Hardik Pandya: బుమ్రా ఎక్కడ? తొలి ఓవర్ ఎందుకు వేయలేదు? హార్దిక్ వ్యూహాలపై మాజీల ఆశ్చర్యం!
కెప్టెన్గా తొలిసారి ముంబయిని నడిపిస్తున్న హార్దిక్ పాండ్య వ్యూహాలు గొప్పగా లేవనేది ఆ జట్టు అభిమానుల అభిప్రాయం. గుజరాత్తో మ్యాచ్లో లోటుపాట్లతో ఓటమి పాలైందని విమర్శలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబయి ఐపీఎల్ 17వ సీజన్ను ఓటమితో ప్రారంభించింది. చివరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. దీంతో హార్దిక్ పాండ్య నిర్ణయాలు, వ్యూహాలపై నెట్టింట విమర్శలు రేగాయి. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (43), డేవాల్డ్ బ్రెవిస్ (46), తిలక్ వర్మ (25) కీలక ఇన్నింగ్స్లు ఆడినా విజయం మాత్రం దక్కలేదు. తొలుత బౌలర్లను వినియోగించుకున్న తీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్, కెవిన్ పీటర్సన్ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ చేస్తూ.. బుమ్రా బదులు పాండ్య తొలి ఓవర్ వేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. తొలి ఓవర్ను స్టార్ పేసర్ బుమ్రా కాకుండా కెప్టెన్ హార్దిక్ వేశాడు. అతడు సంధించిన 8 బంతుల్లోనే గుజరాత్ ఓపెనర్లు 19 పరుగులు రాబట్టారు.
కెవిన్ పీటర్సెన్.. ‘‘జస్ప్రీత్ బుమ్రా ఎందుకు తొలి ఓవర్ వేయలేదు?’’
సునీల్ గావస్కర్.. ‘‘ఇది చాలా మంచి ప్రశ్న. బుమ్రా పదునైన బౌలర్’’
దీంతో ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్ వేదికగా ‘‘బుమ్రా ఎక్కడ?’ అంటూ పోస్టు పెట్టడంతో వైరల్గా మారింది. పాండ్య బ్యాటింగ్ ఆర్డర్పైనా పఠాన్ విమర్శలు గుప్పించాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ను తప్పించుకోవడానికి టిమ్ డేవిడ్ను ముందు పంపించాడనే అర్థంలో వ్యాఖ్యలు చేశాడు.
గుజరాత్ ఇన్నింగ్స్లో నాలుగో ఓవర్ వేసిన బుమ్రా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. వృద్ధిమాన్ సాహాను క్లీన్బౌల్డ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో బుమ్రా కేవలం 14 రన్స్కే 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మొదట బౌలింగ్ ప్రారంభించిన పాండ్య మాత్రం వికెట్ లేకుండానే 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించాడు. దీంతో హార్దిక్ ప్రణాళికలపై విమర్శలు రేగాయి. ఇటువైపు లక్ష్య ఛేదనలోనూ నాలుగు బంతుల్లోనే 11 రన్స్ చేసిన హార్దిక్.. కీలక సమయంలో ఔట్ కావడంతో ముంబయికి ఓటమి తప్పలేదు.
తీవ్ర నిరుత్సాహానికి గురైన రోహిత్..
రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్తో గాడిలో పడిన జట్టును మిగతా బ్యాటర్లు వదిలేయడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. రోహిత్ ఔటైన సమయానికి ముంబయి స్కోరు 12.1 ఓవర్లలో 107/3. చివరి 47 బంతుల్లో ఆ జట్టు విజయానికి కావాల్సిన పరుగులు 62. టీ20ల్లో ఈజీగా ఛేదించగల స్కోరే. కానీ, చివరి వరకూ క్రీజ్లో ఉండాల్సిన కెప్టెన్ హార్దిక్ మాత్రం కీలక సమయంలో ఔటైపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం రోహిత్ను వెనుక నుంచి పాండ్య హగ్ చేసుకున్నప్పటికీ.. రోహిత్ మాత్రం తీవ్ర నిరుత్సాహంతో కనిపించాడు. పాండ్యతో సీరియస్గా మాట్లాడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఆ పక్కనే ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ కూడా ఉన్నారు. రోహిత్ కెప్టెన్గా లేకపోయినప్పటికీ.. మ్యాచ్ సమయంలో హార్దిక్తోపాటు సహచరులకు సూచనలు ఇస్తూ కనిపించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM