Cricket News: కేన్ దంపతులకు మూడో సంతానం.. పంత్ పునరాగమనంపై సన్నీ కీలక కామెంట్లు
ఇంటర్నెట్ డెస్క్: మూడోసారి తండ్రైన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson).. ఐర్లాండ్-అఫ్గాన్ టెస్టు వేదికలో మార్పు.. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న రిషభ్ పంత్ పునరాగమనంపై భారత క్రికెట్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు.. ఇలాంటి క్రికెట్ విశేషాలు..
ఆడబిడ్డకు జన్మనిచ్చిన కేన్ విలియమ్సన్ సతీమణి
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, అతడి సతీమణి సారా రహీమ్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. తాజాగా తన చిన్నారిని ఎత్తుకొని ఉన్న ఫొటోను కేన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ దంపతులకు ఇంతకుముందు ఇద్దరు పిల్లలు (మూడేళ్ల కుమార్తె, ఒకటిన్నరేళ్ల కుమారుడు) ఉన్నారు. ‘‘ప్రపంచంలోనే అందమైన చిన్నారికి స్వాగతం. సురక్షితమైన రాక కోసం ఎదురుచూశాం. మున్ముందు ప్రయాణం అద్భుతంగా ఉండనుంది’’ అని కేన్ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు.
పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే.. కెప్టెన్సీ ఇవ్వాలి: సునీల్ గవాస్కర్
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న రిషభ్ పంత్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. వచ్చే 22 నుంచి మొదలయ్యే 17వ సీజన్ ఐపీఎల్తో క్రికెట్లోకి పునరాగమనం చేస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి పాదాలు ఎలా కదులుతున్నాయనేది కీలకం. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించి వస్తే మాత్రమే దిల్లీ కెప్టెన్సీ అప్పగించాలి. గతంలో ఎలా ఆరోగ్యంగా ఉన్నాడో.. ఇప్పుడూ అలానే ఉండాలి. అప్పుడే మనల్ని ఎంటర్టైన్ చేయగలడు. బ్యాటింగ్లో ఫామ్లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించడం మంచి పరిణామం’’ అని సన్నీ వ్యాఖ్యానించాడు.
స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కోసం టెస్టు వేదిక మార్పు
అఫ్గానిస్థాన్ - ఐర్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. కానీ, అనూహ్య పరిణామంతో వేదిక మారడం గమనార్హం. అబుదాబీలో స్థానిక పాఠశాల స్పోర్ట్స్ పోటీల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య టెస్టు వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలుత జయేద్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగాల్సింది. చివరికి టోలరెన్స్ ఓవల్ మైదానం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. జయేద్ స్టేడియంలో 20వేల సీటింగ్ సామర్థ్యం కాగా.. టోలరెన్స్లో 12వేలు మాత్రమే. దీనిపై అబుదాబీ క్రికెట్, స్పోర్ట్స్ హబ్ సీఈవో వివరణ ఇచ్చారు. ‘మార్చి 1 నుంచి 3 వరకు స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఉంది. దీంతో అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరిపి వెంటనే వేదికను మార్చేశాం’’ అని మాట్ బుచర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం