KL Rahul - Mayank Yadav: పేస్ సంచలనం మయాంక్ గాయంపై కేఎల్ రాహుల్ కీలక అప్డేట్
కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ తన సొంత మైదానంలో ఓటమిని చవిచూసింది. అన్ని విభాగాల్లో రాణించిన దిల్లీ రెండు పరాజయాల తర్వాత విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో లఖ్నవూ రెండో ఓటమిని చవిచూసింది. సొంతమైదానం ఏకనా స్టేడియం వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా తమ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ (Mayank Yadav) గాయంపై లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బిగ్ అప్డేట్ ఇచ్చాడు. తమ ఓటమికిగల కారణాలనూ వెల్లడించాడు.
‘‘మయాంక్ పరిస్థితి మరీ దారుణంగా ఏమీ లేదు. ఫిట్నెస్ పరంగా ఫర్వాలేదు. వందశాతం ఫిట్గా ఉంటేనే మ్యాచ్లో ఆడించాలని అనుకున్నాం. అతడు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రిస్క్ వద్దని విశ్రాంతినిచ్చాం. మరో రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. తప్పకుండా తిరిగి వచ్చి అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం మాకుంది’’ అని కేఎల్ తెలిపాడు. లఖ్నవూ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.
మేం 20 పరుగులు వెనుకబడ్డాం
‘‘దిల్లీతో మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా వెనుకబడ్డాం. మరో 20 పరుగులు చేయాల్సింది. ఆరంభం బాగున్నా.. సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం. మొదట్లో సీమర్లకు పిచ్ నుంచి సహకారం లభించింది. ఆ తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కీలక సమయంలో వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ ఓవర్ తర్వాత స్పిన్ పెద్దగా తిరగడం లేదని అనుకున్నాం. నికోలస్ పూరన్ దూకుడుగా ఆడి ఒత్తిడి తెస్తాడని భావించాం. అతడు క్రీజ్లో కుదురుకుంటే ప్రమాదకరంగా మారతాడు. కానీ, అలా జరగలేదు. చివర్లో మా కుర్రాళ్లు రాణించారు కాబట్టే ప్రత్యర్థి ఎదుట ఆ లక్ష్యమైనా ఉంచగలిగాం. దిల్లీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ బ్యాటింగ్ బాగా చేశాడు. పవర్ ప్లేలోనే వార్నర్ వికెట్ను సాధించాం. పంత్ - ఫ్రేజర్ మా నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఆదివారం మ్యాచ్ కోసం మేం సిద్ధం కావాలి. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని బరిలోకి దిగుతాం. షెడ్యూల్ కూడా కాస్త క్లిష్టంగా ఉంది. ఎండలతో ఆటగాళ్లు త్వరగా అలసిపోతారు. కోల్కతాతో మధ్యాహ్నం మ్యాచ్ను ఆడాల్సి ఉంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు