Kane Williamson: ‘పిచ్ మార్పు’ వివాదం.. కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు
పిచ్పై వస్తున్న విమర్శలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొట్టి పడేశాడు. వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) తొలి సెమీస్ ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) తొలి సెమీస్ సందర్భంగా చివరి నిమిషంలో పిచ్ను మార్చినట్లు బీసీసీఐపై (BCCI) మీడియా వేదికగా ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఇప్పటికే ఐసీసీ వివరణ ఇచ్చింది. తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా దీనిపై స్పందించాడు. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగానే భారత్-కివీస్ తొలి సెమీస్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ ‘పిచ్ వివాదం’పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘పిచ్ విషయంలో మాకెలాంటి ఇబ్బంది లేదు. ఈ పిచ్ మ్యాచ్ల కోసం వినియోగించినట్లు ఉంది. అయినా సరే చాలా బాగుంది. ఇరు జట్లకూ అనుకూలంగానే వ్యవహరించింది. తొలి అర్ధభాగంలో టీమ్ఇండియా బ్యాటర్లు దూకుడుగా పరుగులు రాబట్టారు. పరిస్థితులకు తగ్గట్టుగా వారు ఆటతీరును మార్చుకున్నారనిపిస్తోంది. అయితే, నాకౌట్ దశలో ఇలా ఇంటిముఖం పట్టడం బాధగా ఉంది. గత ఏడు వారాలుగా అద్భుతమైన ప్రయాణం సాగించాం. చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి. అంతేకాకుండా నాణ్యమైన జట్టు చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా అత్యుత్తమంగా కనిపిస్తోంది.
ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తూ భారత్ టైటిల్ కోసం సిద్ధమైంది. గత ఓటముల నుంచి నేర్చుకుని ముందుకు సాగడం ఎంతైనా అవసరం. ఇప్పుడు టీమ్ఇండియా అదే చేస్తోంది. ఒక్క మ్యాచ్లోనూ ఓటమి లేకుండా దూసుకుపోతోంది. అప్రతిహతంగా సెమీస్కు చేరిన ఆ జట్టును ఓడించడం సవాల్తో కూడుకున్నదే. అయినా, మా ఆటగాళ్లు చివరి వరకు శ్రమించారు. వరుసగా విజయాలు సాధించిన భారత్ ఫైనల్లోనూ ఇదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు’’ అని కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్ 397/4 స్కోరు చేయగా.. అనంతరం న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు