T20 WorldCup: ప్రపంచకప్లో ఆ జట్లకు స్పాన్సర్గా నందిని మిల్క్..!
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో రెండు జట్లకు స్పాన్సర్షిప్ అందించేందుకు డెయిరీ ఉత్పత్తుల సంస్థ నందినీ సిద్ధమైంది.
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 (T20 Worldcup 2024) జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రెండు జట్లకు డెయిరీ ఉత్పత్తుల సంస్థ నందిని (Nandini) స్పాన్సర్గా వ్యవహరించనుంది. కర్ణాటక పాల సమాఖ్య (KMF) ఆధ్వర్యంలోని ఈ నందిని సంస్థ టీ20 వరల్డ్ కప్లో స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లకు స్పాన్సర్షిప్ అందిచనుంది. శాసనసభ ఎన్నికల వేళ వార్తల్లో నిలిచిన ఈ బ్రాండ్ అంతర్జాతీయ క్రికెట్ జట్లకు స్పాన్సర్ చేయడం ఇదే తొలిసారి.
‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్పై రోహిత్ కామెంట్లు.. దృష్టిసారించిన బీసీసీఐ
‘‘ప్రపంచకప్లో స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లకు స్పాన్సర్ చేయనున్నాం. ‘నందిని స్ల్పాష్’ పేరుతో అమెరికాలో ఎనర్జీ డ్రింక్లను తీసుకురావాలని చూస్తున్నాం. ఈ సమయంలో ప్రపంచకప్ స్పాన్సర్షిప్తో ప్రపంచవ్యాప్తంగా మా ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుంది. గ్లోబల్ బ్రాండ్గా మారేందుకు మాకు ఇదో అవకాశం’’ అని కేఎంఎఫ్ ఎండీ ఎం.కే. జగదీష్ అన్నారు. టీ20 ప్రపంచకప్ 2024 సిరీస్ జూన్ 1 నుంచి జూన్ 29వరకు జరగనుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ పొట్టికప్పు సిరీస్లో అత్యధికంగా 20 జట్లు తలపడుతున్నాయి. మొత్తం 9 వేదికల్లో 55 మ్యాచ్లు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?