KKR-IPL 2024: కేకేఆర్కు టైటిల్.. వీళ్ల ఆటను మరిచిపోలేం..!
మెగా లీగ్ ఛాంపియన్గా నిలవాలంటే జట్టులోని ప్రతి ఒక్కరూ నాణ్యమైన ప్రదర్శన చేయాలి. కొందరు ఆరంభంలో ఆకట్టుకుంటే.. మరికొందరు కీలక సమయంలో అడుగు ముందుకేస్తారు.
కోల్కతా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా నిలిచింది. మెంటార్ గౌతమ్ గంభీర్ వెనుకుండి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరే కాకుండా ఈ సీజన్లో మరికొందరి ఆటను గుర్తు చేసుకోవాల్సిందే.
సాల్ట్ - నరైన్ జోడీ..
లీగ్ ప్రారంభం నుంచి హైదరాబాద్ ఓపెనర్ల దూకుడే ఎక్కువగా వినిపించింది. కానీ, తామేం తక్కువ కాదంటూ కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ - సునీల్ నరైన్ జోడీ అదరగొట్టింది. దాదాపు ప్రతి మ్యాచ్లో వీరి నుంచి శుభారంభం దక్కడం గమనార్హం. ప్లేఆఫ్స్కు సాల్ట్ దూరమైనా సరే.. అతడి స్థానంలో వచ్చిన గుర్బాజ్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అదరగొట్టాడు. ఈ సీజన్లో నరైన్ ఓపెనర్గా 488 పరుగులు చేశాడంటే అతడి ఆట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో 17 వికెట్లు కూడా తీయడంతో అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు వరించింది.
కుర్రాళ్లు తీసిపోలేదు..
ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో రాణిస్తే ప్రపంచమంతా చూస్తుంది. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు అవకాశం ఉంది. అలా జరగాలంటే మొదట భారీ లీగ్లో ఛాన్స్ రావాలి. అలాంటి వారిలో వెంకటేశ్ అయ్యర్, రఘువంశి ఉన్నారు. ప్లేఆఫ్స్లో అయ్యర్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫైనల్లోనూ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, లీగ్ స్టేజ్లో కొన్ని మ్యాచుల్లోనే అవకాశం దక్కించుకున్న రఘువంశి కూడా కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. దిల్లీపై కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
విమర్శలే సోపానాలుగా..
కోల్కతా బౌలర్ హర్షిత్ రాణాపై తొలి మ్యాచ్లోనే భారీ జరిమానా పడింది. దానికి కారణం హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసిన తర్వాత ‘ఫ్లైయింగ్ కిస్’ ఇచ్చి విమర్శలపాలయ్యాడు. అతడిపై సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ ఎక్కువైంది. కుర్రాడికి ఇంత ఆవేశం అక్కర్లేదని కామెంట్లు వచ్చాయి. అయితే, వాటినే తన విజయానికి మెట్లుగా వాడుకొని హర్షిత్ చెలరేగిపోయాడు. ఆ వికెట్ కేవలం గాలివాటం కాదని నిరూపిస్తూ ఈ సీజన్లో హర్షిత్ 19 వికెట్లు తీశాడు. ఫైనల్లోనూ సన్రైజర్స్ ఎదురు కావడంతో ఎదురు దాడి చేస్తుందేమోనని అంతా భావించారు. కానీ, ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం భయపడకుండా కీలక వికెట్లను తీశాడు. హర్షిత్ వేగంగా వేసిన బంతిని ఆడబోయిన నితీశ్ రెడ్డి వికెట్ కీపర్కు క్యాచ్ ఇవ్వగా.. స్లో డెలివరీతో డేంజరస్ బ్యాటర్ క్లాసెన్ను బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు. ఒత్తిడి సమయంలోనూ సహనం కోల్పోకుండా అతడు ఆడిన తీరు అభినందనీయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
శ్రేయస్ ఆటతోపాటు కెప్టెన్సీ హైలైట్..
మెగా టోర్నీని చూసేవాళ్లకే ఎంత టెన్షన్ ఉంటుందో కదా.. మరి జట్టును నడిపించే వారి పరిస్థితేంటి? అటు సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటూ తాను కూడా నాణ్యమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మెంటార్గా గంభీర్ కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలడు. మైదానంలో టీమ్ను నడిపించే భారం మాత్రం కెప్టెన్ శ్రేయస్దే. ఈ విషయంలో 100 శాతం అత్యుత్తమ సారథిగా నిలిచాడు. బ్యాటింగ్లోనూ మిడిలార్డర్లో వచ్చే అయ్యర్ 351 పరుగులు చేశాడు. ప్లేఆఫ్స్లోని తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ కేవలం 24 బంతుల్లోనే 58 పరుగులు రాబట్టి కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టుకు అలవోక విజయం అందించాడు. ఇటు ఫైనల్లో బౌలింగ్ మార్పులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి పట్టు సాధించేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి