత్ జోడీ పోటీపడుతుంది. మరోవైపు మహిళల రికర్వ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ దీపిక సెమీస్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్లో ఆమె 6-4తో గోకిర్ (టర్కీ)పై నెగ్గింది. రికర్వ్ విభాగంలో పతక వేటలో మిగిలింది దీపిక మాత్రమే. భజన్ కౌర్ తొలి రౌండ్లో, అంకిత రెండో రౌండ్లో ఓడిపోయారు. పురుషుల వ్యక్తిగత రికర్వ్లో తరుణ్దీప్ రాయ్, మృనాల్ చౌహాన్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్ జాదవ్ నిష్క్రమించారు. దీపిక- తరుణ్దీప్ జోడీ మిక్స్డ్ టీమ్ క్వార్టర్స్లో పరాజయం పాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గండాలు దాటి.. గట్టెక్కిన ఇంగ్లాండ్
వర్షం ఆగాలి.. మ్యాచ్ సాగాలి.. ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులూ కోరుకున్నది ఇదే. ఒకవేళ వాన కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దయితే ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టేదే. -
స్మృతి శతకం
భారత మహిళల క్రికెట్ జట్టుకు అదిరే విజయం! స్మృతి మంధాన శతకం..బంతితో శోభన, దీప్తి విజృంభణతో హర్మన్ప్రీత్ బృందం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. -
ఆసీస్ అజేయంగా..
7 ఓవర్లలో 89 పరుగులు! ఇదీ స్కాట్లాండ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయ సమీకరణం. చిన్నజట్టే అయినా స్కాట్లాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ.. బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పొట్టి కప్లో మరో సంచలనం తప్పదేమో అనిపించింది. -
గంభీరే టీమ్ఇండియా కోచ్!
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు! భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అతని ఎంపిక ఖాయమైందని తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. -
ఇటలీ శుభారంభం
యూరో కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- బి మ్యాచ్లో ఆ జట్టు 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది. -
భజన్కు పారిస్ కోటా
భారత యువ ఆర్చర్ భజన్ కౌర్ పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని గెలిచింది. క్వాలిఫయర్స్ టోర్నీలో మహిళల రికర్వ్ సింగిల్స్లో స్వర్ణం సాధించిన ఆమె.. ఈ క్రమంలో దేశానికి కోటా స్థానాన్ని అందించింది. -
సంక్షిప్తవార్తలు(4)
టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గోహెయిన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. చెక్ రిపబ్లిక్లో జరిగిన గ్రాండ్ ప్రి ఉస్తి నాద్ లేబం టోర్నీలో ఆమె రజతం సొంతం చేసుకుంది. -
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్
టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. అతడికి బ్యాటింగ్ కోచ్ మద్దతుగా నిలిచాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
-
‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
‘కర్మ’ఫలం ఇది.. వైకాపాను ఉద్దేశించి పోస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ!
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్