Sunil Narine: ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు.
సునీల్ నరైన్ (Sunil Narine).. ఈ పేరు చెబితే ఐపీఎల్ జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. కానీ ఇప్పుడు భయపడుతోంది అతడి స్పిన్ మాయాజాలానికి కాదు. అతను బ్యాటుతో సాగిస్తున్న విధ్వంసానికి. లోయరార్డర్ బ్యాటర్ అయిన అతను.. ఓపెనర్గా వచ్చి రెచ్చిపోతున్న తీరు అనూహ్యం. వరుసగా రెండో మ్యాచ్లో అతను బ్యాటుతో జట్టుకు విజయం సాధించిపెట్టడంతో రాబోయే మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్లు అతడికి అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సిన పరిస్థితి.
ఐపీఎల్-17 తొలి మ్యాచ్లో ఓడినా, రెండో మ్యాచ్ గెలిచిన ఉత్సాహంలో సొంతగడ్డపై మార్చి 29న కోల్కతాతో మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగింది బెంగళూరు. కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ (83 నాటౌట్) ఆడడంతో ప్రత్యర్థికి 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆర్సీబీ. విజయం తమ జట్టుదే అని బెంగళూరు అభిమానులు ధీమాగా ఉన్నారు. కానీ కోల్కతా ఇన్నింగ్స్ మొదలైన అరగంటలో వాళ్లందరూ చల్లబడిపోయారు. స్పిన్ బౌలరైన సునీల్ నరైన్ ఓపెనర్గా దిగి కేవలం 22 బంతుల్లోనే 47 పరుగులు చేసి మ్యాచ్ను నైట్రైడర్స్ వైపు తిప్పేశాడు. ఈ ఇన్నింగ్స్ గాలివాటం కాదని రుజువు చేస్తూ.. తర్వాతి మ్యాచ్లో మరింతగా రెచ్చిపోయాడు. విశాఖపట్నంలో బుధవారం జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్పై నరైన్ ప్రతాపం మామూలుగా లేదు. 39 బంతుల్లోనే 85 పరుగులు సాధించి డీసీని మ్యాచ్లో లేకుండా చేసేశాడు. 21 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. నోకియా, ఇషాంత్ శర్మ లాంటి ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపించాడు. నరైన్ హిట్టింగ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. కొన్ని షాట్లు ఆడి ఔటైపోతుంటాడు. కానీ ఈ సీజన్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దిల్లీపై 13వ ఓవర్ వరకు అతను క్రీజులో నిలిచాడు. ఇంకో రెండు మూడు షాట్లు సరిగా కనెక్ట్ అయి ఉంటే అతడి సెంచరీ కూడా పూర్తయ్యేది. డీసీతో మ్యాచ్ చూశాక అన్ని జట్లూ నరైన్ విషయంలో అప్రమత్తమై ఉంటాయనడంలో సందేహం లేదు.
ఈ మార్పు వెనుక అతను..
నరైన్ ప్రధానంగా స్పిన్నర్. అతణ్ని వెస్టిండీస్ జట్టులో కానీ, ఐపీఎల్లో కానీ ఒకప్పుడు ఎవరూ ఆల్రౌండర్గా చూసేవారు కాదు. 9, 10 స్థానాల్లో అతను బ్యాటింగ్ చేసేవాడు. అయితే 2017 ఐపీఎల్లో అప్పటి కోల్కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్.. నరైన్తో ఎవ్వరూ ఊహించని ప్రయోగం చేశాడు. తాను ఓపెనర్గా తప్పుకుని.. క్రిస్ లిన్తో కలిసి ఆ సీజన్లో నరైన్తో ఓపెనింగ్ చేయించాడు. ఇది సత్ఫలితాలనే ఇచ్చింది. తన వికెట్కు అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో నరైన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కొన్ని మ్యాచ్ల్లో జట్టుకు అదిరే ఆరంభాలనిచ్చాడు. ఆ సీజన్లో ఒక అర్ధసెంచరీ సహా 224 పరుగులు చేశాడు నరైన్. అతడి స్థాయికి అవి ఎక్కువ పరుగులే. ఆ సీజన్లో నరైన్ ఓపెనింగ్ ప్రయోగం ఫలించినా.. తర్వాతి సీజన్కు అతను తిరిగి లోయరార్డర్కు వెళ్లిపోయాడు. 2018లో గంభీర్ కోల్కతా జట్టును వీడి దిల్లీకి వెళ్లిపోవడంతో నరైన్ను టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. అప్పట్నుంచి కేవలం బౌలర్ పాత్రకే పరిమితం అవుతూ వచ్చాడు. అయితే గత రెండు సీజన్లలో లఖ్నవూ జట్టుకు మెంటార్గా ఉన్న గంభీర్.. ఈ సీజన్కు అదే పాత్రలో నైట్రైడర్స్కు మారడంతో తన దృష్టి నరైన్ మీద పడింది. ఒకప్పుడు కెప్టెన్గా చేసిన ప్రయోగాన్ని మెంటార్గా రిపీట్ చేశాడు. ఈసారి ఆ ప్రయోగం ఇంకా గొప్ప ఫలితాలను ఇస్తోంది. నరైన్ స్పిన్ బౌలింగ్లో ఒకప్పటి మాయాజాలం లేకపోయినా.. బ్యాటింగ్లో చెలరేగుతూ జట్టులో తన విలువను పెంచుకుంటున్నాడు. మరి ఈ సీజన్ అంతా నరైన్ మెరుపులు ఇలాగే కొనసాగుతాయేమో చూడాలి.
విండీస్ పట్టించుకుంటుందా?
వెస్టిండీస్ క్రికెటర్లలో ఎంత ప్రతిభ ఉన్నా.. ఆ దేశ బోర్డు మాత్రం సరిగా ఉపయోగించుకోదు. గేల్, పొలార్డ్, బ్రావో, రసెల్, నరైన్.. ఇలా ఎందరో మేటి క్రికెటర్ల సేవలను ఆ జట్టు పూర్తి స్థాయిలో వాడుకోలేదు. కాంట్రాక్టులు, జీతాల విషయంలో బోర్డు తమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించకపోవడంతో చాలా ఏళ్లుగా విండీస్ క్రికెటర్లు ఫ్రాంఛైజీ క్రికెట్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశానికి ఆడడం తగ్గించేశారు. లీగ్ క్రికెటర్లో వెస్టిండీస్ క్రికెటర్ల మెరుపులు చూస్తే వీళ్లంతా కలిసి దేశానికి ఆడితే కరీబియన్ క్రికెట్ కథే వేరుగా ఉంటుంది. కానీ బోర్డుతో గొడవ వల్ల ఎప్పుడు ఎవరు వెస్టిండీస్ జట్టులో ఉంటారో తెలియని పరిస్థితి. నరైన్ లాంటి మిస్టరీ స్పిన్నర్, విధ్వంసకర బ్యాటర్ టీ20ల్లో ఏ జట్టుకైనా ఎంతో విలువ చేకూరుస్తాడు. కానీ అతను 2019 తర్వాత వెస్టిండీస్కు ఆడనే లేదు. అయితే ఈ ఐపీఎల్లో నరైన్ ప్రదర్శన చూస్తున్న కరీబియన్ అభిమానులకు జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్లో విండీస్ తరఫునా ఇలాగే మెరుపులు మెరిపిస్తే చూడాలని ఆశ. మరి విండీస్ బోర్డు అతడితో మాట్లాడి జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!