Lucknow X Chennai: అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యాన్ని లఖ్నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లఖ్నవూ: ఐపీఎల్ 2024లో చెన్నై (Chennai) వరుస విజయాలకు బ్రేక్ పడింది. సొంతమైదానంలో లఖ్నవూ (Lucknow) 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత చెన్నై 176 పరుగులకే కట్టడి చేసిన లఖ్నవూ.. అనంతరం 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (82: 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు), డికాక్ (54 : 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లు ఈ మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, పతిరన ఒక్కో వికెట్ తీశారు.
చెలరేగిన రాహుల్, డికాక్..
177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన లఖ్నవూకు ఓపెనర్లు రాహుల్ (KL Rahul), డికాక్ (De Kock) తొలి వికెట్కు 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఓవర్లో కేవలం 3 పరుగులు తీసిన లఖ్నవూ.. ఆతర్వాత రెచ్చిపోయింది. పవర్ ప్లే ముగిసే సరికి 54 పరుగులతో నిలిచింది. ఇద్దరు బ్యాటర్లు నిలకడగా ఆడతూ ఇన్నింగ్స్ నిర్మించారు. అడపాదడపా ఫోర్లు, సిక్స్లతో చెలరేగారు. ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 89 పరుగులు చేసింది. జడేజా వేసిన 11వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రాహుల్ 31 బంతుల్లో అర్ధశతకం చేశాడు. మరోవైపు డికాక్ ముస్తాఫిజుర్ బౌలింగ్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరిని ఔట్ చేయడానికి చెన్నై బౌలర్లు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ జోడిని ముస్తాఫిజుర్ 134 పరుగుల వద్ద విడదీశాడు. 15వ ఓవర్ చివరి బంతికి డికాక్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో 27 పరుగుల తర్వాత పతిరన వేసిన 18వ ఓవర్ తొలిబంతికి జడేజా అద్భుతంగా క్యాచ్ పట్టడంతో రాహుల్ వెనుదిరిగాడు. అప్పటికే లఖ్నవూ విజయం ఖాయమైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టాయినిస్ (8*)తో కలిసి పూరన్ (23: 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) లాంఛనాన్ని ముగించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*: 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) అజింక్యా రహానె (36: 24 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్), మొయిన్ అలీ (30: 20 బంతుల్లో 3 సిక్స్లు) పరుగులు చేశారు. చివర్లో ధోనీ (28: 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) విరుచుకుపడ్డాడు. లఖ్నవూ బౌలర్లలో కృనాల్ పాండ్య 2, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, స్టాయినిస్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి