T20 WorldCup: ప్రపంచకప్‌లో ఆ జట్లకు స్పాన్సర్‌గా నందిని మిల్క్‌..!

టీ20 ప్రపంచకప్‌ 2024 టోర్నీలో రెండు జట్లకు స్పాన్సర్‌షిప్‌ అందించేందుకు డెయిరీ ఉత్పత్తుల సంస్థ నందినీ సిద్ధమైంది. 

Published : 21 Apr 2024 18:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T20 Worldcup 2024) జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో రెండు జట్లకు డెయిరీ ఉత్పత్తుల సంస్థ నందిని (Nandini) స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. కర్ణాటక పాల సమాఖ్య (KMF) ఆధ్వర్యంలోని ఈ నందిని సంస్థ టీ20 వరల్డ్‌ కప్‌లో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ జట్లకు స్పాన్సర్‌షిప్‌ అందిచనుంది. శాసనసభ ఎన్నికల వేళ వార్తల్లో నిలిచిన ఈ బ్రాండ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ జట్లకు స్పాన్సర్‌ చేయడం ఇదే తొలిసారి.

‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌పై రోహిత్ కామెంట్లు.. దృష్టిసారించిన బీసీసీఐ

‘‘ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ జట్లకు స్పాన్సర్‌ చేయనున్నాం. ‘నందిని స్ల్పాష్‌’ పేరుతో అమెరికాలో ఎనర్జీ డ్రింక్‌లను తీసుకురావాలని చూస్తున్నాం. ఈ సమయంలో ప్రపంచకప్‌ స్పాన్సర్‌షిప్‌తో ప్రపంచవ్యాప్తంగా మా ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుంది. గ్లోబల్‌ బ్రాండ్‌గా మారేందుకు మాకు ఇదో అవకాశం’’ అని కేఎంఎఫ్‌ ఎండీ ఎం.కే. జగదీష్‌ అన్నారు. టీ20 ప్రపంచకప్‌ 2024 సిరీస్‌ జూన్‌ 1 నుంచి జూన్‌ 29వరకు జరగనుంది. యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ పొట్టికప్పు సిరీస్‌లో అత్యధికంగా 20 జట్లు తలపడుతున్నాయి. మొత్తం 9 వేదికల్లో 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని