Mumbai vs Lucknow: చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది.
ముంబయి: ఐపీఎల్ 2024లో భాగంగా లీగ్ దశలో తన చివరి మ్యాచ్ను లఖ్నవూ విజయంతో ముగించింది. ముంబయితో జరిగిన పోరులో ఆ జట్టు 18 పరుగుల తేడాతో నెగ్గింది. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులకు పరిమితం అయింది. రోహిత్ శర్మ (68: 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు), నమన్ ధీర్ (62*: 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధశతకాలతో చెలరేగారు. లఖ్నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్, నవీనుల్ హక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, కృనాల్ పాండ్య, మోసిన్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. ముంబయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్కు కొంతసేపు విరామం ఇచ్చారు.
రోహిత్ చెలరేగినా..
215 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబయి తొలి వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యం లభించింది. రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్ (23) దూకుడుగా ఆడారు. అయితే స్వల్ప తేడాతో బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఔటయ్యారు. దీంతో ముంబయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (16), వధేరా (1) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. దీంతో ముంబయి 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులతో నిలిచింది. మరోవికెట్ పడకుండా ఇషాన్ కిషన్తో జట్టు కట్టిన నమన్ ధీర్ మెళ్లిగా ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండడంతో ముంబయి ఓటమి దిశగా పయనించింది. చివర్లో నమన్ ధీర్ చెలరేగినప్పటికీ కేవలం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్నవూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(55), పూరన్(75) అర్ధశతకాలతో రాణించారు. ముంబయి బౌలర్లలో నువాన్ తుషార, పీయుష్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. మొదటి నుంచి ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పవర్ప్లే(తొలి 6 ఓవర్లు)లో లఖ్నవూ 2 వికెట్లు కోల్పోయి 49 పరుగులే చేసింది. తొలి ఓవర్లోనే తుషార బౌలింగ్లో పడిక్కల్ వికెట్ల ముందు దొరికి డకౌట్ అయ్యాడు. ఓ వైపు కెప్టెన్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకొని అర్ధశతకం సాధించాడు. పూరన్ (8 సిక్సులు, 5 ఫోర్లు) చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సులు(36)సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్టాయినిస్(28), ఆయుష్ బదోనీ(22*) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో దీపక్(11), అర్హద్ ఖాన్(0), కృనాల్పాండ్య(12*) పరుగులు చేశారు.
ఒక్క మ్యాచ్తో మూడు జట్లు ఇంటికి..
ఈ ఒక్క మ్యాచ్తో లఖ్నవూ, దిల్లీ, ముంబయి మూడు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. 14 మ్యాచ్లు ఆడిన లఖ్నవూ, దిల్లీ జట్లు 7 మ్యాచ్ల్లో విజయాలు సాధించగా, చెన్నై 14 పాయింట్లతో మెరుగైన నెట్రన్రేట్ కలిగి ఉంది. దీంతో ఈ రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక ముంబయి కేవలం 14 మ్యాచ్ల్లో 4 విజయాలతో టోర్నీ ముగించింది. ఇప్పటికే కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోగా, మరో స్థానం కోసం చెన్నై, బెంగళూరు పోటీ పడుతున్నాయి. చెన్నై, బెంగళూరు జట్లు శనివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే నెట్రన్రేట్ ఏ జట్టుకు ఎక్కువుంటే ఆ జట్టు ప్లేఆఫ్స్కు వెళుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత