Sreesanth: ‘ఫిక్సర్’ వ్యాఖ్యలు.. శ్రీశాంత్కు లీగల్ నోటీసులు
మైదానంలో భారత మాజీ క్రికెటర్లు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
ఇంటర్నెట్ డెస్క్: లెజెండ్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్ సందర్భంగా.. తనను ‘ఫిక్సర్’ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడంటూ ఆరోపణలు చేసిన భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. గంభీర్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడంతో ఎల్ఎల్సీ నిర్వాహకులు ఈ మేరకు శ్రీశాంత్కు నోటీసులిచ్చారు. డిసెంబర్ 6న ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్న తనను ఉద్దేశించి గంభీర్ తీవ్ర పదజాలం వాడినట్లు శ్రీశాంత్ వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎల్ఎల్సీ మేనేజ్మెంట్ అసహనం వ్యక్తం చేసింది. టీ20 టోర్నమెంట్లో ఆడే కాంట్రాక్ట్ను ఉల్లంఘించినందుకు శ్రీశాంత్కు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. పెట్టిన వీడియోలను తొలగిస్తేనే.. అతడితో మాట్లాడతామని ఎల్ఎల్సీ స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంది.
శ్రీశాంత్ మరో పోస్టు వైరల్..
రెండు రోజుల కిందట ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన ఘటన మరువకముందే శ్రీశాంత్ చేసిన మరో పోస్టు వైరల్గా మారింది. గురువారం ఎల్ఎల్సీ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ను మణిపాల్ టైగర్స్ ఆటగాడు అమితోజ్ సింగ్ రనౌట్ చేశాడు. దీంతో అమితోజ్ను ప్రశంసిస్తూ శ్రీశాంత్ ‘‘అద్భుతమైన త్రో చేశావు. వెల్డన్ అమితోజ్’’ అంటూ ఇన్స్టా స్టోరీ పెట్టాడు.
గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీశాంత్ భార్య
‘గంభీర్ నన్ను ఫిక్సర్, ఫిక్సర్ అని పిలుస్తూనే ఉన్నాడు. ప్రత్యక్ష ప్రసారమవుతున్న మ్యాచ్లో అతను నన్ను ఫిక్సర్ అన్నాడు. శాంతపరిచేందుకు ప్రయత్నించిన అంపైర్లతోనూ అతను అలాగే మాట్లాడాడు’’ అని శ్రీశాంత్ తన వీడియోల్లో ఆరోపించాడు. దానికి సమాధానంగా గంభీర్ నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేసి ‘‘‘ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించాలని చూసినప్పుడు నవ్వుతూ ఉండాలి’’ అనే శీర్షిక పెట్టాడు. ఈ ఘటనపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి స్పందించారు. ‘‘భారత జట్టు కోసం ఇద్దరూ కలిసి ఆడాడు. శ్రీశాంత్ను గంభీర్ ఇలాంటి మాటలు అనడం షాక్కు గురి చేసింది. అతడి స్థాయిని దిగజార్చుకుని మరీ ఇలా వ్యాఖ్యానించడం దారుణం. శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కూడా చాన్నాళ్లు అయింది. అయినా అతడి పట్ల మైదానంలో ఇలాంటి ప్రవర్తన సరైంది కాదు’’ అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా