Yash Thakur: యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు.
ప్రత్యర్థి ఎదుట లక్ష్యం 164 పరుగులు.. తొలి వికెట్కు అర్ధశతకం బాది ఊపు మీదున్నారు ఆ జట్టు ఓపెనర్లు.. అప్పుడొచ్చాడు ఓ యువ పేసర్.. కీలకమైన వికెట్ను తీసి తన జట్టుకు జోష్ తెచ్చాడు. ఐదు వికెట్లతో మ్యాచ్నే మలుపు తిప్పేశాడు.. అతడే యశ్ ఠాకూర్. ఇప్పుడు పేసర్గా మనముందున్న యశ్కు తొలుత ధోనీని చూసి వికెట్ కీపర్ అవుదామని ఉండేదట.. కానీ, కోచ్ సూచనతో పేసర్గా మారాల్సి వచ్చింది. ఈ కుర్రాడి గురించి ఆసక్తికర విశేషాలివీ..
ఉమేశ్ ఆదర్శం..
అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్న యశ్ ఠాకూర్కు భారత పేసర్ ఉమేశ్ యాదవ్ ఆదర్శమని పలు సందర్భాల్లో చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో విదర్భకు ఆడేటప్పటినుంచి ఉమేశ్ బౌలింగ్ యాక్షన్ను యశ్ అనుసరించేవాడు. అతడిలానే బంతులను సంధించడం ప్రారంభించాడు. అయితే, క్రికెట్ కెరీర్ తొలి నాళ్లల్లో యశ్ వికెట్ కీపర్ అవుదామని భావించాడు. దానికి కారణం ఎంఎస్ ధోనీ.. అతడిని చూసే ప్రాక్టీస్ చేయడం కూడా ప్రారంభించాడు. అప్పుడప్పడు నెట్స్లో బౌలింగ్ కూడా చేస్తుంటాడు. అలా బంతులను విసురుతున్న యశ్ను విదర్భ మాజీ కెప్టెన్, కోచ్ ప్రవీణ్ హింగనికర్ చూశాడు. ఫాస్ట్ బౌలర్గా మారమని సూచించాడు.
రూ. 45 లక్షలకే..
తన కోచ్ సూచన మేరకు పేసర్గా అవతారం ఎత్తిన యశ్ ఠాకూర్ అందులోనూ సత్తా చాటాడు. డొమిస్టిక్లో విదర్భ తరఫున 22 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన యశ్ 67 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు దేశవాళీలో 48 టీ20ల్లో 69 వికెట్లు తీసిన అనుభవం ఉంది. దీంతో గతేడాది ఐపీఎల్ సీజన్కు ముందు జరిగిన వేలంలో లఖ్నవూ రూ.45 లక్షలు వెచ్చించి దక్కించుకుంది. ఆ సీజన్లో 9 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. 9.08 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఇప్పుడీ ఎడిషన్లోనూ మంచి ఆరంభమే దక్కింది. మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు.
తొలి బౌలర్ అతడే..
గుజరాత్తో మ్యాచ్లో పవర్ప్లే చివరి ఓవర్లో బౌలింగ్కు వచ్చాడు. శుభ్మన్ గిల్ను బౌల్డ్ చేసిన యశ్ ఠాకూర్.. లఖ్నవూకు తొలి బ్రేక్ ఇచ్చాడు. మరో పేసర్ మాయంక్ యాదవ్ గాయం కారణంగా మైదానం వీడటంతో నవీనుల్ హక్తో కలిసి యశ్ పేస్ భారాన్ని మోశాడు. మధ్యలో బిష్ణోయ్, కృనాల్ పాండ్య వికెట్లు తీసి లఖ్నవూకు బ్రేక్ ఇచ్చినా.. కీలకమైన బ్యాటర్లను ఔట్ చేసి స్వల్ప స్కోరు మ్యాచ్లో లఖ్నవూను పైచేయిగా నిలిపాడు. గిల్తోపాటు విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వికెట్లను తీశాడు. కేవలం 30 పరుగులను మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో ఫైఫర్ తీసిన తొలి బౌలర్గా అవతరించాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మెయిడిన్ చేయడం విశేషం. అందులో డేంజరస్ బ్యాటర్ రషీద్ ఖాన్ వికెట్ కూడా ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ను సొంతం చేసుకున్నాడు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత