Dinesh karthik: టీ20 ప్రపంచకప్‌ వ్యాఖ్యాతగా కార్తీక్‌

టీ20 ప్రపంచకప్‌ వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ప్రకటించింది.

Published : 25 May 2024 03:39 IST

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ప్రకటించింది. గావస్కర్, రవిశాస్త్రి, నాసిర్‌ హుస్సేన్, ఇయాన్‌ స్మిత్, హర్ష భోగ్లే, ఇయాన్‌ బిషప్‌ వంటి దిగ్గజాలు తమ కామెంట్రీతో అభిమానులను అలరించనున్నారు. ఐపీఎల్‌ నుంచి బెంగళూరు నిష్క్రమణతో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైరైన దినేశ్‌ కార్తీక్‌ ఈ జాబితాలో ఉన్నాడు. రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్, రమీజ్‌ రజా, ఇయాన్‌ మోర్గాన్, టామ్‌ మూడీ, వసీమ్‌ అక్రమ్, స్టీవ్‌ స్మిత్, ఆరోన్‌ ఫించ్, లిసా స్థలేకర్‌ల విశ్లేషణలనూ చూడవచ్చు. డేల్‌ స్టెయిన్, గ్రేమ్‌ స్మిత్, మైకెల్‌ అథర్టన్, వకార్‌ యూనిస్, సైమన్‌ డౌల్, పొలాక్, డానీ మారిసన్, అలన్‌ విల్కిన్స్, ఎంబంగ్వా తదితరులు కూడా తమ వ్యాఖ్యానంతో టోర్నీని రక్తికట్టించనున్నారు. 28 రోజుల పాటు జరిగే టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2న ఆరంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని